Maoist encounter: ఎన్‌కౌంటర్ అయిన వారిలో దేవ్‌జీ, ఆజాద్ లేరు - లొంగిపోవాలని ఇంటలిజెన్స్ చీఫ్ పిలుపు

2 weeks ago 2
ARTICLE AD
<p><strong>Wednesday morning encounter:</strong> &nbsp;ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ ప్రాంతంలోని రంపచోడవరం అటవీ ప్రాంతంలో &nbsp;బుధవారం ఉదయం జరిగిన ఎన్ కౌంటర్&zwnj;లో ఏడుగురు మావోయిస్టులు చనిపోయారు. వారిలో దేవ్ జీ, ఆజాద్ తో సహా పలువురు కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారన్న ప్రచారం జరిగింది. అయితే చనిపోయిన వారిలో టెక్ శంకర్ ఒక్కరే కీలకమైన నేతల అని ఏపీ ఇంటలిజెన్స్ ఏడీజీ లడ్హా ప్రకటించారు.&nbsp; &nbsp;</p> <p><strong>మారేడుమిల్లికి&nbsp; ఐదు కిలోమీటర్ల దూరంలో&nbsp; బుధవారం ఉదయం మరో ఎన్ కౌంటర్&nbsp;&nbsp;</strong></p> <p>ఈ ఎదురుకాల్పులు రంపచోడవరం మండలం జీఎం వలసా ప్రాంతంలో జరిగాయి. ఏపీ పోలీసులు, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్ఓజీ), గ్రేహౌండ్స్ మొదలైన భద్రతా బలగాలు కలిసి నిర్వహించిన ఆపరేషన్&zwnj;లో మావోయిస్టులు తమ ఆయుధాలతో ఎదురుదాడి చేయడంతో &nbsp;కాల్పులు జరిగాయి. చివరికి ఏడుగురు మావోయిస్టులు చనిపోయారు. &nbsp;చనిపోయిన వారిలో &nbsp;మెట్టూరు జోగరావు &nbsp;అలియాస్ టెక్ శంకర్ ఉన్నారు. : శ్రీకాకుళం జిల్లాకు చెందిన టెక్ శంకర్ ఆంధ్ర-ఒడిశా బార్డర్ (ఏఒబి) ప్లూటూన్ కమాండర్. ఐఈడీలు, ఆయుధాల తయారీ, కమ్యూనికేషన్ నిపుణుడు.&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;</p> <p><strong>తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ ఉన్నారని ప్రచారం - కానీ టెక్ శంకర్ హతం&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;</strong></p> <p>మృతుల్లో మావోయిస్టు అగ్రనేత, పార్టీ ప్రధాన కార్యదర్శి తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్ జీ ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఆయన సెక్యూరిటీ టీం అంతా పట్టుబడటంతో ఆయనను కూడా పట్టుకున్నారని.. &nbsp;ఎన్ కౌంటర్ చేస్తారని కొంత మంది ఆరపణలుచేశారు. &nbsp;అయితే ఈ ప్రచారాన్ని పోలీసులు ఖండించారు. కాగా, మృతులు అంతా చత్తీస్ గడ్ రాష్ట్రానికి చెందిన వారేనని పోలీసులు చెబుతున్నారు. మొత్తం నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఈ ఎన్కౌంటరులో చనిపోయారు. జోగారావు, జ్యోతితో పాటు సురేశ్, గణేష్, వాసు, అనిత, షమ్మిగా మిగిలిన వారిని గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించారు. &nbsp; ఎదురుకాల్పుల స్థలంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు, IEDలు, కమ్యూనికేషన్ డివైస్&zwnj;లు &nbsp;స్వాధీనం చేసుకున్నారు.&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;&nbsp;</p> <p><strong>షెల్టర్ కోసం చత్తీస్ ఘడ్ నుంచి ఏపీకి వస్తున్న మావోయిస్టులు - లొంగిపోవాలని లడ్హా పిలుపు&nbsp; &nbsp; &nbsp; &nbsp;&nbsp;</strong><br />&nbsp;<br />ఏపీలో మావోయిస్ట్ కార్యకలాపాలు తగ్గుముఖం పట్టినా, చత్తీస్&zwnj;గఢ్, తెలంగాణ నుంచి వారు రాష్ట్రంలోకి ప్రవేశించి కొత్తగా బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారని పోలీసులు &nbsp;చెబుతున్నారు. . NTR, కృష్ణ, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో 50 మంది మావోయిస్టులు, వారి సహాయకులు అరెస్టయ్యారు. వీరిలో సీనియర్ నేతలు, లాజిస్టిక్స్ హ్యాండ్లర్లు, కమ్యూనికేషన్ ఆపరేటర్లు, ఆర్మ్డ్ ప్లూటూన్ సభ్యులు, పార్టీ క్యాడర్లు ఉన్నారు. మాడ్వీ &nbsp;హిద్మాతో సన్నిహితంగా ముడిపడినవారే ఎక్కువగా అరెస్టయ్యారు. ఈ ఆపరేషన్లు ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా నిర్వహించామని, మావోయిస్టుల నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని ఏడీజీ లడ్డా పేర్కొన్నారు.&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;</p> <p><iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://telugu.abplive.com/web-stories/news/nitish-kumar-is-a-unique-leader-in-indian-politics-ten-key-facts-about-him-227332" width="631" height="381" scrolling="no"></iframe><br />&nbsp;&nbsp;</p>
Read Entire Article