Nuvvunte Naa Jathaga Serial Today february 2nd:నువ్వుంటే నా జతగా: మిథున ఒడి బియ్యం వేడుకలో ఊహించని ట్విస్ట్! లలిత కన్నీళ్లు! సత్యమూర్తి ఏం చేశాడు!

2 months ago 7
ARTICLE AD
<p><strong>Nuvvunte Naa Jathaga Serial Today Episode&nbsp;</strong>మిథున దేవాకి భోజనం వడ్డిస్తుంది. దేవా తింటూ కన్నీరు పెట్టుకుంటాడు. మిథున ఏమైంది అని కంగారు పడుతుంది. మీ ఇంటి దగ్గర నీకు అన్నీ ఉంటాయి.. అన్నీ నీ పని వాళ్లు సమకూర్చుతారు.. ఇప్పుడు ఇలా నేల మీద కూర్చొని ఈ పరిస్థితికి తీసుకొచ్చా అని అంటాడు. నేను నీ దగ్గర చాలా సంతోషంగా ఉన్నాను దేవా.. నాకు ఇష్టమైన నా భర్త దగ్గర స్వర్గంలో ఉన్నట్లు ఉంది.. ఇంకెప్పుడైనా ఇలా మాట్లాడితే ఊరుకోను అని మిథున చెప్తుంది.&nbsp;</p> <p>దేవా, మిథునల ఇంటికి లలిత కొంత మంది ముత్తైదువులతో చీర సారె తీసుకొని వస్తుంది. సత్యమూర్తి వాళ్ల దగ్గరకు వెళ్లి వదినగారు అన్నయ్యగారు అని పిలుస్తుంది. దాంతో అందరూ బయటకు వస్తారు. మిథున దేవా కూడా బయటకు వస్తారు. కాంతం, రంగం లలితతో ఏదో భారీ స్కామ్&zwnj;తోనే వచ్చారని అర్థమవుతుందని అంటుంది. పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో తెలీదా అని ప్రమోదిని కాంతాన్ని తిడుతుంది. శారద కూడా కాంతాన్ని నోరు మూసుకోమని అంటుంది. ఎందుకు వచ్చారో చెప్పండి అని శారద లలితను అడిగితే మిథునకు ఒడి &nbsp;బియ్యం పోయడానికి వచ్చామని అంటుంది. మీరంతా వచ్చి మిథునకు ఒడిబియ్యం పోసి ఆశీర్వదించాలని అంటుంది. శారద మౌనంగా ఉంటే ఏంటి వదిన ఏం చెప్పరు అని అడుగుతుంది. ఇంతలో సత్యమూర్తి వచ్చి మౌనమై సమాధానం అని అంటాడు. మేం రాము మమల్ని పిలవొద్దు అని చెప్పడమే దాని అర్థం అని అంటాడు. మీ కొడుకు కోడలు చల్లగా ఉండాలి అని మీరు ఆశీర్వదించకపోతే ఎలా అంటుంది. దానికి సత్యమూర్తి వాడికి నేను ఎప్పుడో నీళ్లు వదిలేశాను.. కొడుకే లేడు అనుకుంటే కోడలు ఎక్కడి నుంచి వస్తుందని &nbsp;ఎందుకు వస్తుంది.. వాళ్లని ఆశీర్వదించమని ఎలా అడుగుతున్నారు అని అంటాడు. మీ కోపంలో అర్థం ఉంది కానీ మీరు ఇలా కోపం చూపిస్తే ఎలా అని అంటుంది. వాళ్ల గురించి అయితే మా దగ్గరకు రావొద్దని చెప్పా మళ్లీ చెప్తున్నా దయచేసి వెళ్లిపోండి అని అంటాడు.</p> <p>లలిత శారదని కూడా బతిమాలుతుంది. శారద మాత్రం సైలెంట్&zwnj;గా ఉండిపోతుంది. సత్యమూర్తి అందర్ని లోపలికి వెళ్లమని అంటాడు. ఆనంద్ తండ్రికి సర్దిచెప్పాలని ఆపుతాడు. మిథున, దేవాలని క్షమించి ఆశీర్వదించమని అంటాడు. ప్రమోదిని కూడా అదే చెప్తుంది. కాంతం మాత్రం మామయ్య గారికి నువ్వు ఎదురు చెప్తున్నావా అక్క అని పుల్లలు పెడుతుంది. ఎవరు ఎన్ని చెప్పినా వినకుండా సత్యమూర్తి ఫ్యామిలీని తీసుకొని వెళ్లిపోతాడు. లలిత చాలా బాధపడుతుంది. కన్నీరు పెట్టుకుంటుంది. మిథున తల్లిని తీసుకొని ఇంటికి వెళ్తుంది.&nbsp;</p> <p>గుడెసెలోనే దేవా, మిథునలో పంతులు పూజ చేయించి లలితతో బట్టలు ఇప్పిస్తారు. లలిత సంతోషంగా కూతురు అల్లుడికి బట్టలు పెడుతుంది. &nbsp;మిథునకు ఒడిబియ్యం కూడా పోస్తారు. ఇక పంతులు నలుగురే ఒడిబియ్యం పోశారు మంచిది కాదు ఇంకొకరు పోయాలి అంటాడు. ఇంకెవరూ లేకపోవడంతో మిథున, లలిత చాలా బాధ పడతారు. ఇప్పుడేం చేయాలి అని అనుకుంటారు. ఇంతలో ప్రమోదిని వచ్చి మిథున ఎవరు ఏమనుకున్నా సరే నా చెల్లికి ఒడిబియ్యం పోయడానికి నేను వచ్చా అంటుంది. లలిత, మిథున చాలా సంతోషిస్తారు. ప్రమోదిని మిథునకు బొట్టు పెట్టి ఆశీర్వదించి ఒడిబియ్యం పోస్తుంది. నా కూతురికి ఆశీర్వదించడానికి సమయానికి సాక్ష్యాత్తు అమ్మవారిలా వచ్చావ్ అని లలిత థ్యాంక్స్ చెప్తుంది. నా కోసం మాట పడతావని తెలిసినా వచ్చావ్ థ్యాంక్స్ అక్కా అని మిథున చెప్తుంది. ఇక దేవా మిథున పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు.&nbsp;</p> <p>హరివర్థన్ లలితని పిలుస్తాడు. అలంకృత విని నాన్న అప్పుడే వచ్చేశాడు.. అమ్మ అక్క దగ్గరకు వెళ్లిందని తెలిస్తే ఇంకేమైనా ఉందా అని భయపడుతుంది. హరివర్థన్ పిలవడంతో అలంకృత వచ్చి అబద్ధం చెప్తుంది. హరివర్థన్ కోప్పడటంతో మిథున ఒడిబియ్యం గురించి చెప్తుంది. హరివర్థన్ కోపంగా చూస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.&nbsp;</p>
Read Entire Article