Mahakumbha Mela 2025:కుంభమేళ వేళ పర్యాటకులకు షాక్! 50% పెరగ‌నున్న ప‌డ‌వ‌ల చార్జీలు

11 months ago 8
ARTICLE AD
<p>Mahakumbha Mela 2025: మ&zwnj;హాకుంభ&zwnj;మేళా(Maha Kumbha Mela) హిందువులకు అత్యంత ప&zwnj;విత్ర&zwnj;మైన పండుగ&zwnj;నే చెప్పాలి. ఎన్నో ఏళ్ల&zwnj;కు ఒక్క&zwnj;సారి వ&zwnj;చ్చే ఈ కుంభ&zwnj;మేళాలో పాల్గొని ప&zwnj;విత్ర స్నానం ద్వారా.. ప&zwnj;ర&zwnj;మ ప&zwnj;విత్రం కావాల&zwnj;ని హిందువులు(Hindus) కోరుకుంటారు. ఉత్తరప్రదేశ్&zwnj;(Uttara Pradesh)లోని ప్రయాగ్&zwnj;రాజ్&zwnj;(Prayagraj)లో వ&zwnj;చ్చే ఏడాది జనవరి 13 నుంచి ఈ &nbsp;మహా కుంభమేళా ప్రారంభంకానుంది. ఈ మ&zwnj;హా ఉత్స&zwnj;వానికి సంబంధించి.. ఇప్ప&zwnj;టికే ఏర్పాట్లు కూడా వ&zwnj;డివ&zwnj;డిగా సాగుతున్నాయి. స్నాన ఘాట్ల నిర్వ&zwnj;హ&zwnj;ణ&zwnj;తోపాటు.. వ&zwnj;స&zwnj;తులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు అస&zwnj;లు కుంభ&zwnj;మేళా నిర్వ&zwnj;హించే ప్ర&zwnj;యాగ్&zwnj;రాజ్ ప్రాంతాన్ని `కుంభ&zwnj;మేళా జిల్లా` కూడా.. ఉత్త&zwnj;ర&zwnj;ప్ర&zwnj;దేశ్&zwnj;లోని యోగి ఆదిత్య&zwnj;నాధ్(CM Yogi Adityanath) ప్ర&zwnj;భుత్వం తీర్మానం చేసిన విష&zwnj;యం తెలిసిందే. ల&zwnj;క్ష&zwnj;లు కాదు.. కోట్ల సంఖ్య&zwnj;లోనే హిందువులు ఈ కుంభ&zwnj;మేళాలో పాల్గొంటార&zwnj;ని ప్ర&zwnj;భుత్వం అంచ&zwnj;నా వేసింది. అయితే.. ఈ సారి కుంభ&zwnj;మేళాకు వ&zwnj;చ్చే భ&zwnj;క్తులు.. సాదాసీదాగా కాకుండా.. మ&zwnj;రిన్ని సొమ్ములు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే.. స&zwnj;ర్కారు తీసుకున్న నిర్ణ&zwnj;యం ప్ర&zwnj;కారం.. కుంభ&zwnj;మేళాలో న&zwnj;దిలో ప్ర&zwnj;యాణించేందుకు ప&zwnj;డ&zwnj;వల ప్ర&zwnj;యాణ రుసుమును ప్ర&zwnj;భుత్వం 50 శాతం వ&zwnj;ర&zwnj;కు పెంచింది.&nbsp;</p> <p><strong>50 శాతం అద&zwnj;నం!</strong></p> <p>డిమాండ్ ఎంత ఉంటే అంత త&zwnj;క్కువ ధ&zwnj;ర&zwnj;లకు సేవ&zwnj;లైనా వ&zwnj;స్తువులైనా ప్ర&zwnj;జ&zwnj;ల&zwnj;కు చేరువ చేయాల&zwnj;ని ఆర్థిక సూత్రాలు చెబుతాయి. కానీ, గ&zwnj;త కొన్నేళ్లుగా దేశంలో దీనికి రివ&zwnj;ర్స్ న&zwnj;డుస్తోంది. డిమాండ్ ఎక్కువ&zwnj;గా ఉంటే.. విమాన చార్జీలు పెంచుకునే వెసులుబాటు క&zwnj;ల్పించిన&zwnj;ట్టే.. ఇప్పుడు కుంభ&zwnj;మేళా(Kumbhamela) సంద&zwnj;ర్భంగా భారీ ఎత్తున త&zwnj;ర&zwnj;లి వ&zwnj;చ్చే ప్ర&zwnj;యాణికుల నుంచి ఎక్కువ మొత్తం తీసుకునేలా ప&zwnj;డ&zwnj;వ&zwnj;ల నిర్వాహ&zwnj;కుల&zwnj;కు యూపీ ప్ర&zwnj;భుత్వం అనుమ&zwnj;తి ఇచ్చింది. బోట్&zwnj;మెన్&zwnj;(Boatmen)ల ఆదాయాన్ని(Income) పెంచడానికి, ఫెయిర్ అడ్మినిస్ట్రేషన్ బోట్ల ఛార్జీలను 50 శాతం పెంచడానికి అంగీకరించింది. అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్(Collector) (మహా కుంభ్) వివేక్ చతుర్వేది(Vivek chaturvedi) దీనిపై స్పందిస్తూ.. ప&zwnj;విత్ర&zwnj; సంగంలో తిరిగే బోట్ల ఛార్జీలను 50 శాతం పెంచిన&zwnj;ట్టు తెలిపారు. చాలా కాలంగా బోట్ య&zwnj;జ&zwnj;మానులు త&zwnj;మ&zwnj; ఛార్జీలను పెంచాలని డిమాండ్ చేస్తున్నారని, ప్రయాగ్&zwnj;రాజ్ జిల్లా సెయిలర్స్ అసోసియేషన్, ఫెయిర్ అడ్మినిస్ట్రేషన్ మధ్య జరిగిన చ&zwnj;ర్చ&zwnj;ల అనంత&zwnj;రం రుసుములు పెంచుతూ నిర్ణ&zwnj;యం తీసుకున్న&zwnj;ట్టు తెలిపారు. &nbsp;</p> <p><strong>Also Read: <a title="మహా కుంభమేళా కోసం రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లు .. ఉచిత రైలు ప్రయాణం నిజమా!" href="https://telugu.abplive.com/spirituality/special-trains-for-kumbh-mela-2025-indian-railways-issues-clarification-over-providing-free-train-travel-know-in-telugu-191190" target="_blank" rel="noopener">మహా కుంభమేళా కోసం రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లు .. ఉచిత రైలు ప్రయాణం నిజమా!</a></strong></p> <p><strong>ప&zwnj;డ&zwnj;వ&zwnj;ల య&zwnj;జ&zwnj;మానులు హ&zwnj;ర్షం..</strong></p> <p>ప్రయాగ్&zwnj;రాజ్ జిల్లా సెయిలర్స్ అసోసియేషన్(Prayagraj Sailers Accociation) ప్రెసిడెంట్ పప్పు లాల్ నిషాద్(Pappu Lal Nishad) మాట్లాడుతూ.. రుసుములు పెంచుతూ తీసుకున్న నిర్ణ&zwnj;యాన్ని స్వాగతించారు. ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పటికీ, చాలా సంవత్సరాలుగా పడవ ఛార్జీలను పెంచడం లేదని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తీసుకున్న &nbsp;నిర్ణయం త&zwnj;మ&zwnj;కు ప్రయోజనకరంగా ఉంటుంద&zwnj;న్నారు. బోట్ల ఛార్జీలను పెంచిన తర్వాత, ఇకపై నిర్ణీత ఛార్జీల కంటే &nbsp;ఎక్కువ మొత్తాన్ని భ&zwnj;క్తుల నుంచి వసూలు చేయకుండా చూసుకుంటామని అదనపు ఫెయిర్ ఆఫీసర్(Fair officer) తెలిపారు. దీనికిగాను &nbsp;బోటు ఛార్జీల కొత్త జాబితాను సిద్ధం చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ జాబితాను అన్ని ఘాట్&zwnj;లు, పార్కింగ్ స్థలాల్లో అతికించనున్నట్లు తెలిపారు. అయితే, ప్రధాన స్నాన ఘ&zwnj;ట్టాలు ఉండే ఫెర్రీల్లో మోటారు పడవలపై నిషేధం ఉంటుందని పేర్కొన్నారు.&nbsp;</p> <p><strong>వేల కొద్దీ ప&zwnj;డ&zwnj;వ&zwnj;లు..&nbsp;</strong></p> <p>మ&zwnj;హాకుంభ మేళాను పుర&zwnj;స్క&zwnj;రించుకుని కోట్ల సంఖ్య&zwnj;లో భ&zwnj;క్తులు వ&zwnj;చ్చే అవ&zwnj;కాశం ఉంద&zwnj;ని అంచ&zwnj;నా వేసిన&zwnj;ట్టు డిప్యూటీ క&zwnj;లెక్ట&zwnj;ర్ అభిన&zwnj;వ్ పాఠ&zwnj;క్(Abhinav pathak) తెలిపారు. ప్రయాగ్&zwnj;రాజ్&zwnj;లోని సంగంలో ప్రస్తుతం 1455 బోట్లు నడుస్తున్నాయ&zwnj;ని, మహాకుంభ మేళా సమయానికి, సమీప జిల్లాల నుండి పడవలు వస్తాయ&zwnj;ని, దీంతో ఈ సంఖ్య &nbsp;4,000 దాటవచ్చున&zwnj;ని వివ&zwnj;రించారు. అయితే, బోట్లను పరిశీలించిన తర్వాత వారికి లైసెన్సులు మంజూరు చేస్తామని తెలిపారు. వారికి లైఫ్ జాకెట్లు(Life Jockets) అందజేయనున్నారు. నావికులందరూ రూ. 2 లక్షల బీమా రక్షణ ప్రయోజనం పొందుతారని తెలిపారు.</p> <p><strong>Also Read: <a title="మహా కుంభమేళాకు ఉగ్రవాద ముప్పు..! ఆస్పత్రుల్లో స్పెషల్ వార్డులు.. ఎన్ఐఏ అలెర్ట్" href="https://telugu.abplive.com/news/india/mahakumbha-mela-2025-updates-shadow-of-chemical-attack-on-mahakumbha-mela-191192" target="_blank" rel="noopener">మహా కుంభమేళాకు ఉగ్రవాద ముప్పు..! ఆస్పత్రుల్లో స్పెషల్ వార్డులు.. ఎన్ఐఏ అలెర్ట్</a></strong></p>
Read Entire Article