Nindu Manasulu Serial Today may 4th: నిండు మనసులు: వ్రతంలో రాజశేఖరం పనికి అంతా షాక్! సిద్ధూ, ప్రేరణ అరెస్ట్ అవుతారా! కారణం అదేనా!

1 month ago 5
ARTICLE AD
<p><strong>Nindu Manasulu Serial Today Episode&nbsp;</strong>మంజుల, విజయానంద్ వ్రతానికి ఏర్పాటు చేస్తారు. పంతులు గారు ఇంట్లో వ్రతం రోజు బట్టలు చినిగిపోతే గొడవలు ఏమైనా అవుతాయా అని విజయానంద్ అడిగితే గొడవలు జరగాలని కోరుకున్నట్లు ఉందని ఐశ్వర్య సెటైర్లే వేస్తుంది. ప్రేరణ, సిద్ధూ ఇద్దరూ కలిసి వ్రతం దగ్గరకు వస్తారు. ప్రేరణ సిద్ధూ చేయి పట్టుకోవడంతో సిద్ధూ తోసేస్తూ ఉంటాడు.&nbsp;</p> <p>సిద్ధూ, ప్రేరణలన్ని పంతులు వచ్చి పీటల మీద కూర్చొమని అంటాడు. విజయానంద్ తన ఎడమ కన్ను అదరడం చూసి ఇదేంటి ఏదో మంచి జరిగిపోతుందా అనుకుంటాడు. ఇంతలో రాజశేఖరం వస్తాడు. రాజశేఖరం అని విజయానంద్ అనగానే అందరూ షాక్ అయి చూస్తారు. ప్రేరణ వాళ్లు అలా నిల్చొండిపోతారు. వీడు వచ్చాడు అంటే గణ వచ్చుంటాడే ఇంకా రాలేదు ఏంటి అని విజయానంద్ అనుకుంటాడు. సిద్ధూ ఏం అనకుండా అలా ఉండిపోవడం చూసి ఏంటి ఏం అనడం లేదు అని విజయానంద్ అనుకుంటాడు. మంజుల కూర్చొండి అని సిద్ధూ ప్రేరణల్ని అంటుంది. ఇద్దరూ కూర్చొనే టైం గణ వస్తాడు. ఆగండి అని అంటాడు. అందరూ నన్ను క్షమించాలి.. &nbsp;నేను వ్రతం ఆపాలి అని రాలేదు.. అలా అని అక్షింతలు వేసి వీళ్లని ఆశీర్వదించాలి అని రాలేదు.. ఇక్కడికి రాకూడని మనిషి వచ్చారు.. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావ్ నాన్న నిన్ను ఎవరు పిలిపించారు అని అంటాడు.</p> <p>ప్రేరణే పిలిచిందేమో అని గణ అనుకుంటే నాకు ఏం సంబంధం లేదు.. నేను ఆయన్ను పిలవలేదు అని ప్రేరణ అంటుంది. తను పిలవకపోతే నిన్ను ఎవరు పిలిచారు నాన్న నాకు ఇప్పుడే సమాధానం కావాలి అని గణ అడుగుతాడు. &nbsp;మా ఇంట్లో గొడవ ఏంటి అని విజయానంద్ అంటాడు. సమాధానం &nbsp;చెప్పు నాన్న అని గణ రెట్టించి అడగటంతో నేను చెప్తా అని డీసీపీ జయకృష్ణ ఎంట్రీ ఇస్తాడు. అందరూ షాక్ అయిపోతారు. ప్రేరణ, సిద్ధూ అయితే ఈయన ఇప్పుడు వచ్చారేంటి అని కంగారు పడతారు. డీసీపీ సిద్ధూ, ప్రేరణలతో పూజలో కూర్చొన్నారా.. మీతో కొంచెం పని ఉంది పూజ పూర్తి చేయండి తర్వాత మాట్లాడుకుందాం అని అంటాడు.&nbsp;</p> <p>సిద్ధూ ప్రేరణ వ్రతంలో కూర్చొంటాడు. డీసీపీ గణని పక్కనే కూర్చొపెట్టుకొని గణ వీళ్లు నన్ను మోసం చేశారు.. నువ్వు కూడా నీకు వీళ్ల గురించి చెప్తే నేను వినలేదు.. అందుకే వీళ్లని అరెస్ట్ చేయడానికి వచ్చాను అని అంటాడు. గణ చాలా హ్యాపీగా ఫీలవుతాడు. విజయానంద్ కూడా విని హ్యాపీ అయిపోతాడు. ఈ కార్యక్రమం అయిపోగానే అందరూ ఆశీర్వదించగానే వాళ్లని అరెస్ట్ చేస్తా అంటాడు. ప్రేరణ డీసీపీని చూస్తూ చాలా కంగారు పడుతుంది. ఆయనకు నిజం తెలిసిపోయిందా ఏంటి అని అనుకుంటుంది. పూజ పూర్తయిన తర్వాత సిద్ధూ, ప్రేరణను ఆశీర్వదిస్తాడు. &nbsp;సాహితి అందరికీ అక్షింతలు ఇచ్చి గణకి ఇవ్వదు.. డీసీపీ సాహితితో ఆయనకు అక్షింతలు ఇవ్వు అని అంటాడు. &nbsp;మంజు, విజయానంద్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు.</p> <p>పంతులు ప్రేరణ, సిద్ధూలను ఇందిర వాళ్ల దగ్గర ఆశీర్వాదం తీసుకోమని అంటారు. ఇందిర కాళ్లకు ప్రేరణ, సిద్ధూ దండం పెట్టే టైంకి పంతులు గారు నాకు అక్షింతలు ఇవ్వలేదు అని రాజశేఖరం వెళ్లి ఇద్దరి మీద అక్షింతలు వేస్తాడు. గణ సీరియస్&zwnj;గా చూస్తాడు. తర్వాత డీసీపీ సిద్ధూ ప్రేరణల దగ్గరకు వచ్చి ఇక బయల్దేరుదాం అంటాడు. ఎక్కడికి సార్ అని ప్రేరణ అడిగితే సార్ మిమల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాడు అని గణ అంటాడు. అందరూ షాక్ అయిపోతారు. అరెస్ట్ ఏంటి అని విజయానంద్ అంటే నేను డ్యూటీ మీద వచ్చా వ్రతం అని ఆగాను అంటాడు. ఏంటి సిద్ధూ అని ఇందిర అడగబోయి ఆగిపోతుంది. అమ్మా నేను అన్నీ మీకు తర్వాత చెప్తా ఎవరూ భయపడొద్దు అని అంటాడు. ప్రేరణ వెళ్దాం అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p>
Read Entire Article