<p>న్యూఢిల్లీ/వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం నాడు భారత ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై స్పందించిన ప్రధాని మోదీ తనకు "అద్భుతమైన" ఫోన్ కాల్ వచ్చిందని, ఈ సందర్భంగా తన స్నేహితుడు డొనాల్డ్ ట్రంప్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారని చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంలో మద్దతు ఇచ్చినందుకు భారత ప్రధానికి డొనాల్డ్ ట్రంప్ కృతజ్ఞతలు చెప్పడం హాట్ టాపిక్ అవుతోంది. </p>
<p>నేడు (సెప్టెంబర్ 17న) నరేంద్ర మోదీ పుట్టినరోజు. అయితే మోదీ 75వ పుట్టినరోజుకు ఒక రోజు ముందు ట్రంప్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఇది సుంకాల సమస్యలపై ఒత్తిడిల మధ్య భారతదేశంతో అమెరికా సంబంధాలను పునరుద్ధరించడానికి చేస్తున్న చర్యల్లో ఒక ముఖ్యమైన విషయంగా పరిగణిస్తున్నారు. </p>
<p>"నా మిత్రుడు భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్ కాల్ మట్లాడాను. నేను అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాను. అతను అద్భుతంగా పని చేస్తున్నాడు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ముగించాలని మద్దతుకు తెలిపినందుకు ధన్యవాదాలు! ప్రెసిడెంట్ DJT," అని డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. </p>
<blockquote class="twitter-tweet">
<p dir="ltr" lang="en">Thank you, my friend, President Trump, for your phone call and warm greetings on my 75th birthday. Like you, I am also fully committed to taking the India-US Comprehensive and Global Partnership to new heights. We support your initiatives towards a peaceful resolution of the…</p>
— Narendra Modi (@narendramodi) <a href="https://twitter.com/narendramodi/status/1968002939538088179?ref_src=twsrc%5Etfw">September 16, 2025</a></blockquote>
<p>
<script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script>
</p>
<p><strong>ట్రంప్‌నకు ధన్యవాదాలు తెలిపిన ప్రధాని మోదీ</strong></p>
<p>తన పుట్టినరోజు సందర్భంగా ఫోన్ చేసినందుకు, తన 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినందుకు అమెరికా అధ్యక్షుడికి మోదీ ధన్యవాదాలు తెలిపారు. "మీలాగే, నేను కూడా భారతదేశం, అమెరికా గ్లోబల్ భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉన్నాను. ఉక్రెయిన్ వివాదానికి శాంతియుత పరిష్కారం కోసం మీరు తీసుకునే చర్యలకు మేం మద్దతు ఇస్తున్నాం" అని అన్నారు.</p>
<p>కెనడాలోని కననాస్కిస్‌లో జరిగిన G7 సమ్మిట్ సందర్భంగా జూన్‌లో ఫోన్‌లో మాట్లాడుకున్న తర్వాత ట్రంప్, <a title="నరేంద్ర మోదీ" href="https://telugu.abplive.com/topic/narendra-modi" data-type="interlinkingkeywords">నరేంద్ర మోదీ</a>ల మధ్య ఇదే మొదటి ఫోన్ కాల్. ఆ సంభాషణ తర్వాత రోజుల్లో భారతదేశంపై ట్రంప్ 50 శాతం సుంకాలు విధించారు. ఇందులో న్యూఢిల్లీ రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లపై 25 శాతం అదనపు సుంకాలు కూడా ఉన్నాయి. భారతదేశం తమపై విధిస్తున్న సుంకాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా విమర్శలు గుప్పించారు. అమెరికా అధికారులు సైతం భారత్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు.</p>
<p>గత వారంలో ట్రంప్ ఒక సోషల్ మీడియా పోస్ట్ లో.. భారతదేశం, అమెరికా తమ వాణిజ్య చర్చలలో మందుడుగు వేయడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదని తాను భావిస్తున్నానని, తన గుడ్ ఫ్రెండ్ మోదీతో రాబోయే వారాల్లో మాట్లాడటానికి ఎదురు చూస్తున్నానని అన్నారు. మోదీ ఈ పోస్ట్‌కు స్పందిస్తూ.. భారతదేశం, అమెరికా సన్నిహితులు అని, సహజంగానే భాగస్వాములు" అని పేర్కొన్నారు.</p>
<p>భారతదేశం, అమెరికా వాణిజ్య ఒప్పందంపై త్వరలో చర్చలు జరిగే అవకాశం ఉంది. టారిఫ్‌లను అన్‌లాక్ చేయడానికి మా వాణిజ్య చర్చలు మార్గం సుగమం చేస్తాయని ట్రంప్ అన్నారు. ఈ చర్చలను వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి మా బృందాలు కృషి చేస్తున్నాయన్నారు. తాను సైతం ట్రంప్‌తో మాట్లాడటానికి ఎదురు చూస్తున్నానని.. మన ప్రజలందరికీ ప్రకాశవంతమైన, మరింత మెరుగైన భవిష్యత్తును ఇవ్వడానికి మేం కలిసి పనిచేస్తామన్నారు ప్రధాని మోదీ. </p>