Merugu Nagarjuna: వైసీపీ మాజీ మంత్రికి ఊరట - మేరుగు నాగార్జునపై రేప్ కేసును క్వాష్ చేసిన ఏపీ హైకోర్టు

10 months ago 8
ARTICLE AD
<p><strong>Rape case against former AP minister Murhu Nagarju quashed :</strong> వైసీపీ మాజీ మంత్రి మెరుగు నాగార్జునకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన అత్యాచారం కేసును హైకోర్టు క్వాష్ చేసింది. &nbsp;మాజీ మంత్రి మేరుగ నాగార్జునపై తాడేపల్లి పోలీస్ స్టేషన్&zwnj;లో గత ఏడాది నవంబర్&zwnj;లో తనను లైంగికంగా వేధించారని విజయవాడకు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేసింది. &nbsp;ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తనకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మేరుగు నాగార్జున రూ.90 లక్షలు తీసుకున్నాడని విజయవాడకు చెందిన బాధితురాలు &nbsp; ఫిర్యాదులో పేర్కొంది. తనను శారీరంగా కూడా ఉపయోగించుకున్నారని పలుమార్లు అత్యాచారం చేశాడని తెలిపింది. ఇప్పుడు తన డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగితే చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. విశాఖలో ఓ గిరిజన టీచర్&zwnj;ను స్లో పాయిజన్&zwnj; ద్వారా చంపేశానని.. నీదే గతి పడుతుందని మేరుగు నాగార్జున పీఏ మురళి బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. తనకు రావాలని రూ.90 లక్షలను ఇప్పించాలని విజ్ఞప్తి చేసింది.&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;&nbsp;</p> <p>బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తనపై నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని.. ఫిర్యాదు చేసిన మహిళ తప్పుడు కేసు పెట్టినట్లుగా వాంగ్మూలం ఇచ్చిందని ఆయన హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ మహిళ కూడా నాగార్జునపై తాను తప్పుడు ఫిర్యాదు చేశానని.. పోలీసులు కేసును కొట్టేస్తే అభ్యంతరం లేదని అఫిడవిట్ దాఖలు చేశారు. కానీ ధర్మాసనం వెంటనే క్వాష్ చేయడానికి అంగీకరించలేదు. ముందు ఫిర్యాదు చేయడం.. ఆ తర్వాత కోర్టుకొచ్చి కేసు కొట్టేయాలని కోరడాన్ని ఈమధ్య తరచూ చూస్తున్నామని.. బాధిత మహిళ కోరగానే కేసు కొట్టేయలేమని.. తప్పుడు ఫిర్యాదు చేసినట్ల తేలితే ఫిర్యాదుదారు కూడా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హైకోర్టు హెచ్చరించింది. &nbsp;</p> <p>పోలీసులు కూడా ఈ కేసుపై విచారణ కొనసాగించారు. అయితే మహిళ సహకరించలేదు. దీంతో పోలీసులు కూడా దర్యాప్తు చేయడానికి ఏమీ లేకపోయింది. చివరికి హైకోర్టు కేసును క్వాష్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అత్యాచారం కేసు తీవ్రమైనది కావడంతో ఫిర్యాదు చేసిన మహిళతో మెరుగు నాగార్జున వెంటనే రాజీకి వచ్చారని.. ఆమెకు ఇవ్వాల్సిన డబ్బులను ఇచ్చేయడంతో కేసును ఉపసంహరించుకున్నారని.. తప్పుడు ఫిర్యాదు చేశానని కోర్టుకు అఫిడవిట్ సమర్పించారని.. ఆ వ్యవహారాలను కూడా వైసీపీకి చెందిన న్యాయవాదులే చూసుకున్నారని చెబుతున్నారు.&nbsp;</p> <p>అధికారం కోల్పోయిన తర్వాత పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదవుతూ వస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాలపై కేసులు నమోదవుతూండటంతో చాలా మంది సైలెంట్ అయిపోయారు. అత్యాచారం కేసు తీవ్రమైనది కావడంతో బాధిత మహిళతో రాజీకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించి అనుకున్నది సాధించారు మాజీ మంత్రి.&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;</p> <div id="article-hstick-inner" class="abp-story-detail "> <p><strong>Also Read:&nbsp;<a href="https://telugu.abplive.com/trending/viral-girl-kumbh-mela-sensation-monalisa-captured-the-movement-194798">Mahakumbh Viral Girl Monalisa: కాటుక కళ్ల చిన్నది.. కుంభమేళాను &nbsp;కట్టిపడేసింది.&nbsp;</a></strong></p> </div> <div class="article-footer"> <div class="article-footer-left ">&nbsp;</div> </div>
Read Entire Article