Kumbh Mela 2025: మహా కుంభమేళాలో తొలిరోజు 3.5 కోట్ల మంది పవిత్ర స్నానాలు - అద్భుతమైన వీడియో చూశారా?

10 months ago 7
ARTICLE AD
<p><strong>Kumbh Mela 2025:</strong> ఉత్తరప్రదేశ్&zwnj;లోని ప్రయాగ్&zwnj;రాజ్&zwnj;లో ప్రారంభమైన మహా కుంభమేళా 2025కు భారీగా భక్తులు తరలివస్తున్నారు. తొలి రోజైన సంక్రాంతి నాడు మంగళవారం 3.50 కోట్లకు పైగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు. సాధువులు, అఖారాలు, భక్తులు పవిత్ర సంగమం వద్ద పుణ్య స్నానాలు చేశారు. పుణ్య స్నానాల్లో అధికారికంగా స్నానం చేసే వారి సంఖ్యను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముందుగా ప్రకటించారు. అయితే, సాయంత్రం వరకు సంగం ఒడ్డుకు భక్తుల ప్రవాహం చేరుకోవడం కనిపించింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.&nbsp;</p> <p>పుణ్య స్నానాలు విజయవంతంగా నిర్వహించినందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముందుగా సాధువులు, అఖారాలతో పాటు కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. విశ్వాసం, సమానత్వం, ఐక్యత గొప్ప సంగమంలో పవిత్ర 'మకర సంక్రాంతి' శుభ సందర్భంగా పవిత్ర సంగమంలో విశ్వాసంతో స్నానం చేసిన అన్ని గౌరవనీయులైన సాధువులు, కల్పవాసిలు, భక్తులకు శుభాకాంక్షలు' అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.&nbsp;&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en"><a href="https://twitter.com/hashtag/WATCH?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#WATCH</a> | Prayagraj | Devotees take holy dip at Triveni Sangam - a sacred confluence of rivers Ganga, Yamuna and 'mystical' Saraswati on the third day of the 45-day-long <a href="https://twitter.com/hashtag/MahaKumbh2025?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#MahaKumbh2025</a> <a href="https://t.co/wsxXat8r0s">pic.twitter.com/wsxXat8r0s</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1879352662187225472?ref_src=twsrc%5Etfw">January 15, 2025</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p><strong>కిక్కిరిసిన రైల్వేస్టేషన్లు</strong><br />రైల్వే స్టేషన్, బస్టాండ్&zwnj;కు వెళ్లే రోడ్లపై భారీ జనసమూహం కనిపించింది. ప్రయాగ్&zwnj;రాజ్ రైల్వే స్టేషన్&zwnj;లో అడుగు పెట్టడానికి స్థలం లేదు. జనాన్ని హాలులోనే ఆపేశారు. రైళ్ల ప్రకారం వీరిని ప్లాట్&zwnj;ఫారమ్&zwnj;కి పంపుతున్నారు. ఈ ఉదయం నుంచి ఇప్పటివరకు 55 మహా కుంభ్ ప్రత్యేక రైళ్లను పంపించామని రైల్వే పీఆర్వో అమిత్ సింగ్ తెలిపారు. సోమవారం రాత్రి నుంచి ఇప్పటివరకు నలుగురు గుండెపోటుకు గురయ్యారు. వీరిలో ముగ్గురు స్వరూప్ రాణి నెహ్రూ (SRN)లో, ఒకరు మేళా సెంట్రల్ హాస్పిటల్&zwnj;లో చేరారు. నైట్ షెల్టర్లు, హోటళ్లు నిండిపోయాయి. ప్రజలు రోడ్లపై గుమిగూడారు. రోడ్లపై తమ శిబిరాలను ఏర్పాటు చేసుకున్నారు.</p> <p><strong>Also Read :&nbsp;</strong><a title="Mahakumbha mela: మహా కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా గ్లామరస్ సాధ్వీలు కూడా - హాట్ టాపిక్ గా హర్ష రిచారియా !" href="https://telugu.abplive.com/news/who-is-harsha-richhariya-know-about-the-viral-sadhavi-at-prayagraj-mahakumbh-194103" target="_blank" rel="noopener">Mahakumbha mela: మహా కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా గ్లామరస్ సాధ్వీలు కూడా - హాట్ టాపిక్ గా హర్ష రిచారియా !</a></p> <p><strong>తరలివచ్చిన సాధువులు</strong><br />పౌష పూర్ణిమ మొదటి స్నాన దినమైన సోమవారం, 1.65 కోట్ల మంది సంగమంలో స్నానమాచరించారు. మంగళవారం 3.5 కోట్ల.. 2 రోజుల్లో మొత్తం 5.15 కోట్ల మంది సంగంలో స్నానం చేశారు. సాధువులు హర్ హర్ మహాదేవ్ అని జపిస్తూ ఘాట్ వద్దకు చేరుకున్నారు. ఉదయం 6 గంటలకు పుణ్యస్నానాలు చూడటం ఒక అద్భుతమైన దృశ్యం. కత్తి, త్రిశూలం, డమరుకం చేతుల్లో పట్టుకుని, సాధువులు హర్ హర్ మహాదేవ్ అని జపిస్తూ ఘాట్లకు చేరుకున్నారు. మహా కుంభమేళాలో మొదటిసారిగా షాహి స్నాన్&zwnj;కు బదులుగా అమృత స్నాన్ అనే పదాన్ని ఉపయోగించారు. అఖారారు పేరు మార్చాలని ప్రతిపాదించారు.</p> <p><strong>ఆకాశం నుంచి పూల వర్షం&nbsp;</strong><br />మకర సంక్రాంతి సందర్భంగా మొదటి అమృత స్నానం పండుగ సందర్భంగా ఆకాశం నుంచి పూల వర్షం కురుస్తూనే ఉంది. మహా కుంభమేళాలో పాల్గొనడానికి వచ్చిన ప్రజలు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ ప్రయత్నాన్ని ప్రశంసించారు. యోగి ప్రభుత్వం తరఫున మొదటి అమృత్ స్నానం సందర్భంగా వచ్చిన భక్తులు, సాధువులపై హెలికాప్టర్ నుంచి పూల వర్షం కురిపించారు. మకర సంక్రాంతి సందర్భంగా తీర్థయాత్ర నగరమైన ప్రయాగ్&zwnj;రాజ్&zwnj;లో మొదటి అమృత స్నానం జరిగిందని సీఎం యోగి అన్నారు. &nbsp;</p> <p><strong>డ్రోన్ల కలకలం</strong><br />కుంభమేళాలో ఉత్తరప్రదేశ్ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. వైమానిక నిఘా ద్వారా భద్రతను కల్పిస్తున్నారు. &nbsp;డ్రోన్ల సహాయంతో మహా కుంభమేళాలో భద్రతాపరంగా కొత్త యుగం ప్రారంభమైందని అక్కడి ఉన్నతాధికారులు తెలిపారు. కాగా, కుంభమేళాలోకి 9 అక్రమ డ్రోన్లు ప్రవేశించగా పోలీసులు ధ్వంసం చేశారు.</p>
Read Entire Article