Nara Lokesh: దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్

3 months ago 7
ARTICLE AD
<p>AndhraPradesh investments Forbs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ , &nbsp;విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ &nbsp;చేసిన ఒక ఆసక్తికరమైన ట్వీట్ సోషల్ మీడియాలో, &nbsp;రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. &nbsp;భారతదేశం &nbsp; 2025-26 ఆర్థిక సంవత్సర మొత్తం పెట్టుబడులలో ఆంధ్రప్రదేశ్ వాటా ఏకంగా 25.3 శాతంగా ఉంది! ఏపీ కేవలం ఇతరులతో పోటీ పడటం లేదు.. అందరికంటే ముందు దూసుకుపోతోంది అంటూ ఆయన పేర్కొన్నారు. &nbsp;స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఇదేనని, పెట్టుబడిదారులు ఏపీని ఎంచుకోవాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.</p> <p>నారా లోకేష్ ఈ ట్వీట్ చేయడానికి ప్రధాన కారణం ఫోర్బ్స్ ఇండియా (Forbes India) , &nbsp;సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) వెల్లడించిన తాజా గణాంకాలు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు ఆకర్షించిన పెట్టుబడులను విశ్లేషించిన ఈ నివేదికల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశం మొత్తానికి వచ్చిన పెట్టుబడి ప్రతిపాదనల్లో నాలుగో వంతు వాటా ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే దక్కాయి. ఇది రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో ఒక చారిత్రాత్మక విజయంగా ప్రభుత్వం భావిస్తోంది.&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;</p> <p>రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న &nbsp;స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం ఇన్వెస్టర్లలో గొప్ప నమ్మకాన్ని కలిగించింది. గతంలో కేవలం అనుమతులకే పరిమితమైన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్థానంలో, ఇప్పుడు అనుమతులతో పాటు పరిశ్రమల స్థాపనలో వేగాన్ని జోడించడం వల్ల గూగుల్, రిలయన్స్, అదానీ, &nbsp;రాయ్&zwnj;డెన్ ఇన్ఫోటెక్ వంటి దిగ్గజ సంస్థలు వేల కోట్ల పెట్టుబడులతో ఏపీకి క్యూ కడుతున్నాయి. ముఖ్యంగా డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ ,&nbsp; ఐటీ రంగాల్లో ఏపీ అగ్రగామిగా నిలవడం ఈ గణాంకాల ద్వారా స్పష్టమవుతోందని నారా లోకేష్ చెబుతున్నారు.&nbsp;</p> <p>విశాఖపట్నంలో గూగుల్ ఏర్పాటు చేయనున్న ఏఐ డేటా హబ్, కర్నూలులో డ్రోన్ సిటీ , అమరావతిలో క్వాంటం వ్యాలీ వంటి మెగా ప్రాజెక్టులు రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చబోతున్నాయి. ముఖ్యమంత్రి <a title="చంద్రబాబు" href="https://telugu.abplive.com/topic/Chandrababu" data-type="interlinkingkeywords">చంద్రబాబు</a> నాయుడు దౌత్యం, లోకేష్ పారిశ్రామిక అనుకూల ప్రసంగాలు గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించాయి. దేశంలోని సగటు పెట్టుబడుల వృద్ధి రేటు కంటే ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు చాలా రెట్లు ఎక్కువగా ఉందని ఈ నివేదికలు నొక్కి చెబుతున్నాయని ప్రభుత్వ వర్గాలంటున్నాయి.&nbsp; &nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">25.3% of India&rsquo;s FY26 investments! <a href="https://twitter.com/hashtag/AndhraPradesh?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#AndhraPradesh</a> isn&rsquo;t catching up - it&rsquo;s pulling ahead. <br /><br />This is what Speed of Doing Business looks like.<a href="https://twitter.com/hashtag/ChooseSpeedChooseAP?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#ChooseSpeedChooseAP</a> <a href="https://t.co/7JKtosffXu">https://t.co/7JKtosffXu</a></p> &mdash; Lokesh Nara (@naralokesh) <a href="https://twitter.com/naralokesh/status/2007058634761756810?ref_src=twsrc%5Etfw">January 2, 2026</a></blockquote> <p>&nbsp;నారా లోకేష్ చేసిన ఈ ట్వీట్ ఆంధ్రప్రదేశ్ మళ్లీ పారిశ్రామికంగా పుంజుకుందని చెప్పడమే కాకుండా, దక్షిణాదిలో పెట్టుబడుల రాజధానిగా ఎదిగిందని చాటుతోంది. దేశంలోనే అతిపెద్ద పెట్టుబడులను దక్కించుకోవడం ద్వారా, రాబోయే రోజుల్లో లక్షలాది మంది యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.&nbsp;</p> <p><iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://telugu.abplive.com/web-stories/business/how-to-convert-cryptocurrency-into-our-rupees-232954" width="631" height="381" scrolling="no"></iframe></p>
Read Entire Article