PM Modi slams Congress: కాంగ్రెస్ ఇప్పటికే నగ్నంగా మారింది.. AI సమ్మిట్లో కాంగ్రెస్ నిరసనపై ప్రధాని మోదీ ఘాటు వ్యాఖ్యలు

1 month ago 6
ARTICLE AD
<p>మీరట్: దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్&zwnj;లో యూత్ కాంగ్రెస్ చేసిన షర్ట్&zwnj;లెస్ (చొక్కాలు విప్పి) నిరసనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్&zwnj;పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. యూపీలోని మీరట్&zwnj;లో నిర్వహించిన బహరంగ సభలో ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'కాంగ్రెస్ ఒక ప్రపంచ స్థాయి కార్యక్రమాన్ని తన మురికి, చెత్త రాజకీయాలకు కేంద్రంగా మార్చేసింది. మీరు ఇప్పటికే నగ్నంగా ఉన్నారని దేశ ప్రజలకు తెలుసు' అని సంచలన వ్యాఖ్యలు చేశారు.</p> <p><strong>ప్రధాని మోదీ ఏమన్నారు</strong><br />ఆదివారం జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ 'దేశంలోనే కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. అవి దేశ విజయాలను జీర్ణించుకోలేకపోతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద AI సదస్సు భారత్&zwnj;లో జరగడాన్ని మీరు చూశారు. మీరట్ ప్రజలను నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. ఈ AI సమ్మిట్ జరిగినందుకు మీరు గర్వపడ్డారా లేదా?. దేశమంతా గర్వపడుతుంటే కాంగ్రెస్, దాని మద్దతుదారులు ఏం చేస్తున్నారు. ఒక అంతర్జాతీయ కార్యక్రమాన్ని కాంగ్రెస్ తన మురికి, దిగజారుడు రాజకీయాలకు అడ్డాగా మార్చింది. కార్యక్రమ వేదిక వద్ద విదేశీ అతిథుల ముందు కాంగ్రెస్ నాయకులు బట్టలు విప్పి వెళ్లారు. నేను కాంగ్రెస్ నేతల్ని ఒకటి అడుగుతున్నాను. మీరు ఇప్పటికే నగ్నంగా ఉన్నారని, ప్రజలు ఎన్నికల్లో మీ బట్టలు విప్పి నగ్నంగా నిల్చోబెట్టారు. మరి ఇప్పుడు బట్టలు విప్పాల్సిన అవసరం ఏమొచ్చింది?' అని ప్రశ్నించారు.</p> <p><strong>&nbsp;దేశాన్ని బద్నా చేయడంలో కాంగ్రెస్ బిజీ - ప్రధాని మోదీ</strong><br />ప్రధాని మోదీ ఇంకా మాట్లాడుతూ 'కాంగ్రెస్ నాయకులు చేసిన పని, దేశంలోని పురాతన పార్టీ ఎంత దరిద్రంగా మారిపోయిందో చూపిస్తుంది. ఇలా చేస్తారని ఎవరూ ఊహించలేరు. మనమైతే గ్రామంలో ఎవరి ఇంట్లో పెళ్లి జరిగినా, అతిథులు వెళ్లేటప్పుడు గ్రామం గురించి మంచి అభిప్రాయంతో వెళ్లాలని చూస్తాం. ఆ పెళ్లి వేడుక సక్సెస్ చేయడానికి ప్రాణం పెట్టి పని చేస్తాం, కానీ కాంగ్రెస్ మాత్రం విదేశీ అథిదుల ఎదుట తన దేశాన్ని బద్నాం చేయడంలో బిజీగా ఉంది' అని అన్నారు.</p> <p><strong>నన్ను సమాధి చేయాలని చూస్తున్నారు..</strong><br />ఆయన లక్ష్యంగా చేసుకుంటూ ఇలా అన్నారు, 'కాంగ్రెస్ నాయకులకు మోదీ అంటే ద్వేషం. ఈ వ్యక్తులు నా సమాధి తవ్వాలనుకుంటున్నారు. నా తల్లిని దూషించడానికి కూడా వెనకాడటం లేదు. వారికి బిజెపి-ఎన్డిఏ అంటే వ్యతిరేకత ఉంది. మీ రాజకీయాల్లో ఇది చేయడం అవసరమే కావచ్చు. మేము దీనిని కూడా సహిస్తాము. AI సమ్మిట్ అనేది బీజేపీ వేడుక కాదని, అక్కడ <a title="బీజేపీ" href="https://telugu.abplive.com/topic/BJP" data-type="interlinkingkeywords">బీజేపీ</a> నాయకులు ఎవరూ లేరని కాంగ్రెస్ గుర్తుంచుకోవాల్సింది. ఇది దేశ కార్యక్రమం. కాంగ్రెస్ మొన్న అన్ని మర్యాదలను ఉల్లంఘించింది, దేశమంతా ఈ కాంగ్రెస్ రీతి, నీతిపై థూ థూ అంటోంది. ఇంత పెద్ద పార్టీ నాయకులు సిగ్గుపడాల్సింది పోయి గర్జిస్తున్నారు, దేశాన్ని అవమానించే వారికి జై కొడుతున్నారు.'</p> <p>అసలు విషయం ఏమిటి?<br />ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ సందర్భంగా శుక్రవారం (ఫిబ్రవరి 20) యూత్ <a title="కాంగ్రెస్" href="https://telugu.abplive.com/topic/Congress" data-type="interlinkingkeywords">కాంగ్రెస్</a> కార్యకర్తలు లోపలికి చొరబడి నిరసన తెలిపారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం మరియు భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరియు ప్రధానమంత్రి <a title="నరేంద్ర మోదీ" href="https://telugu.abplive.com/topic/narendra-modi" data-type="interlinkingkeywords">నరేంద్ర మోదీ</a>కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొంతమంది నిరసనకారులు ఈ సమయంలో తమ షర్టులను విప్పి, ఇండియా AI సమ్మిట్ డిస్ప్లే బోర్డుల ముందు నిలబడి నినాదాలు చేస్తూ ఫోటోలు దిగారు. ఆ తర్వాత భద్రతా సిబ్బంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు</p>
Read Entire Article