MLC Kavitha Sensational Comments: అది భూ భారతి కాదు భూ హారతి, అది తిరోగమన చర్య - ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

11 months ago 8
ARTICLE AD
<p>BRS MLC Kavitha About Bhu Bharati Bill | హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం భూముల కోసం తీసుకొచ్చిన భూభారతి చట్టం, భూ హారతి అవుతుందని భూభారతి బిల్లుపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత భూమోసాలు పోయాయి. తెలంగాణ రైతుకు రక్షణ కవచం ధరణి. అలాంటి ధరణితో ఆటలాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చరిత్ర ఎన్నటికీ క్షమించదు. రాష్ట్ర ప్రజలు, రైతులు వెంటబడి మరీ ధరణిని తిరిగి సాధించుకుంటారని నమ్మకం ఉంది.&nbsp;</p> <p><br /><strong>భూభారతి ఒక తిరోగమన చర్య</strong><br />రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి ఒక తిరోగమన చర్య. ఆ చట్టం కచ్చితంగా భూహారతి &nbsp;అయ్యేటట్లు కనిపిస్తుంది. ఆ భూ మాత పోర్టల్ భవిష్యత్తులో భూమేతకే దారి తీస్తుంది. బీఆర్ఎస్ (BRS) అంటే భూ రక్షణ సమితి అని రైతులు, ప్రజలు భావిస్తున్నారు. భూమి కోసం ప్రాణమిచ్చేది ఒకరు సైనికుడు అయితే, మరొకరు రైతు. ధరణిలో ఏమైనా సమస్యలు కనిపిస్తే వాటిని పరిష్కరించుకొని ముందుకెళ్లాలి. కానీ ఆ వ్యవస్థనే రద్దు చేయడం సరికాదు. ధరణిలో కుట్ర జరిగిందని ప్రభుత్వం చెప్పడం దారుణం.&nbsp;</p> <p>తెలంగాణలో 2.8 కోట్ల ఎకరాల భూమి ఉండగా.. అందులో 1.5 కోట్ల ఎకరాలు సాగు చేస్తున్నారు. మరో 17.8 లక్షల ఎకరాల భూమి వివాదాల్లో ఉంది. గతంలో కౌలుదారులు కేసులు వేస్తే 20 నుంచి 25 ఏళ్ల పాటు రైతులు కోర్టుల చుట్టు తిరగాల్సి వచ్చేది. కేసీఆర్ రైతుకు మాత్రమే భూమి యాజమాన్య హక్కు ఉండేలా చేశారు. రైతుల భూమికి భద్రత కల్పించింది కేసీఆర్. ధరణి వల్ల భూ సమస్యలు పరిష్కారమయ్యాయి. 100 రోజుల్లో దాదాపు 35749 ఉద్యోగులు రెవెన్యూ రికార్డులను ప్రక్షాళణ చేశారు. అనంతరం భూమి వివరాలను ధరణిలో ఎక్కించారు. ధరణి కన్నా ముందు చార్మినార్ కూడా రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి ఉండేది.</p> <p>ధరణితో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ భూములను కాపాడింది<br />ధరణి వచ్చిన తర్వాత ఒక్క గుంట ప్రభుత్వ భూమి కూడా అన్యక్రాంతం కాలేదు<br />భూ రిజిస్ట్రేషన్ల వ్యవస్థను బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేరువ చేసింది<br />రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ఒకే సారి చేయడం వల్ల 42 నిమిషాల్లో పని పూర్తయ్యేది<br />భూమికి సంబంధించి అన్ని పనులు నిమిషాల వ్యవధిలో పూర్తయ్యాయి<br />భూరికార్డుల సరిగ్గా ఉండడం వల్ల భూములు రేట్లు పెరిగాయి, రాష్ట్ర సంపద పెరిగింది<br />మ్యాన్యువల్ పహాణీల వల్ల రాష్ట్రంలో అనేక వివాదాలు ఏర్పడేవి... ధరణి ఆ సమస్యను తీర్చింది<br />భూరికార్డులు, యాజమానుల పేర్లు స్పష్టంగా ఉండడం వల్ల రైతులకు రైతు బంధు అందింది<br />దాదాపు 66 లక్షల మందికి రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు అందించింది</p> <p>గతంలో పంట రుణాలు కూడా వచ్చేవి కావు... ధరణి వచ్చిన తర్వాత బ్యాంకులు పంట రుణాలు ఇవ్వడం మొదలుపెట్టాయి<br />తద్వారా ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి రైతులు విముక్తి అయ్యారు<br />ధరణికి ముందు లక్షలాది మంది ప్రజలు, రైతులు ఇబ్బందులకు గురయ్యారు<br />భూదాన్, అటవీ, ప్రభుత్వం భూములు అన్యక్రాంతం కాకుండా ఉండేందుకు వాటిని పార్ట్ బీ లో చేర్చాము<br />ఎంజాయ్ మెంట్ సర్వే చేయిస్తామని ప్రభుత్వం చెబుతుంది... దీని వల్ల గ్రామాల్లో లేని తగాదాలు మొదలువుతాయి<br />పల్లెలు ప్రశాంతంగా ఉండాలంటే... ఎంజాయ్ మెంట్ సర్వే తేనెతుట్టెను కదపవద్దు</p> <p>మళ్లీ 32 కాలమ్ లతో పహాణీలను రాయడం ప్రారంభిస్తే మళ్లీ పాత వ్యవస్థ వస్తుంది<br />రైతుల మధ్య వివాదాలు తలెత్తుతాయి... తద్వారా కేసుల భారం, ఆర్థిక భారం అవుతుంది<br />రాష్ట్రమంతా ఒకే సారి కాకుండా... దశల వారీగా రీసర్వే &nbsp;చేపట్టాలి<br />ఎవరూ ట్యాంపర్ చేయడానికి వీలు లేకుండా పాస్ బుక్ లు ఉన్నాకా... భూధార్ కార్డు ఎందుకు ?<br />ఖాతా నెంబరు ఉన్న తర్వాత భూదార్ నెంబరు ఎందుకన్నది ప్రజల్లో అనుమానాలు కలుగుతున్నాయి<br />ఇప్పటికన్నా ప్రభుత్వం నిజాలు చెప్పాలి<br />ప్రజలను అయోమయానికి గురిచేస్తున్న ప్రభుత్వ<br />హైదరాబాద్ చుట్టుముట్టున్న ఆబాదీ భూములపై ప్రభుత్వం పెద్దల కన్ను పడిందని ప్రచారం జరుగుతోంది<br />భూభారతి వల్ల తప్పు జరిగితే ప్రభుత్వ ఉద్యోగులకు శిక్ష వేస్తామని భయపెట్టడం సరికాదు<br />భూభారతిలో కౌలుదారులు, అనుభవదారుల కాలమ్ పెట్టే ఆలోచనను విరమించుకోవాలి<br />కౌలుదారులను వేరే విధంగా ఆదుకోవాలి&rsquo; అని కవిత అన్నారు.</p>
Read Entire Article