NEET UG 2025: విద్యార్థులకు గుడ్ న్యూస్ - పాత విధానంలోనే నీట్‌ యూజీ పరీక్ష నిర్వహణ

10 months ago 7
ARTICLE AD
<p style="text-align: justify;"><strong>NEET UG 2025:</strong> దేశంలోని మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్&zwnj;(National Eligibility cum Entrance Test) యూజీ (NEET UG 2025) పరీక్షను ఆన్&zwnj;లైన్&zwnj; కాకుండా ఆఫ్&zwnj;లైన్&zwnj; విధానంలోనే నిర్వహించడానికి కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పరీక్షను పాతవిధానంలోనే నిర్వహించనున్నట్లు నేషనల్&zwnj; టెస్టింగ్&zwnj; ఏజెన్సీ (ఎన్&zwnj;టీఏ) వెల్లడించింది. ఇకపై పాత విధానంలోనే 180 ప్రశ్నలతో కూడిన ప్రశ్నపత్రంతో నీట్ యూజీ పరీక్ష నిర్వహించనుంది. పరీక్ష సమయం 180 నిమిషాలు(3 గంటలు) ఉండనుంది. కేంద్ర విద్య, ఆరోగ్యశాఖల మధ్య సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం చివరకు ఓఎంఆర్&zwnj; పద్ధతిలో నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. నేషనల్&zwnj; మెడికల్&zwnj; కమిషన్&zwnj; (NMC) నిర్ణయం మేరకు.. నీట్&zwnj; యూజీ పరీక్ష పెన్&zwnj;-పేపర్&zwnj; విధానంలో నిర్వహించనున్నారు. ఒకేరోజు, ఒకే షిఫ్టులో ఈ పరీక్ష ఉంటుందని నేషనల్&zwnj; టెస్టింగ్&zwnj; ఏజెన్సీ (NTA) వెల్లడించింది.</p> <p style="text-align: justify;"><strong><span style="color: #0069ff;">ప్రశ్నల ఎంపిక విధానానికి స్వస్తి..</span></strong><br />నీట్ యూజీ పరీక్షకు సంబంధించి కోవిడ్&zwnj; సమయంలో ప్రవేశపెట్టిన ప్రశ్నల ఎంపిక విధానం తీసివేసినట్లు ఎన్టీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఫిజిక్స్&zwnj;, కెమిస్ట్రీ సబ్జెక్టుల నుంచి 45 చొప్పున ప్రశ్నలు, బయాలజీలో నుంచి 90 ప్రశ్నలకు 3 గంటల్లో పరీక్షను రాయాల్సి ఉంటుందని పేర్కొంది. దీంతో పెన్&zwnj;-పేపర్&zwnj; (OMR based) విధానంలో నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.</p> <p style="text-align: justify;">నీట్&zwnj; ఫలితాల ఆధారంగా ఎంబీబీఎస్, బీడీఎస్&zwnj;తోపాటు.. నేషనల్&zwnj; కమిషన్ ఫర్&zwnj; హోమియోపతి కింద బీహెచ్&zwnj;ఎంఎస్&zwnj; (BHMS) కోర్సులో ప్రవేవాలు చేపడతారు. దీంతోపాటు ఆర్మ్&zwnj;డ్&zwnj; మెడికల్&zwnj; సర్వీస్&zwnj; హాస్పిటల్స్&zwnj;లో బీఎస్సీ నర్సింగ్&zwnj; (BSc Nursing) కోర్సులో ప్రవేశాలకు నీట్ యూజీలో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఇక నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్&zwnj; కోర్సుకు కూడా నీట్&zwnj; యూజీ కోర్సులో అర్హత సాధించాల్సి ఉంటుందని నేషనల్&zwnj; టెస్టింగ్&zwnj; ఏజెన్సీ (NTA) తెలిపింది.</p> <p style="text-align: justify;"><span style="color: #0069ff;"><strong>ఆన్&zwnj;లైన్&zwnj;పై వెనక్కి..</strong></span><br />దేశంలో అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యే పరీక్షగా నీట్&zwnj; యూజీ నిలుస్తోన్న సంగతి తెలిసిందే. నీట్ యూజీ పరీక్షకు గతేడాది 24 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. జేఈఈ మెయిన్&zwnj; తరహాలోనే ఈసారి (2025) కూడా నీట్&zwnj; యూజీని ఆన్&zwnj;లైన్&zwnj; విధానంలో నిర్వహించాలని ఎన్&zwnj;టీఏ భావిస్తున్నట్లు మొదట వార్తలు వచ్చాయి. ఇస్రో మాజీ ఛైర్మన్&zwnj; కస్తూరి రంగన్&zwnj; ఛైర్మన్&zwnj;గా నియమించిన నిపుణుల కమిటీ సైతం ఆన్&zwnj;లైన్&zwnj; విధానం (కంప్యూటర్&zwnj; బేస్డ్&zwnj; టెస్ట్&zwnj; - CBT)లో నీట్&zwnj; నిర్వహించాలని సిఫారసు చేసింది. అయితే, తాజాగా కేంద్ర విద్య, ఆరోగ్యశాఖలు జరిపిన విస్తృత చర్చల్లో ఓఎంఆర్&zwnj; పద్ధతికే మొగ్గుచూపుతూ నిర్ణయం తీసుకున్నారు.</p> <p><strong>ALSO READ:&nbsp;</strong></p> <p style="text-align: justify;"><span style="color: #ff00eb;"><strong>తెలంగాణలో ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు, ఏ ఎగ్జామ్ ఎప్పుడంటే?</strong></span><br />తెలంగాణలో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల (కామన్ ఎంట్రెన్స్ టెస్టులు) షెడ్యూలును ఉన్నత విద్యామండలి జనవరి 15న ప్రకటించింది. అయితే ఆయా పరీక్షల నిర్వహణకు సంబంధించి.. దరఖాస్తు చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఫీజు ఇతర వివరాలతో కూడిన వివరణాత్మక నోటిఫికేషన్లను సంబంధిత సెట్ కన్వీనర్లు ప్రకటిస్తారు. వేర్వేరుగా నోటిఫికేషన్లు వెలువడతాయి.<br /><a title="ప్రవేశ పరీక్షల వివరాల కోసం క్లిక్ చేయండి.." href="https://telugu.abplive.com/education/telangana-state-common-entrance-tests-2025-dates-released-check-schedule-here-icet-mba-mca-eapcet-edcet-law-cet-194224" target="_blank" rel="noopener">ప్రవేశ పరీక్షల వివరాల కోసం క్లిక్ చేయండి..</a></p> <p style="text-align: center;"><strong><a title="మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.." href="https://telugu.abplive.com/education" target="_blank" rel="nofollow nofollow noopener">మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..</a></strong></p>
Read Entire Article