Manipur President Rule: మణిపూర్‌  రాష్ట్రపతి పాలన ఎత్తివేత! MHA నోటిఫికేషన్ జారీ!

2 months ago 8
ARTICLE AD
<p><strong>Manipur President Rule:</strong> దాదాపు ఏడాది తర్వాత బుధవారం (ఫిబ్రవరి 4, 2025) మణిపూర్&zwnj;లో రాష్ట్రపతి పాలన ఎత్తివేశారు. ఫిబ్రవరి 13, 2025 నుంచి మణిపూర్&zwnj;లో రాష్ట్రపతి పాలన అమలులో ఉంది. రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత, 60 మంది సభ్యుల శాసనసభను తాత్కాలికంగా నిలిపివేశారు. అసెంబ్లీ పదవీకాలం 2027లో ముగుస్తుంది. కొత్తగా నియమితులైన బిజెపి శాసనసభా పక్ష నాయకుడు యుమ్నామ్ ఖేమ్&zwnj;చంద్ సింగ్ మణిపూర్&zwnj;లో ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ అజయ్ కుమార్ భల్లాకు అభ్యర్థన పెట్టుకున్నారు. దీంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. &nbsp;</p> <h3>ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న ఖేమ్&zwnj;చంద్&nbsp;</h3> <p>బిజెపికి చెందిన 37 మంది ఎమ్మెల్యేలలో 35 మంది, పార్టీ కేంద్ర పరిశీలకుడు తరుణ్ చుగ్, ఈశాన్య ఇన్&zwnj;ఛార్జ్ సంబిత్ పాత్రా, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు ఎ. శారదా దేవి సమక్షంలో వై. ఖేమ్&zwnj;చంద్ సింగ్ మంగళవారం (ఫిబ్రవరి 3, 2026) శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. ఖేమ్&zwnj;చంద్ సింగ్ మరికొన్ని గంటల్లోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.</p> <h3>మణిపూర్&zwnj;లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు?</h3> <p>మణిపూర్&zwnj;లో ప్రస్తుతం బీజేపీకి 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో 32 మంది బీజేపీ అభ్యర్థులు గెలిచారు. జేడీయూ ఆరు సీట్లు గెలుచుకుంది, వారిలో ఐదుగురు <a title="బీజేపీ" href="https://telugu.abplive.com/topic/BJP" data-type="interlinkingkeywords">బీజేపీ</a>లో చేరారు. మిగిలిన ఎమ్మెల్యేలు నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్&zwnj;పీపీ) నుంచి ఆరుగురు, నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్&zwnj;పీఎఫ్) నుంచి ఐదుగురు, <a title="కాంగ్రెస్" href="https://telugu.abplive.com/topic/Congress" data-type="interlinkingkeywords">కాంగ్రెస్</a> నుంచి ఐదుగురు, కుకి పీపుల్స్ అలయన్స్ నుంచి ఇద్దరు, జేడీయూ నుంచి ఒకరు, ముగ్గురు స్వతంత్రులు.</p> <h3>అనేక సమావేశాల తర్వాత బిజెపి నిర్ణయం</h3> <p>గత కొన్ని నెలలుగా, బిజెపి కేంద్ర నాయకత్వం దాని మెయిటీ, కుకి ఎమ్మెల్యేలు, మిత్రపక్షాలు NPF, NPP, కొంతమంది స్వతంత్ర ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రాజకీయ పరిస్థితి అనుకూలంగా ఉందో లేదో అంచనా వేయడానికి అనేక రౌండ్ల భేటీలు జరిగాయి. ఫిబ్రవరి 9, 2025న ముఖ్యమంత్రి పదవికి ఎన్. బిరెన్ సింగ్ రాజీనామా చేసిన తర్వాత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. మెయిటీ, కుకి వర్గాల మధ్య నెలల తరబడి ఘర్షణ పూరిత వాతావరణ నెలకొంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు జరిగాయి. దీంతో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి నేటి వరకు రాష్ట్రపతి పాలన కొనసాగుతూ వచ్చింది. &nbsp;</p> <h3>యమ్నం ఖేమ్&zwnj;చంద్ సింగ్ ఎవరు?</h3> <p>మాజీ తైక్వాండో అథ్లెట్ అయిన ఖేమ్&zwnj;చంద్ సింగ్ 2017, 2022లో సింగ్జమేయ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థిగా మణిపూర్ శాసనసభకు ఎన్నికయ్యారు. గతంలో ఆయన 2017 నుంచి 2022 వరకు మణిపూర్ శాసనసభ స్పీకర్&zwnj;గా పనిచేశారు. 2022లో బిరేన్ సింగ్ రెండో ప్రభుత్వంలో ఆయన క్యాబినెట్ మంత్రిగా నియమితులయ్యారు.</p>
Read Entire Article