Power Restoration in AP :మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ ఎప్పుడు? మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కీలక ప్రకటన

1 month ago 2
ARTICLE AD
<p><strong>Power Restoration in Cyclone-Affected Areas:</strong> ఆంధ్రప్రదేశ్&zwnj;లో మొంథా తుపాను ప్రభావంతో ఊళ్లకు ఊళ్లే అల్లాడి పోయాయి. గాలి వానలకు జనజీవనం స్తంభించి పోయింది. రాకపోకలు నిలిచిపోయాయి. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యల కారణంగా ప్రాణ నష్టం నివారించారు. కానీ ఆస్తి నష్టం మాత్రం భారీగానే ఉంది. ముందు జాగ్రత్తగా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపేశారు. మరికొన్ని ప్రాంతాల్లో స్తంభాలు విరిగిపడి, చెట్లు నేల కూలి విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ జరగలేదు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నా వర్షం కారణంగా పనులు ఆగుతూ సాగుతున్నాయి. దీనిపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అధికారులతో చర్చించారు.&nbsp;</p> <p>విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, సీఎండీతో ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సమీక్ష నిర్వహించారు. మొంథా తుపాను తీరం దాటిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సమస్యలపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సమస్య పై మంత్రి గొట్టిపాటి ఆరా తీశారు. తుపాను ధాటికి గాలులు వేగంగా వీయడంతో కొన్ని ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యుత్ సరఫరా నిలిపి వేసినట్లు అధికారుల మంత్రికి వివరించారు. పోల్ టూ పోల్ పెట్రోలింగ్ చేస్తూ సమస్య లేని చోట విద్యుత్ పునరుద్ధరణ చేయాలి అధికారులను మంత్రి గొట్టిపాటి ఆదేశించారు. ఇప్పటికే ఎస్ పీడీసీఎల్ నుంచి తీసుకొచ్చిన అదనపు సిబ్బందితో క్షేత్రస్థాయిలో పునరుద్దరణ పనులు వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిరంతరాయ విద్యుత్ సరఫరాకు అవసరమైన సామగ్రి అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేశారు. విద్యుత్ ఉద్యోగులంతా పునరుద్ధరణ చర్యల్లో అప్రమత్తంగా వ్యవహరించి ప్రమాదాలను అరికట్టేలా చూడాలని కోరారు. అయితే ఇప్పటికీ పలు ప్రాంతాల్లో వర్షం పడుతున్న కారణంగా పునరుద్ధరణకు సమయం పడుతుందని అధికారులు మంత్రి గొట్టిపాటికి వివరించారు.&nbsp;</p> <h3>విద్యుత్ పునరుద్ధరణ పనులపై మంత్రి గొట్టిపాటికి లోకేశ్ ఫోన్&nbsp;</h3> <p>ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్&zwnj;కు మంత్రి నారా లోకేశ్ ఫోన్ చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులపై ఆరా తీశారు. విద్యుత్ సమస్యపై మంత్రి గొట్టిపాటితో మాట్లాడారు. ఇవాళ్టికి వంద శాతం విద్యుత్ పునరుద్ధరణ పూర్తి చేస్తామని మంత్రి గొట్టిపాటి తెలిపారు. కొన్ని చోట్ల ప్రమాదాల నివారణకు విద్యుత్ నిలిపివేసినట్లు మంత్రి గొట్టిపాటి వెల్లడించారు. విద్యుత్ శాఖ సిబ్బంది, అధికారులు, సీఎండీలు కూడా క్షేత్రస్థాయిలో విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమైనట్లు లోకేశ్ కు వివరించారు. విద్యుత్ పునరుద్ధరణ చర్యలపై ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని <a title="నారా లోకేశ్" href="https://telugu.abplive.com/topic/Nara-Lokesh" data-type="interlinkingkeywords">నారా లోకేశ్</a> సూచించారు.</p>
Read Entire Article