MahaKumbh 2025: కుంభమేళా సాక్షిగా ఒక్కటైన గ్రీక్​ యువతి, యూపీ యువకుడు

10 months ago 8
ARTICLE AD
<p>ఉత్తర్​ప్రదేశ్​ ప్రయాగ్&zwnj;రాజ్&zwnj;లో మహా కుంభమేళా అట్టహాసంగా జరుగుతోంది. ఇక్కడి గంగ, యుమునా నదుల త్రివేణి సంగమం వద్దకు ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు చేరుకొని స్నానమాచరిస్తున్నారు. అనేక దేశాల నుంచి కూడా జనం తరలివస్తున్నారు. ఇదిలా ఉండగా.. కుంభమేళాలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మేళాకు వచ్చిన ఓ గ్రీక్​ యువతికి, భారత యువకుడి మధ్య ప్రేమ చిగురించింది. అంతేకాదు త్రివేణి సంగమం సాక్షిగా వారు ఒక్కటయ్యారు.</p> <p>ఇరు కుటుంబాల సమక్షంలో పెళ్లి<br />కుంభమేళాను తిలకించి పవిత్ర సంగమంలో స్నానం చేసేందుకు గ్రీక్​ నుంచి పెనెలోప్​ అనే యువతి కొద్దిరోజుల క్రితం కుటుంబసభ్యులతో కలిసి వచ్చింది. ఈ క్రమంలోనే ప్రయాగ్​రాజ్​లో ఆమెకు సిద్ధార్థ్​ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ బంధాన్ని కలకాలం కొనసాగించాలని భావించిన జంట.. తమ ప్రేమ చిగురించిన సంగమ క్షేత్రం వద్దే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించింది. విషయాన్ని పెద్దలకు చెప్పగా ఇరు కుటుంబాల సమక్షంలో వారి వివాహం సంప్రదాయబద్ధంగా జరిగింది.</p> <p>వివాహానికి భారత్​ కంటే గొప్ప వేదిక లేదు<br />పెనెలోప్​ తల్లి, బంధువుల సమక్షంలో జునా అఖారాలోని మహామండలేశ్వర్ స్వామి యతీంద్రానంద గిరి ఆ యువతికి కన్యాదానం చేశారు. తన వివాహాన్ని పెనెలోప్ పార్టీలు, తాగడానికి అవకాశంగా ఉపయోగించుకోలేదని.. అందుకు అతీతంగా దైవిక, ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ జంట తమ వివాహ ఆచారాలను అత్యంత ప్రామాణికమైన పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించుకున్నారని అన్నారు. వివాహం చేసుకోవడానికి భారతదేశం, మహా కుంభమేళా కంటే గొప్ప ప్రదేశాలు లేవని భావించామని సిద్ధార్థ్​ తెలిపాడు.</p> <p>ఇంతకంటే సంతోషం మరొకటి లేదు<br />వరుడు సిద్ధార్థ్​ మాట్లాడుతూ.. &lsquo;ఈ సంగమం ప్రపంచంలోనే ఉత్తమమైన ప్రదేశం అని మాకు తెలుసు. ఇక్కడ అనేక మంది గొప్పవారిని చూసి, కలిసే అవకాశం దక్కింది. స్వామి యతీంద్రానంద గిరి ఆశీస్సులు తీసుకున్నం. ఇంతకంటే సంతోషం మరొకటి లేదు. ఇదో గొప్ప వేదిక&rsquo; అన్నాడు.</p> <p>వివాహం పవిత్ర ఘట్టమని ప్రజలు మర్చిపోతున్నారు<br />సిద్ధార్థ్​ మాట్లాడుతూ వివాహం అనేది పవిత్రమైన ఘట్టమని, ప్రజలు మర్చిపోతున్నారని అన్నాడు. &lsquo;ప్రాచీన సంప్రదాయాన్ని అనుసరించడంలో మొహమాటపడాల్సిన పని లేదు. ప్రపంచంలోని పురాతన నాగరికతలలో మనది ఒకటి. ఇది సనాతన ధర్మం మాత్రమే కాదు, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు దిక్సూచి&rsquo; అని పేర్కొన్నాడు. పెనెలోప్&zwnj; ఎన్నడూ భారతీయ వివాహానికి హాజరుకాలేదని, ఈ అనుభవం ఆమెకి మాటలకు మించిన అద్భుతమని సిద్ధార్థ్​ అన్నాడు.&nbsp;</p> <p>మాటల్లో చెప్పలేనంత అద్భుతం<br />వధువు పెనెలోప్​ ఆనందం వ్యక్తం చేసింది. మాటల్లో చెప్పలేనంత అద్భుతంగా ఉందని పేర్కొంది. దైవిక శక్తిని అనుభవిస్తున్నామని చెప్పింది. తన వివాహాన్ని గ్రీక్​లో కంటే భారత్​లో చేసుకోవడాన్నే తాను ఇష్టపడుతున్నానని తెలిపింది. అంతకుముందు తాను బౌద్ధ మతాన్ని ఆచరించానని.. కానీ సనాతన ధర్మం నుంచి అన్నీ ఉద్భవించాయని గ్రహించానని పేర్కొంది.</p>
Read Entire Article