Kurnool Bus Accident: బైక్ నడిపిన శివశంకర్‌పై ఫ్రెండ్ ఎర్రిస్వామి ఫిర్యాదు, ప్రమాదంపై వీడిన మిస్టరీ

1 month ago 2
ARTICLE AD
<p>Kurnool Bus Fire Accident: కర్నూలు: వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు శుక్రవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదానికి గురైన ప్రమాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ట్రావెల్స్ బస్సు కాలిపోయి ప్రయాణికులు చనిపోయిన &nbsp;ఘటనలో బైకర్&zwnj; శివశంకర్&zwnj;పై అతని ఫ్రెండ్ ఎర్రిస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శివశంకర్ నిర్లక్ష్యంగా బైక్ డ్రైవింగ్ చేయడం వల్లే డివైడర్&zwnj;ను ఢీకొట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఎర్రిస్వామి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.</p> <p>పెట్రోల్ కొట్టించుకున్నాక బంక్ నుంచి బయలుదేరారు. తరువాత శివశంకర్ నిర్లక్ష్యంగా బైక్ నడపడంతో డివైడర్&zwnj;ను ఢీకొట్టగా, ఇద్దరం పల్సర్ మీద నుంచి కింద పడిపోయినట్లు ఫిర్యాదులో ఎర్రిస్వామి తెలిపాడు. డివైడర్ ను తల బలంగా తాకి రోడ్డు మీద పడటంతో శివశంకర్ అక్కడికక్కడే మృతిచెందాడు. బైకుకు మరో పక్కన పడిపోయిన తాను శివశంకర్ మృతదేహాన్ని పక్కకు జరిగేందుకు ప్రయత్నిస్తుండగా వెనకాల వచ్చిన మరో వాహనం ఢీకొట్టడంతో బైక రోడ్డు మధ్యలోకి వెళ్లింది. తరువాత అదే మార్గంలో వెళ్తున్న వి. కావేరి ట్రావెల్స్ బస్సు బైకును ఢీకొట్ట కొంతదూరం లాక్కెళ్లినట్లు ఎర్రిస్వామి తన ఫిర్యాదులో తెలిపాడు.&nbsp;</p> <p><br /><img src="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/10/26/7ea28c8fbdfbc77ca60aa19c67e825571761462751983233_original.png" /></p> <p>&nbsp;</p> <p><br /><img src="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/10/26/fc1c7ca50e36a67d413d2a7cbf608b7f1761462781047233_original.png" /></p>
Read Entire Article