Morning Top News: వైసీపీ కొత్త ప్లాన్ ఏంటి ? రేవంత్ రెడ్డికి భయపడేలేదన్న కేటీఆర్ వంటి మార్నింగ్ టాప్ న్యూస్

11 months ago 8
ARTICLE AD
<p>Morning Top News:&nbsp;</p> <p><strong>పవన్ ను పొగిడేస్తున్న వైసీపీ.. ప్లాన్ అదేనా...&nbsp;&nbsp;</strong></p> <p><a title="జనసేన" href="https://telugu.abplive.com/topic/Janasena" data-type="interlinkingkeywords">జనసేన</a> అధినేత పవన్ కల్యాణ్ ను ఇన్నాళ్లు తిట్టిన వైసీపీ నేతలు.. ఇప్పుడు పవన్ ఫలితాలను మార్చేయగల శక్తి ఉన్న రాజకీయనాయకుడు అంటూ పొగుడుతున్నారు. <a title="చంద్రబాబు" href="https://telugu.abplive.com/topic/Chandrababu" data-type="interlinkingkeywords">చంద్రబాబు</a>ను మించి పోతున్నారని ప్రశంసలు కూడా కురిపిస్తున్నారు. <a title="పవన్ కల్యాణ్" href="https://telugu.abplive.com/topic/Pawan-Kalyan" data-type="interlinkingkeywords">పవన్ కల్యాణ్</a> వల్లే ఓడిపోయామని కూడా బహిరంగంగా చెబుతున్నారు.&nbsp; హఠాత్తుగా వైసీపీ నేతల్లో వచ్చిన మార్పు చూసి రాజకీయవర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. <a href="https://telugu.abplive.com/politics/ysrcp-has-changed-in-the-case-of-pawan-kalyan-sudden-compliments-are-pouring-in-191130">పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..</a>&nbsp;</p> <p><strong>కేటీఆర్&zwnj;</strong><strong>పై కేసు నమోదు</strong>&nbsp;</p> <p>ఫార్ములా-ఈ కార్&zwnj; రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్&zwnj;పై కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో ఏ1గా కేటీఆర్&zwnj;ను.. ఏ2గా ఐఏఎస్ అరవింద్ కుమార్&zwnj;&zwnj;ను, ఏ3గా ప్రైవేటు కంపెనీ సీఈవో బీఎల్ఎన్ రెడ్డిని చేరుస్తూ ఏసీబీ కేసు ఫైల్ చేసింది. ఫార్ములా-ఈ కార్&zwnj; రేసు విషయంలో గవర్నర్&zwnj; జిష్ణుదేవ్&zwnj; వర్మ విచారణకు అనుమతులు ఇవ్వడంతో ఆ దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. దీంతో కేటీఆర్ అరెస్టు ఖాయమైనట్లు తెలుస్తోంది. <a href="https://telugu.abplive.com/telangana/brs-working-president-ktr-responds-on-acb-case-in-formula-e-car-race-issue-191122">పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..</a></p> <p><strong>ఓఆర్ఆర్&zwnj;</strong><strong>పై దర్యాప్తునకు సిట్: రేవంత్</strong></p> <p>ఓఆర్ఆర్&zwnj; టెండర్లపై విచారణకు ఆదేశిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటించారు. విచారణకు సంబంధించిన విధివిధానాలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు. ప్రతిపక్షాల డిమాండ్ లతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. దేశం నుంచి పారిపోవాలనే బీఆర్ఎస్ నేతలు ఓఆర్ ఆర్ టెండర్లను అమ్ముకున్నారని రేవంత్ ఆరోపించారు. ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్ కూడా స్వాగతిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. <a href="https://telugu.abplive.com/telangana/cm-revanth-reddy-decided-to-sit-investigation-on-orr-lease-tenders-191125">పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..</a></p> <p><strong>టీటీడీ స్వర్ణాంధ్ర విజన్ 2047</strong></p> <p>స్వర్ణాంధ్ర విజన్ - 2047 తరహాలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, పర్యావరణ నిర్వహణపై దృష్టి సారించింది. ఈ వ్యూహాత్మక చొరవలో భాగంగా &ldquo;తిరుమల విజన్ 2047&rdquo;ను ప్రారంభించినట్లు ప్రకటించింది. తిరుమలలో వారసత్వ పరిరక్షణను అమలు చేసే లక్ష్యంలో భాగంగా ప్రతిపాదనలు ఆహ్వానిస్తోంది. ఈ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు, టీటీడీ ఈ పరివర్తన ప్రణాళికకు సహకరించేందుకు ప్రఖ్యాత ఏజెన్సీలను ఆహ్వానిస్తూ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ని విడుదల చేసింది. <a href="https://telugu.abplive.com/news/ttd-invites-proposals-for-tirumala-vision-2047-191129">పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..</a>&nbsp;</p> <p><strong>జత్వానీ కేసులో హైకోర్టు వ్యాఖ్యలు</strong></p> <p>ఏపీ హైకోర్టులో నటి జత్వానీ కేసులో నిందితులుగా ఉన్న ఐపీఎస్ అధికారుల ముందస్తు బెయిల్ పై విచారణ జరిగింది.ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిది. ఏ 2గా ఉన్న సీతారామాంజనజేయులు కనీసం ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా వేయలేదని&nbsp; ఆయనను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది. హీరోయిన్ జత్వానీని వేధించిన కేసులో.. కేసులు నమోదు కావడంతో ఇతర ఐపీఎస్&zwnj;లు, పోలీసులు ముందస్తు బెయిల్ కోసంకోర్టుకెళ్లారు. విచారణ పూర్తయ్యే వరకూ వారిని అరెస్టు చేయవద్దని కోర్టు చెప్పింది. <a href="https://telugu.abplive.com/andhra-pradesh/ap-high-court-reserved-its-verdict-on-the-anticipatory-bail-of-the-police-officers-in-the-jatwani-case-191115">పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..</a></p> <p><strong>రేవంత్ రెడ్డికి భయపడేదే లేదు: కేటీఆర్</strong></p> <p>తనపై ఎన్ని కేసులు పెట్టినా <a title="రేవంత్ రెడ్డి" href="https://telugu.abplive.com/topic/Revanth-Reddy" data-type="interlinkingkeywords">రేవంత్ రెడ్డి</a>కి భయపడేదే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కేసులకు భయపడబోమని.. న్యాయబద్దంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ఫార్మూలా ఈ కార్ రేస్ పై శాసనసభలో చర్చ చేపట్టాలని మరోసారి డిమాండ్ చేశారు. చిల్లర కేసులకు భయపడేది లేదన్న కేటీఆర్... కాంగ్రెస్ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారన్నారు. ఈ కేసులో అవినీతి ఏంటో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.&nbsp; <a href="https://telugu.abplive.com/politics/brs-working-president-ktr-sensational-comments-on-e-formula-car-race-issue-191133">పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..</a></p> <p><strong>&nbsp;</strong><strong>మోహన్ బాబుకు&nbsp; </strong><strong>షాక్ఇచ్చిన&nbsp; </strong><strong>హైకోర్టు</strong></p> <p>పోలీసులు అరెస్టు చేయుకండా ఉండేందుకు మంచు మోహన్ బాబు చేసిన&nbsp; ప్రయత్నాలు విఫలమయ్యాయి.&nbsp; జర్నలిస్టుపై చేసిన హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారు.&nbsp; విచారణలో కౌంటర్ దాఖలు చేసేందుకు&nbsp; కేసును సోమవారానికి హైకోర్టు వాయిదా వేసింది. అయితే ఈ లోపు&nbsp; అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని మోహన్ బాబు న్యాయవాది కోరారు. కానీ ఇప్పటికిప్పుడు అలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని కోర్టు తేల్చి చెప్పింది. <a href="https://telugu.abplive.com/entertainment/mohan-babu-did-not-get-relief-in-telangana-high-court-191107">పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..</a></p> <p><strong>రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు</strong></p> <p>పార్లమెంటులో గురువారం తోపులాట వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది.&nbsp;<a href="https://telugu.abplive.com/topic/Congress">కాంగ్రెస్</a>&nbsp;అగ్రనేత&nbsp;<a href="https://telugu.abplive.com/topic/Rahul-Gandhi">రాహుల్ గాంధీ</a>పై&nbsp; బీజేపీ హత్యాయత్నం కేసు పెట్టింది. పార్లమెంట్ ఆవరణలో రాహుల్ గాంధీ తోయడం వల్లే తమ ఎంపీలు తీవ్రంగా గాయపడ్డారని కమలం పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే&nbsp;రాహుల్ గాంధీపై.. దాడి, ప్రేరేపణపై ఫిర్యాదు చేసామని,&nbsp; ఆయనపై సెక్షన్ 109, 115, 117, 125, 131, 351 కింద కేసులు నమోదు చేయాల్సిందిగా కోరామన్నారు. <a href="https://telugu.abplive.com/news/india/bjp-mps-case-of-attempted-murder-has-been-registered-against-rahul-gandhi-191111">పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..</a></p> <p><strong>సీబీఎస్ఈ ఆకస్మిక తనిఖీలలో నమ్మలేని నిజాలు&nbsp;</strong></p> <p><strong>&nbsp;</strong>దేశంలోని పలు పాఠశాలల్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్&nbsp; గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ఢిల్లీ, బెంగుళూరు, వారణాసి, బీహార్, గుజరాత్, ఛత్తీస్&zwnj;గఢ్&zwnj;ల్లోని 29 స్కూళ్లల్లో 'డమ్మీ' విద్యార్థుల నమోదును పరిశీలించేందుకు బుధ, గురువారాల్లో తనిఖీలు నిర్వహించింది. ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యే అనేక మంది విద్యార్థులు డమ్మీ స్కూళ్ల వైపు ఆసక్తి చూపుతుంటారు. <a href="https://telugu.abplive.com/news/india/cbse-sudden-inspection-at-29-schools-and-found-dummy-students-191128">పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..</a></p> <p><strong>&lsquo;</strong><strong>స్మృతి మంధాన&rsquo; </strong><strong>అరుదైన రికార్డు</strong></p> <p>టీమిండియా స్టార్ ప్లేయ&zwnj;ర్ స్మృతి మంధాన ఓ అరుదైన రికార్డును సాధించింది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధికసార్లు 50కిపైగా పరుగులు సాధించిన బ్యాటర్&zwnj;గా నిలిచింది. ఇప్పటి వరకు స్మృతి 30 సార్లు 50కిపైగా పరుగులు బాదారు. దీంతో న్యూజిలాండ్ క్రికెటర్ సుజీ బేట్స్(29)ని ఆమె అధిగమించారు. ఇక అంతర్జాతీయ టీ20ల్లో ఒక క్యాలెండర్&zwnj; ఇయర్&zwnj;లో అత్యధిక పరుగులు(763) చేసిన క్రికెటర్&zwnj;గా స్మృతి రికార్డు సృష్టించింది. <a href="https://telugu.abplive.com/sports/cricket/smriti-mandhana-creates-2-new-world-records-in-t20-cricket-aginst-wi-191149">పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..</a></p> <p>&nbsp;</p>
Read Entire Article