Nindu Manasulu Serial Today March 20th: నిండు మనసులు: ప్రేరణ వాళ్ల గుండె పగిలేలా మాట్లాడిన రాజశేఖరం! తల్లీకూతుళ్లు అనాథలైపోయినట్లేనా!

3 weeks ago 2
ARTICLE AD
<p>Nindu Manasulu Serial Today Episode సిద్ధూ గురించి మంజుల బాధ పడుతుంటే ప్రేరణ వల్ల సిద్ధూ మనకి దూరం అయిపోతున్నాడు అని.. సిద్ధూ గురించి మనం ఆలోచిస్తున్నాం కానీ సిద్ధూ మాత్రం ప్రేరణ గురించే ఆలోచిస్తున్నాడు.. ఇక మనం సిద్ధూని పట్టించుకోకూడదు అని విజయానంద్ మంజులకు చెప్తాడు. సిద్ధూ అనామకుడు కాదు కదా.. ప్రేరణ జోలికి వెళ్లకుండా సిద్ధూని మనం ఆపాలని మంజుల అంటుంది. సిద్ధూ ప్రేరణ వైపు వెళ్లకుండా ఏదో ఒకటి చేయాలి లేదంటే సిద్ధూ మనకు దక్కడు అని విజయానంద్ మొసలి కన్నీరు కార్చుతాడు.&nbsp;</p> <p>సిద్ధూ ప్రేరణ వాళ్ల దగ్గరకు వెళ్తాడు. ప్రేరణ సంతోషంగా సిద్ధూ దగ్గరకు వెళ్లి సిద్ధూ మా నాన్న మా గురించి నిజం చెప్పబోతున్నారు అని అంటుంది. ఇన్నాళ్లు మీ గురించి అన్న నోళ్లు ఈ దెబ్బతో మూత పడతాయి అని సిద్ధూ అంటాడు. ఇక ప్రేరణ, ఐశ్వర్యలు రాజశేఖర్&zwnj;తో నిజం చెప్పండి నాన్న అంటారు. రాజశేఖరం వాళ్లని చూసి ఎవరు మీరు అని అడుగుతాడు. అందరూ షాక్ అయిపోతారు. తండ్రి చేయి పట్టుకున్న ప్రేరణ చేయి వదిలేస్తుంది. ఇందిర కూడా భర్త చేయి వదిలేస్తుంది. మీరు ఎవరో నాకు తెలీదమ్మా అని రాజశేఖరం అంటాడు. వచ్చినప్పటి నుంచి నన్ను నాన్న అంటున్నారు అని అంటాడు. తను మన పెద్ద కూతురు ప్రేరణ మీరు పెద్దోడా పెద్దోడా అని పిలుస్తారు కదా.. ఇది చిన్నది ఐశ్వర్య చిన్నోడా అంటారు కదా.. వాళ్లెవరో మీకు తెలీదా అని ఇందిర అడిగితే తెలీదు అని రాజశేఖరం అంటాడు. పోనీ నేను ఎవరు అని ఇందిర అడిగితే నాకు తెలీదు అని రాజశేఖరం అంటాడు. మీరంతా ఎవరు మీరు ఎవరో నాకు తెలీదు.. అని ఈశ్వరి దగ్గరకు వెళ్లి ఈశ్వరి వీళ్లంతా ఎవరు.. ఇక్కడికి వచ్చి వరసలు కలిపి విసిగిస్తున్నారు ఏంటి ఇదంతా అని అడుగుతాడు.</p> <p>ఐశ్వర్య తండ్రి దగ్గరకు వెళ్లి నాన్న మాతో ఫ్రాంక్ చేస్తున్నావ్ కదా అంటుంది. లేదమ్మా సీరయస్&zwnj;గా చెప్తున్నా ఎవరు మీరు అని రాజశేఖరం అంటాడు. సుధాకర్ కూడా ఏంటి సార్ ఆవిడ మీ ఆవిడ.. వాళ్లిద్దరూ మీ కూతుళ్లు మీరు వైజాగ్లో ఉండేవాళ్లు కదా మరి తెలీదు అంటున్నారేంటి అని అడుగుతాడు. దానికి రాజశేఖరం నాకు ఉన్నది ఒక్కర్తే భార్య అది ఈశ్వరి ఉన్నది ఒక్కడే కొడుకు గణ.. ఇదే నా ఫ్యామిలీ వీళ్లు తప్ప నాకు ఇంకెవరూ లేరు అని ఇద్దరినీ దగ్గరకు తీసుకుంటాడు. ప్రేరణ తండ్రి కాలర్ పట్టుకోవడానికి వెళ్లి ఆగిపోయి నాన్న నిజంగా మేం ఎవరో తెలీదా అంటుంది. తెలీదు అని రాజశేఖరం అంటాడు. నాన్న నా కళ్లలోకి చూసి చెప్పు పెద్దోడు ఎవరో నీకు తెలీదా అని అడుగుతుంది. రాజశేఖరం ప్రేరణతో పాపం మీ నాన్న ఎవరో తెలీక బాధ పడుతున్నట్లున్నారు.. నేను అయితే మీ నాన్నని కాదమ్మా అని అంటాడు. దాంతో ప్రేరణ కోపంగా తండ్రి షర్ట్ పట్టుకుంటుంది. ప్రేరణ వదులు అని ఇందిర అంటే ఎందుకు వదలాలమ్మా మేం ఆయన పిల్లలం కాదంటా.. నువ్వు భార్య కాదంటా.. మరి ఆయన కాదు అంటే మా నాన్న ఎవరో ఆయనే చెప్పాలి కదామ్మా అని ఐశ్వర్య కోపంగా గట్టిగా అడుగు అక్కా అని అంటుంది.&nbsp;</p> <p>ప్రేరణ ఏడుస్తూ నాన్న మేం ఎవరో తెలీదు అనడం తప్పు అనిపించడం లేదా.. నాన్న ప్రపంచం నాన్నే లోకం అని బతికిన ఇద్దరు ఆడపిల్లలం. ఈ రోజు మా నాన్న మీకు మాకు సంబంధం లేదు అంటే అది తట్టుకొని బతకగలం అనుకోలమా.. ఒకసారి ఆ పిచ్చిదాన్ని చూడు.. భర్తే ప్రపంచం అని బతికింది.. తన దగ్గర రెండు రోజులు ఉంటే మిగతా 5 రోజులు ఎక్కడో ఉద్యోగం చేస్తున్నారు అనుకుంది.. ఈ ప్రపంచం మొత్తం తనని డబ్బున్న వాళ్లని వలలో వేసుకొని డబ్బు కాజేయాలని చూసింది అన్నా మమల్ని అక్రమ సంతానం అన్నా.. నా భర్త కన్ను తెరిస్తే మీరే తన ప్రపంచం అని చెప్తారని ఎదురు చూసిన ఆ పిచ్చిదానికి మీరు ఇచ్చే బహుమతి ఇదా.. నాన్న ఇందాక నా భార్య అని ఆవిడను అన్నావు చూడు.. ఆ భార్య నువ్వు వీల్ ఛైర్ మీద పడుంటే కట్టుకున్న భార్యని చూసుకోలేక ఒక పనావిడను పెట్టుకుంది.. ఆ పనావిడ ఎవరో తెలుసా.. నువ్వు తెలీదు అని చెప్పిన నీ భార్య ఇందిర. మా అమ్మ నిన్ను సరిగా పట్టించుకోకపోయి ఉంటే ఈ గణ చేసిన పనికి నువ్వు జీవితాంతం వీల్ ఛైర్ మీద ఉండేవాడివి.. ఇదంతా వద్దు నాన్న మేం నీ పిల్లలం అని చెప్పు నాన్న. వీడికి భయపడుతున్నావా .. వాడేం చేయలేడు అని అంటుంది. దాంతో రాజశేఖరం ప్రేరణని తోసేస్తాడు.</p> <p>ఏయ్ ఎన్ని సార్లు చెప్పాలి.. నువ్వు నా కూతురు కాదు ఆవిడ నా భార్య కాదు.. ఈశ్వరి చెప్పు వాళ్లకి ఇక్కడి నుంచి వెళ్లమను అని అంటాడు. గణ చప్పట్లు కొట్టి ఐలవ్&zwnj;యూ నాన్న నేను చూసుకుంటా అని ఇప్పటికైనా అర్థమైందా తను మీ నాన్న కాదు మా నాన్న అని.. మీరు ఎవరో తెలీదు అని తన నోటితోనే చెప్పాడు కదా ఇంకా చూస్తారు ఏంటి వెళ్లండి.. మెడ పట్టుకొని గెంటేయకముందే పోండి.. మళ్లీ ఇక్కడికి రాకండి అని అంటాడు. సిద్ధూతో బావగారు వినపడిందా... వీళ్లకి తెగ సపోర్ట్ చేస్తారు కదా.. నేనేదో వాళ్లకి అన్యాయం చేశాను అన్నారు కదా.. ఇప్పుడు మా నాన్న ఆయన నోటితోనే చెప్పారు.. వీళ్లు నా వాళ్లు కాదు అని చెప్పారు కదా., ఇక వాళ్లని తీసుకొని బయల్దేరండి అని గణ అంటాడు. ఇందిర వణికిపోతూ షాక్&zwnj;లో తూలిపోతుంది. ప్రేరణ, ఐశ్వర్య తల్లిని పట్టుకొని ఏడుస్తూ తీసుకెళ్లిపోతారు. గణ సిద్ధూతో బావ మీ వాళ్లు వెళ్లిపోయారు.. ఇక నువ్వు వెళ్లి వాళ్లిన ఓదార్చుకో అని అంటాడు. దానికి సిద్ధూ &nbsp;కొందరితో కొన్ని తేల్చుకోవాల్సినవి ఉన్నాయి.. అవి తేల్చుకొని వెళ్లిపోతా అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.</p>
Read Entire Article