Nindu Noorella Saavasam Serial Today January 30th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మళ్లీ భూలోకం వెళ్లనున్న ఆరు – రణవీర్‌ను అనుమానించిన భాగీ

10 months ago 8
ARTICLE AD
<p><strong>Nindu Noorella Saavasam Serial Today Episode:</strong> &nbsp;భూలోకం వెళ్తానని గోల చేస్తున్న ఆరును పక్కకు తీసుకెళ్లమని గుప్తుకు చెప్తాడు యముడు. గుప్త ఆరును పక్కకు తీసుకెళ్లగానే.. యముడు కోపంగా నువ్వు చేసే తప్పిదాల వల్ల మానవులతో ఎప్పుడూ చిక్కు వచ్చి పడుతుంది చిత్రగుప్త అంటూ కోప్పడతాడు. దీంతో చిత్రగుప్తుడు ఆ బాలిక నాలుగు పాపాలు చేసిందని చిట్టాలో రాస్తాను అంటాడు. దీంతో యముడు మరింత కోపంగా అప్పుడు మనం ఇద్దరం ఇక్కడ నరకంలో శిక్ష అనుభవించాల్సి వస్తుంది అంటాడు.</p> <p><strong>చిత్రగుప్త:</strong> మరి ఇప్పుడేం చేయాలి ప్రభు..</p> <p><strong>యముడు:</strong> ఆ బాలిక గురించి పూర్తిగా తెలిసిన చిత్రి విచిత్రగుప్తుడినే అడుగుదాం. అతన్ని ఇక్కడకు పిలవండి.</p> <p><strong>గుప్త:</strong> ఆ బాలికను రెచ్చగొట్టింది నేనే అని పసిగట్టారా ఏంటి ప్రభువుల వారు. ( అని మనసులో అనుకుంటాడు)</p> <p><strong>చిత్రగుప్తు:</strong> విచిత్రగుప్త ఆ బాలికకు మీరే నిజం చెప్పారా..?</p> <p><strong>గుప్త:</strong> నేను ఆ పని ఎందుకు చేస్తాను.. ప్రభు..</p> <p><strong>యముడు:</strong> అయితే ఇప్పుడు ఆ బాలిక మా మాట విన వలెనన్నా ఏమీ చేయవలెను.</p> <p><strong>గుప్త:</strong> ఆ బాలిక తన పిల్ల పిచ్చుక ప్రమాదంలో ఉన్నదని గమనించింది. ఆ పిల్ల పిచ్చుకను కాపాడితే సరిపోతుంది ప్రభు.</p> <p><strong>యముడు:</strong> అయితే ఇప్పుడే నేను భూలోకం వెళ్లాలా..?</p> <p><strong>గుప్త:</strong> అవసరం లేదు ప్రభు ఆ బాలికను భూలోకం పంపినచో సరిపోతుంది.</p> <p><strong>చిత్రగుప్తు:</strong> విచిత్ర గుప్త&nbsp; నీకు మతి కానీ భ్రమించిందా..?&nbsp; ఆ బాలికను భూలోకం నుంచి తీసుకుని వచ్చుటకు ఎంత కష్టపడ్డామో తెలిసి మళ్లీ భూలోకం పంపమని చెప్తున్నావా..?</p> <p><strong>గుప్త:</strong>&nbsp; ప్రభువుల వారు అడిగితిరి నేను చెప్పితిని</p> <p><strong>యముడు:</strong>&nbsp; సరే విచిత్ర నేను ఆలోచించుకుని చెప్తాను నువ్వు వెళ్లు</p> <p>అని చెప్పగానే గుప్త అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆరు వచ్చి ఏం జరిగిందని అడుగుతుంది. ప్రభువుల వారు ఆలోచిస్తా అన్నారు. అంటే నిన్ను భూలోకం పంపిస్తారనే అర్థం అంటాడు. పరధ్యానంలో కూర్చున్న భాగీ.. రణవీర్&zwnj;, మనోహరి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. ఇంతలో శివరాం వచ్చి మచినీళ్లు అడిగినా పలకదు. దగ్గరకు వెళ్లి పిలవగానే ఉలిక్కిపడి చూస్తుంది భాగీ.</p> <p><strong>శివరాం:</strong> ఏంటి మిస్సమ్మ అలా ఉన్నావు</p> <p><strong>భాగీ:</strong> మనోహరి, రణవీర్&zwnj; గురించి మామయ్యా.. నాకెందుకో వాళ్లిద్దరూ కలిసి ఏదో ప్లాన్&zwnj; చేస్తున్నారేమో అనిపిస్తుంది. అందుకే అంజును పంపాలంటే&nbsp; భయమేసింది.</p> <p><strong>నిర్మల:</strong> వాళ్లిద్దరు కలిసి ఏం ప్లాన్&zwnj; చేస్తారు మిస్సమ్మ వాళ్లిద్దరూ ముందు నుంచి తెలిసివాళ్లు కాదు కదా..? అయినా నీకెందుకు అలా అనిపించింది.</p> <p><strong>భాగీ:</strong> మనోహరి, రణవీర్&zwnj; సైగ చేసుకోవడం.. ఇద్దరూ ఒకర్ని ఒకరు ముందే కలిశామని చెప్పడం కంగారు పడటం లాంటివి చూస్తుంటే అనుమానం వచ్చింది అత్తయ్యా</p> <p>అని భాగీ చెప్పగానే.. నిర్మల, శివరాం ఆలోచనలో పడిపోతారు. అంజును హాస్పిటల్ కు తీసుకెళ్తాడు రణవీర్&zwnj;.</p> <p><strong>అంజు:</strong> ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అంకుల్&zwnj;..</p> <p><strong>రణవీర్&zwnj;:</strong> ఇంతకు ముందు ఐస్&zwnj;క్రీమ్&zwnj; తిన్నప్పుడు చిన్నగా దగ్గావు కదమ్మా అందుకు..</p> <p><strong>అంజు:</strong> అయ్యో అంకుల్&zwnj; ఐస్&zwnj; క్రీమ్&zwnj; తింటే దగ్గు రాకుండా ఉంటుందా..?</p> <p><iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://telugu.abplive.com/web-stories/entertainment/esha-rebba-latest-saree-photos-going-viral-195785" width="631" height="381" scrolling="no"></iframe></p> <p><strong>రణవీర్&zwnj;:</strong> అది కాదు అంజు నీకు జలుబు కానీ జ్వరం కానీ వస్తే మళ్లీ నన్ను తిడతారు. ఐస్&zwnj;క్రీమ్&zwnj; తిన్నందుకు నిన్ను తిడతారు</p> <p><strong>అంజు:</strong> అయితే ఓకే అంకుల్&zwnj;..</p> <p>అంజును రిసెప్షన్&zwnj; లో కూర్చోబెట్టి రణవీర్&zwnj; డాక్టర్&zwnj; దగ్గరకు వెళ్లి అంజుకు టెస్టులు చేయాలని చెప్తాడు. డాక్టర్&zwnj; సరే అంటాడు. ఇంతలో భాగీ ఫోన్&zwnj; చేస్తుంది. ఎక్కడున్నారు అని అడుగుతుంది. మాల్&zwnj; లో ఉన్నామని రణవీర్&zwnj; చెప్పగానే వెనక ఒక వ్యక్తి ఫోన్&zwnj;లో మట్లాడుతూ హాస్పిటల్&zwnj; లో ఉన్నామని చెప్తాడు. భాగీ అది విని షాక్&zwnj; అవుతుంది. రణవీర్&zwnj; ఫోన్&zwnj; కట్&zwnj; చేస్తాడు. భాగీ అనుమానంతో ఆ హాస్పిటల్&zwnj;కు వెళ్తానని నిర్మల, శివరాంలకు చెప్పి బయలుదేరుతుంది. ఇదంతా యమలోకం నుంచి ఆరు చూస్తుంది. అంజు గురించి బాధపడుతుంది. దీంతో నువ్వు మళ్లీ భూలోకం వెళ్లే టైం దగ్గర పడిందని గుప్త చెప్తాడు. ఆరు షాక్&zwnj; అవుతుంది. &nbsp;ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్&zwnj; అయిపోతుంది.</p> <p>&nbsp;</p> <p><a title="ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట! " href="https://telugu.abplive.com/spirituality/if-you-get-such-dreams-you-will-become-a-millionaire-184151" target="_blank" rel="noopener">ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట! </a></p> <p>&nbsp;</p>
Read Entire Article