Man Eater: ఆ పులి కడుపులో మహిళ వెంట్రుకలు, చెవి రింగులు - మరో క్రూర మృగం దాడిలోనే మ్యాన్ ఈటర్ మృతి?

10 months ago 8
ARTICLE AD
<p><strong>Woman Hair And Ear Rings In Wayanad Tiger Stomach:&nbsp;</strong>కేరళలోని వయనాడ్ జిల్లాలో 'మ్యాన్ ఈటర్'గా పేరొందిన పులి సోమవారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పులి కళేబరానికి పోస్టుమార్టం నిర్వహించగా.. దాని పొట్టలో మహిళ వెంట్రుకలు, చెవి రింగులు, వస్త్రాలు లభ్యమయ్యాయి. ఇవి ఇటీవల పులి దాడిలో ప్రాణాలు కోల్పోయిన మహిళవేనని అటవీ అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కాగా.. వయనాడ్&zwnj;లోని మనంతవాడి సమీపంలోని కాఫీ తోటలో పని చేస్తోన్న రాధ (45) అనే మహిళపై ఇటీవల పులి దాడి చేసి చంపి మృతదేహంలో సగ భాగం తినేసింది. అనంతరం అటవీ శాఖ అధికారిపైనా దాడికి పాల్పడింది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.</p> <p><strong>'మ్యాన్ ఈటర్'గా ప్రకటన</strong></p> <p>మహిళ ప్రాణాలు తీయడం, వరుస దాడులకు పాల్పడుతోన్న క్రమంలో&nbsp; ఆ పెద్ద పులిని 'మ్యాన్ ఈటర్'గా ప్రకటించిన ప్రభుత్వం కనిపిస్తే చంపేయాలని ఆదేశించింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన అటవీ అధికారులు పులి కోసం ముమ్మరంగా వేట సాగించారు. కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం కర్ఫ్యూ సైతం విధించింది. పంచరకొల్లి, పిలకావు, చిరక్కర డివిజన్లలోని అన్ని పాఠశాలలు, అంగన్వాడీలు, మదర్సాలు, ఇతర సంస్థలు మూతపడ్డాయి.</p> <p>ఆదివారం మధ్యాహ్నం పులి ఉనికిని గుర్తించిన అధికారులు సోమవారం ఉదయం దాని కళేబరాన్ని గుర్తించారు. పిలకావు ప్రాంతంలో పాడుబడిన ఇంటి వెనుక దాని కళేబరాన్ని గుర్తించారు. పులి శరీరంపై ఉన్న గాయాల ఆధారంగా మరో క్రూరమృగం దాడిలో చనిపోయి ఉంటుందని భావిస్తున్నారు. అనంతరం నిర్వహించిన పోస్టుమార్టంలో మహిళ వెంట్రుకలు, చెవి రింగులు గుర్తించడంతో అది 'మ్యాన్ ఈటర్' అని గుర్తించారు. కాగా.. ఇటీవల ప్రజలు పులులను చూసినట్లు నిషేధించిన అన్ని ప్రాంతాల్లోనూ అటవీ అధికారులు క్షుణ్ణంగా గాలింపు చేపడుతున్నారని కేరళ అటవీ శాఖ మంత్రి ఏకే శశీంద్రన్ పేర్కొన్నారు.</p> <p><strong>Also Read: <a title="Maoist Mission 2026: ఆ 35 మంది తెలుగు మావోయిస్టుల కోసమే ఛత్తీస్&zwnj;గఢ్&zwnj;లో కేంద్ర బలగాల నెక్ట్స్ కూంబింగ్ ఆపరేషన్..!" href="https://telugu.abplive.com/news/india/central-forces-next-combing-operation-in-chhattisgarh-forest-area-for-35-telugu-maoist-leaders-abpp-195725" target="_blank" rel="noopener">Maoist Mission 2026: ఆ 35 మంది తెలుగు మావోయిస్టుల కోసమే ఛత్తీస్&zwnj;గఢ్&zwnj;లో కేంద్ర బలగాల నెక్ట్స్ కూంబింగ్ ఆపరేషన్..!</a></strong></p>
Read Entire Article