Rahul Gandhi Speech: డోక్లాం గురించి రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. స్పీచ్ అడ్డుకున్న రాజ్‌నాథ్, అమిత్ షా- లోక్‌సభలో గందరగోళం

2 months ago 5
ARTICLE AD
<p style="text-align: justify;">న్యూఢిల్లీ: లోక్&zwnj;సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ వాడివేడిగా సాగుతోంది. ఫిబ్రవరి 2న ప్రతిపక్ష నాయకుడు, <a title="కాంగ్రెస్" href="https://telugu.abplive.com/topic/Congress" data-type="interlinkingkeywords">కాంగ్రెస్</a> ఎంపీ రాహుల్ గాంధీ రాష్ట్రపతి ప్రసంగంపై చర్చిస్తూ డోక్లాం గురించి ప్రస్తావించారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంటులో గందరగోళం చెలరేగింది. రాహుల్ గాంధీ డోక్లాం గురించి మాట్లాడటం ప్రారంభించగానే, రక్షణ మంత్రి రాజ్&zwnj;నాథ్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ, రాష్ట్రపతి ముర్ము ప్రసంగంలో ఈ విషయాలు లేవన్నారు. పార్లమెంటులో డోక్లాం, చైనా అంశాలు ప్రస్తావించడంతో రాజ్&zwnj;నాథ్ సింగ్ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ &nbsp;ప్రకటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.&nbsp;</p> <p style="text-align: justify;"><strong>&nbsp;ఆర్మీ మాజీ చీఫ్ నరవణే పుస్తకంపై వివాదం</strong></p> <p style="text-align: justify;">రాహుల్ గాంధీ మాజీ ఆర్మీ చీఫ్ నరవణే పుస్తకంలో చైనా, డోక్లాం గురించి రాసిన ప్రకటనను ప్రస్తావించాలని డిమాండ్ చేశారు.&nbsp; అయితే, రాజ్&zwnj;నాథ్ సింగ్ లేచి దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ప్రస్తావిస్తున్న పుస్తకం ముద్రించలేదని అన్నారు. రాహుల్ సూచన కచ్చితంగా తప్పు అవుతుంన్నారు. దీనిపై లోక్&zwnj;సభ స్పీకర్ ఓం బిర్లా కలగజేసుకుని, ప్రచురితం కాని పుస్తకం గురించి పార్లమెంటులో మాట్లాడకూడదంటూ రాహుల్&zwnj; ప్రసంగాన్ని అడ్డుకున్నారు.</p> <p style="text-align: justify;">కేంద్ర హోం మంత్రి <a title="అమిత్ షా" href="https://www.abplive.com/topic/amit-shah" data-type="interlinkingkeywords">అమిత్ షా</a> సైతం ప్రతిపక్షనేత రాహుల్&zwnj; గాంధీ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నవరణే పుస్తకం పబ్లిష్ అయిందా లేదో రాహుల్ గాంధీ చెప్పాలన్నారు. మీరు సభను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించవద్దని, ఇక్కడ అనవసరమైన విషయాలు మాట్లాడవద్దని <a title="రాహుల్ గాంధీ" href="https://telugu.abplive.com/topic/Rahul-Gandhi" data-type="interlinkingkeywords">రాహుల్ గాంధీ</a>కి రాజ్&zwnj;నాథ్, అమిత్ షా సూచించారు.</p>
Read Entire Article