Nindu Manasulu Serial Today October 9th: నిండు మనసులు: సాహితి మీద కన్నేసిన గణ.. విజయానంద్‌తో దోస్తీ! ఇందిర తెలుసుకున్న విస్తుపోయే నిజం!

1 month ago 3
ARTICLE AD
<p><strong>Nindu Manasulu Serial Today Episode&nbsp;</strong>ప్రేరణ తల్లితో నేను ఎందుకు చెప్తున్నానో విను అమ్మా.. ఇక నుంచి ఆ ఇంటికి వెళ్లకు అని చెప్తుంది. మనకి ఎన్ని కారణాలు ఉన్నా ఎదురుగా ఉన్న ప్రమాదం గుర్తించాలి.. ఏదైనా అయితే జరిగిన నష్టాన్ని పూచ్చుకోలేం. ఇక నుంచి నువ్వు ఆ ఏరియాకు వెళ్లకూడదు అని అంటుంది. ఇందిర సరే అంటుంది.&nbsp;</p> <p>ప్రేరణ బయటకు వెళ్తుంది. సుధాకర్ అక్కతో ప్రేరణకు వెళ్లడం ఇష్టం లేదు.. ప్రేరణ చెప్పిన దాంట్లో నిజం ఉంది మనం వెళ్లొద్దు అంటాడు. ఏం చేయాలో నాకు తెలుసు మనం మాత్రం హాస్పిటల్&zwnj;కి వెళ్లాలి అంటుంది. మరోవైపు మినిస్టర్ విజయానంద్&zwnj; ఇంట్లో గణ, విజయానంద్&zwnj;తో మీటింగ్ పెడతాడు. ఇద్దరినీ రాజీ చేయాలని చూస్తాడు. గణ కోపంగా సార్ మీరు మమల్ని కలపాలి అనుకున్నారు కానీ ఈయన నా జీవితం నాశనం చేయాలి అని చూశారు అంటాడు. నా శత్రువులతో గణ చేతులు కలిపాడని విజయానంద్ అంటాడు. నా మీద కుట్రలు చేస్తే మరి ఏం చేస్తానని గణ అంటాడు. మినిస్టర్ సంధి చేయాలని చూస్తాడు. ఖాకీ, డబ్బు, పవర్ కలిస్తే మొత్తం మన చేతుల్లోనే ఉంటుంది. చక్రం తిప్పొచ్చని అంటాడు.&nbsp;</p> <p>విజయానంద్ గణతో చేతులు కలపడానికి రెడీ కానీ గణ నేను చెప్పినట్లు వినాలి అంటాడు. నేను ఎవరి మాట వినను అని గణ అంటాడు. మీరు ఇలా పోట్లాడుకుంటే నష్టం మనకే ఇప్పటి వరకు జరిగింది మర్చిపోయి కలిసి ఉండండి.. మనం ప్రపంచాన్ని ఏలేయొచ్చు అని మినిస్టర్ అంటాడు. విజయానంద్ గణకి 50 లక్షలు ఇస్తానని కూడా చెప్తాడు. నమ్మకం పోయింది.. ఒకరి దగ్గర ఒంగడం నావల్ల కాదు అని గణ వెళ్లిపోతుంటే నా స్థాయి అంతస్తుకి నువ్వు సరిపోతావా అని విజయానంద్ అంటాడు. మినిస్టర్ ఇద్దరినీ సర్ది చెప్తే టైంలో గణ సాహితిని చూస్తాడు. సాహితి అందానికి ఫిదా అయిపోయి సాహితి విజయానంద్ కూతురని తెలుసుకొని సాహితిని సొంతం చేసుకొని విజయానందన్&zwnj;ని చెక్ పెట్టాలి అనుకుంటాడు. అందుకు వెంటనే విజయానంద్&zwnj;తో కలిసిపోతా అని మీరు ఏం చెప్తే అది చేస్తా అని అంటాడు. మినిస్టర్ ఇద్దరి చేతులు కలిపేస్తాడు. ఇక నుంచి నేను విజయానంద్ సార్ ఒక్కటే అని గణ అంటాడు.&nbsp;</p> <p>విజయానంద్ గణకి సిద్ధూ, ప్రేరణల కేఫ్ పెట్టకుండా చూసుకోమని అంటాడు. నేను చూసుకుంటా ఇక నుంచి &nbsp;మీ భవిష్యత్ నా చేతిలో ఉంటుందని అంటాడు. సిద్ధూ ప్రేరణలు మళ్లీ బ్యాంక్&zwnj;కి వెళ్తారు. మేనేజర్&zwnj;కి లోన్ కావాలి అంటే పెద్ద వాళ్ల రికమండేషన్ అయినా కావాలి లేదంటే ఎవరైనా సాక్షి ఉండాలని అంటాడు. ఉన్నారు అని సిద్ధూ అనగానే విశ్వనాథ్ వస్తారు. మేనేజర్&zwnj; విశ్వనాథ్తో సార్ మీరా అంటాడు. ఇక లోన్ ఇస్తా కానీ ఆ కాఫీ షాప్ &nbsp;పెట్టడానికి ల్యాండ్ చూపించాలని బ్యాంక్ రూల్స్ అని అంటాడు. ప్లేస్ ఉంది ఆ ప్లేస్ నేను ఇస్తానని &nbsp;విశ్వనాథ్ అంటే లోన్ ఇచ్చేస్తా అని మ్యానేజర్ అంటాడు. విశ్వనాథ్ గణ వాళ్లతో లొకేషన్ చూడటానికి వెళ్దామని అంటాడు. ఇందిర, సుధాకర్ రిపోర్ట్స్ తీసుకొని డాక్టర్ దగ్గరకు వెళ్తారు. డాక్టర్ చూసి మీ అనుమానం నిజమే అతనికి ఉన్న ప్రాబ్లమ్ వేరు ఇస్తున్నా ట్రీట్మెంట్ వేరు.. ఈ మందులు అన్నీ ఆయన బతకడానికి మాత్రమే. అతను బ్రైన్ పని చేయడానికి సరిపడా మందులు ఏం లేదు.. ఇలా అయితే కష్టమే అని డాక్టర్ అనడంతో రాజశేఖరాన్ని రేపు తీసుకొస్తానని ఇందిర అంటుంది. సుధాకర్ అక్కతో బావగారిని తీసుకురావడం అంత ఈజీనా అంటే అవన్నీ నాకు తెలీదు.. అతన్ని బాగు చేసుకోవాలి లేదంటే జీవితాంతం నన్ను నా పిల్లల్ని ఆయనకు దూరం చేస్తారు అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.&nbsp;</p>
Read Entire Article