Nuvvunte Naa Jathaga Serial Today February 20th: "నువ్వుంటే నా జతగా" సీరియల్: నీ కోసం వచ్చేశా నాన్న.. ఆ మహాలక్ష్మీ లోటు ఇప్పుడు తెలుస్తోందా!!

9 months ago 7
ARTICLE AD
<p><strong>Nuvvunte Naa Jathaga Serial Today Episode </strong>మిధున వచ్చేయడంతో హరివర్దన్ చాలా సంతోషిస్తాడు. మిధున తండ్రికి హ్యాపీ భర్తడే అని చెప్పగానే నిజంగానే వచ్చావా మిధున అని జడ్జి ఎమోషనల్ అవుతాడు. మిధున కన్నీరు పెట్టుకుంటూ వచ్చేశా నాన్న నీ కోసం వచ్చేశా.. ప్రతీ ఏడాదిలా ఇప్పుడు కూడా నీ పుట్టిన రోజు గుర్తిండిపోవాలని వచ్చానని అంటుంది. హరివర్దన్&zwnj; మిధున ప్రశ్నించే టైంకి త్రిపుర వచ్చి మామయ్య కేక్ కట్ చేయాలని చెప్తుంది. మిధునని రెడీ అవ్వమని చెప్తుంది.</p> <p>హరివర్దన్&zwnj;తో త్రిపుర అక్కడ జరిగిన గొడవ &nbsp;గురించి చెప్తుంది. లలిత భర్తతో మిధున శాశ్వతంగా వచ్చేసింది తాళి తీయమని ఇప్పుడు ఇబ్బంది పెట్టొద్దు మెల్లగా తానే మారుతుందని చెప్తుంది. దానికి హరివర్దన్ నా కూతురు నాతో ఉంటే అది చాలు అని అంటాడు. మరోవైపు శారద గుడి దగ్గర దీక్ష చేస్తున్న ఓ అమ్మవారి ఉపాశకురాలి దగ్గరకు వెళ్తుంది. శారదని చూసిన ఆమె మీ ఇంటి మహాలక్ష్మీని తరిమేశారా.. నీ కొడుకు జీవితానికి వరమైన దేవతని గెంటేశారు.. నీ కొడుకు జీవితాన్ని నీ ఇంటిని శూన్యంగా మార్చుకోకు ఆ మహాలక్ష్మీని వదులుకోకు అని చెప్తుంది. మరోవైపు మిధున వాళ్లు హరివర్దన్ పుట్టిన రోజు వేడుకను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహిస్తారు.&nbsp;</p> <p>నువ్వు మళ్లీ తిరిగి రావడంతో మళ్లీ పుట్టినట్లు ఉందని హరివర్దన్ మిధునతో అంటాడు. మిధున ఎన్ని జన్మలు ఎత్తినా మీరు పంచిన ప్రేమను తీర్చుకోలేనని మిధున అంటుంది. హరి కేక్ కట్ చేసిన అందరూ కేక్ తినిపించుకుంటారు. హరివర్దన్ ఇంట్లో మిధున రాకతో పండగలా ఇళ్లంతా సందడిగా మారుతుంది. ఇక మరోవైపు మిధున వెళ్లిపోయిన సంతోషంలో భాను రోడ్డు మీద పిల్లలకు చాక్లెట్లు స్వీట్స్ పంచి డ్యాన్స్ చేస్తుంది. దేవా రావడంతో దేవాకి స్వీట్ తినిపిస్తుంది. ఏమైందని దేవా అడిగితే మన ఇద్దరి జీవితానికి పట్టిన శని వదిలిపోయిందని చెప్తుంది. పదమూడు ఏళ్లుగా నిన్ను ప్రేమిస్తున్నా కదా తను వెళ్లిపోగానే నిన్ను పెళ్లి చేసుకున్నంత ఆనందంగా ఉందని అంటుంది. దానికి దేవా ఇప్పుడే ఓ దరిద్రం పోయింది ఇప్పుడు నువ్వు మళ్లీ ఏం తెచ్చి పెట్టుకు ఇలా నన్ను వదిలేయ్ అంటాడు. దాంతో భాను నిన్ను పెళ్లి చేసుకోవడమే నా టార్గెట్ రేపటి నుంచి అదే పనిలో ఉంటానని అనుకుంటుంది.&nbsp;</p> <p>మిధున రాకతో హరివర్దన్ డైనింగ్ టేబుల్ మొత్తం నవ్వులతో ఉంటే శారద వాళ్లు మాత్రం దిగులుగా అందరూ కలిసి తింటారు. శారద ఆ మాత చెప్పిన మాటలు తలచుకొని బాధ పడుతుంది. సూర్యకాంతం మిధున వెళ్లిపోవడంతో ప్రశాంతంగా ఉందని అంటుంది. అందరూ మిధున వెళ్లిపోవడం హ్యాపీగా ఉందని అనుకుంటారు. దేవా అయితే అందరి కంటే తనకే ఎక్కువ సంతోషంగా ఉందని అంటాడు. సత్యమూర్తి, శారద మాత్రం మిధునకి కనీసం ఒక్క పూట తిండి పెట్టలేకపోయాం.. ప్రసాదాలు తింటూ పస్తులుండిందని పెద్ద పాపం మూటకట్టుకున్నామని బాధ పడతాడు. మిధున వెళ్లిపోవడంతో ఇంట్లో కల పోయిందని శారద అంటుంది. దానికి సత్యమూర్తి మిధున చాలా మంచి అమ్మాయిని మంచి విలువలు కలదని దేవా వల్ల పట్టిన గ్రహణం తనకు వీడిపోయిందని అంటాడు. సూర్య కాంతం మిధునని దరిద్రం పోయిందని అనగానే శారద సూర్య కాంతం మీద అరుస్తుంది.&nbsp;</p> <p>మిధునకు హరివర్దన్ తినిపిస్తాడు. మిధున చాలా రోజుల తర్వాత మనస్ఫూర్తిగా నవ్వుతుంది. ఇంటిళ్లపాది హ్యాపీగా నవ్వుకుంటారు. మిధున ఇళ్లు పోకుండా డబ్బు ఇచ్చిందని తన డబ్బు తనకు తిరిగి ఇచ్చేస్తానని సత్యమూర్తి అంటాడు. మిధున పొలమారుతుంది. తినేటప్పుడు పొలమారితే బాగా కావాల్సిన వారు తలచుకున్నారని అర్థం అని బామ్మ చెప్పి అందరం ఇక్కడే ఉంటే నిన్ను ఎవరు తలచుకుంటున్నారని అంటుంది. మిధున ఒక్క సారిగా డల్ అయిపోతుంది. ఇక త్రిపుర మనసులో మిధున ఇంటికి వచ్చేసింది ఇక మిగతా కార్యక్రమం రేపే మొదలు పెట్టాలని అనుకుంటుంది. మిధున ఒంటరిగా బయట కూర్చొని ఆలోచిస్తుంది. దేవా మేడ మీదకు పడుకోవడానికి వెళ్లి ఆలోచిస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.</p> <p><strong>Also Read: <a title=" సత్యభామ సీరియల్: ఇంట్లో బాంబ్ పేల్చిన భైరవి.. నవ్వు అసలు మహదేవయ్య కొడుకువే కాదురా.. హర్షతో మైత్రి ఫస్ట్&zwnj;నైట్!!" href="https://telugu.abplive.com/entertainment/tv/satyabhama-serial-february-20th-today-episode-written-update-in-telugu-198447" target="_blank" rel="noopener"> సత్యభామ సీరియల్: ఇంట్లో బాంబ్ పేల్చిన భైరవి.. నవ్వు అసలు మహదేవయ్య కొడుకువే కాదురా.. హర్షతో మైత్రి ఫస్ట్&zwnj;నైట్!!</a></strong></p>
Read Entire Article