<p><strong>Podharillu Serial Today Episode:</strong> ఇంటిపత్రాలు గురించి వెతుకుతున్న మాధవ్‌ వాళ్లకు కన్నా వాళ్ల అమ్మ ఫొటోదొరుకుతుంది.అది చూపించి కన్నా నిలదీయగా...ఆవిడే మీఅమ్మ అనినారాయణ చెబుతాడు. దీంతో విపరీతంగా ఏడుస్తాడు. మాధవ్‌ వాళ్లను పట్టుకుని నేను మీ సొంత తమ్ముడిని కాదు కదా అని ప్రశ్నిస్తాడు. దీంతో కేశవ్‌ మేం ఎప్పుడైనా నిన్ను అలా చూశామా అని అంటాడు. మాధవ్‌ వాడిని చాలా ఓదార్చుతాడు. చిన్నప్పటి నుంచి నిన్ను తల్లిలేని బిడ్డలా పెంచామని...మా సొంత తమ్ముడిలాచూసుకున్నామని అంటాడు. ఏరోజూ నీకు ఆ లోటు తెలియలేదని చెబుతాడు.మన తల్లులు వేరైనా తండ్రి ఒక్కడేనని అంటారు. నువ్వు కాలేజీకి వెళ్తున్నావని మేం అందరం బట్టలు కొనుక్కోకుండా కూడా నీకు బట్టలు కొనిచ్చామని గుర్తు చేస్తారు. అసలు ఏరోజూ నిన్ను మేం వేరుగా చూడలేదని...మాలో ఒకడిగానే చూశామని చెబుతారు. దీంతో కన్నా వాళ్లందరినీ పట్టుకుని వెక్కివెక్కి ఏడుస్తాడు.<br /> </p>
<p>మనం ఇంటిపత్రాలు కోసం వెతికితే కన్నాగాడి పుట్టుక గురించి బయటపడిందని మహాలక్ష్మీ చక్రితో చెప్పి బాధపడుతుంది. అసలు వాడికన్నా మనకే ఎక్కువ బాధగా ఉందని చెబుతుంది.అసలు ఏం జరిగిందని చక్రిని అడుగుతుంది. మా అమ్మ చనిపోగానే మానాన్న మా అందరినీ వదిలేసి లారీకి వెళ్లిపోయాడని....మళ్లీ ఇంటికి తిరిగిరాలేదని చెబుతాడు. ఆ తర్వాత చాలారోజులకు ఒక ఆవిడను చంటిబిడ్డతో సహా తీసుకొచ్చాడని అంటాడు.ఊరిలో అందరూ మీనాన్న రెండోపెళ్లి చేసుకున్నాడని, ఆవిడను ఉంచుకున్నాడని మాట్లాడారని అంటాడు. ఆ వయసులోమానాన్నను నిలదీసి అడిగే ధైర్యం లేదని చక్రి చెబుతాడు. కానీ వాడిని వదిలేసి వాళ్ల అమ్మ వెళ్లిపోయిందని....చచ్చిపోయిందే కూడా తెలియదని అంటాడు. మానాన్నే చంపేశాడని కూడా చెబుతారు. దీంతో మేం చిన్నపిల్లాడిగా ఉన్న వాడిని పెంచి పెద్దచేశామని చెబుతాడు.<br /> రాత్రివరకు అందరూ ఇదే విషయం ఆలోచిస్తూ ఉండటంతో మాధవ్‌ వచ్చి అందరినీ పడుకోమని చెబుతాడు.కన్నాను తన పక్కనే పడుకోబెట్టుకుంటాడు.అందరూ నిద్రపోయినా....కన్నాకు మాత్రం నిద్రరాదు. వాళ్ల నాన్న చెప్పిన మాటలు పదేపదే గుర్తుకు వస్తాయి.అసలు ఈ ఇల్లు ఇలా కావడానికి మా అమ్మే కారణమని, నేను వచ్చిన తర్వాతే వీళ్లకు కష్టాలు వచ్చాయని కన్నా అనుకుంటాడు. నేను తిరిగి వెళ్లిపోతే ఈ ఇల్లు మళ్లీ బాగుపడుతుందని అనుకుంటాడు.దీంతో ఎవరికీ చెప్పకుండా కన్నాఇంట్లో నుంచి వెళ్లిపోతాడు. ఉదయం లేవగానే కన్నా కనిపించకపోవడంతో అందరూ కంగారుపడతారు. చక్రి,మాధవ్‌ ఓ వైపు, కేశవ్ మరోవైపు వెళ్లి ఊరంతా వెతుకుతూనే ఉంటారు. రాత్రి వరకు వెతికినా ఎక్కడా కనిపించడు. కన్నా వాళ్ల ఫ్రెండ్స్‌,తెలిసినవాళ్ల ఇంటికి వెళ్లి అడుగుతారు.<br /> <iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://telugu.abplive.com/web-stories/entertainment/pooja-hegde-offer-prayers-at-the-bettu-naga-brahmasthana-of-her-ancestral-home-photos-goes-viral-245798" width="631" height="381" scrolling="no"></iframe> </p>
<p>ఊరంతా బలాదూర్ తిరిగి రాత్రికి ఇంటికి చేరుకున్న నారాణయకు మహా చీవాట్లు పెడుతుంది.అసలు మీరు వాడి కన్న తండ్రేనా అనిఅడుగుతుంది.బయట నుంచి వచ్చిన దానిని నేనే వాడు కనిపించలేదంటే తట్టుకోలేకపోతున్నానని....మీరు మాత్రం పాటలు పాడుతూ చేపలకూరు తెచ్చుకుంటారా అని మండిపడుతుంది. మర్యాదగా వెళ్లి వెతకండని.....కనిపించేవరకు ఇంటికి రావొద్దని హెచ్చరిస్తుంది. దీంతో నారాయణ ఎంతో సంతోషిస్తాడు. వాడి తల్లి కూడా వాడికోసం ఇంత ఆరాటపడలేదని....నిన్ను చూస్తుంటే సంతోషంగాఉందని ఈ ఇంట్లో వాళ్ల కోసం ఆలోచించే బయటి వ్యక్తివి నువ్వు ఒక్కదానివేనంటూ వాడికోసం వెతుకుతానని బయలుదేరి వెళ్లిపోతాడు.</p>
<p>అప్పుడే మహాకు క్యారమ్ బోర్డు కనిపిస్తుంది.గతంలో తనతో క్యారమ్‌ ఆడేప్పుడు కన్నా చెప్పిన మాటలు మహాకు గుర్తుకువస్తాయి.తనకు ఏ చిన్న బాధ కలిగినా ఒకచోటకు వెళ్లి ఉంటానని చెప్పగా...వెంటనే మహా చక్రికి ఫోన్‌ చేసి ఆ ప్లేస్‌ చెబుతుంది.మాధవ్,కన్నా అక్కడికి వెళ్లి చూడగా కన్నా అక్కడే కూర్చుని బాధపడుతూ ఉంటాడు. వెంటనే చక్రి వెళ్లి వాడిని తీసుకుని ఇంటికి వస్తాడు. </p>
<p> </p>