Konaseema Viral News: అమ్మవారి పూలదండ కోసం లక్ష దాటిన ధర! భక్తికి అంతులేదు, కోనసీమలో హైలైట్

2 months ago 3
ARTICLE AD
<p>అమ&zwnj;లాపురం: గోదావ&zwnj;రి జిల్లాలో అన్నీ ప్ర&zwnj;త్యేకత సంత&zwnj;రించుకుంటుంటాయి.. అది ఆధ్యాత్మిక ప&zwnj;రంగానైనా.. లేదా సాంస్కృతి, సంప్రదాయ ప&zwnj;రంగానైనా ఏదైనా స&zwnj;రే గోదావ&zwnj;రి నీర&zwnj;టువంటిది మ&zwnj;రి.. ఆప్యాయ&zwnj;త&zwnj;లు, అనురాగాల&zwnj;కైనా లేదా ఆతిధ్యానికైనా స&zwnj;రే ఆయ్&zwnj;.. మా ప్ర&zwnj;త్యేక అంతేనండి.. ఆయ్&zwnj;.. అనే విధంగా ఉంటుంది.. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ప్ర&zwnj;తిష్ట విష&zwnj;యంలో మ&zwnj;రీ దూసుకుపోతుంటారు.. అది కాస్త ఆధ్మాతిక&zwnj;త విష&zwnj;యంలో అయితే ప్ర&zwnj;తిష్ట కంటే కూడా ఆ ఆధ్మాత్మిక&zwnj;త&zwnj;లో ప&zwnj;ర&zwnj;వ&zwnj;శించేవిధంగా లీన&zwnj;మై పోతుంటారు. అందుకే గ&zwnj;ణ&zwnj;ప&zwnj;తి ల&zwnj;డ్డూ వేలంపాటలో అయినా క&zwnj;న&zwnj;క మ&zwnj;హాల&zwnj;క్ష్మి అవ&zwnj;తారాన్ని కోట్ల రూపాయ&zwnj;ల&zwnj;తో అలంక&zwnj;రించే విష&zwnj;యంలోనైనా.. ఏదైనా స&zwnj;రే త&zwnj;మ ప్ర&zwnj;త్యేక&zwnj;త&zwnj;ను చూపిస్తుంటారు.</p> <p>దేవీ న&zwnj;వ&zwnj;రాత్రుల సంద&zwnj;ర్భంగా అమ&zwnj;లాపురం ప&zwnj;ట్ట&zwnj;ణంలో వేంచేసిన శ్రీమహిషాసుర మర్దిని అమ్మవారి మెడలో పూల దండ వేసేందుకు నిర్వ&zwnj;హించిన&zwnj; వేలంపాటలో ఆన్&zwnj;లైన్&zwnj;లో పాల్గొని మ&zwnj;రీ రూ.ల&zwnj;క్ష కంటే ఎక్కువ చెల్లించి దండ&zwnj;ను ద&zwnj;క్కించుకున్నాడో భ&zwnj;క్తుడు.. ఆ భ&zwnj;క్తుడు కూడా కోన&zwnj;సీమ&zwnj;కు చెందిన వారే విశేషం..</p> <p><strong>అమ్మ&zwnj;వారి మెడ&zwnj;లో పూల&zwnj;దండ వేసేందుకు వేలం పాట&zwnj;..</strong></p> <p>అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఉన్న శ్రీమహిషాసుర మర్దిని అమ్మవారి మెడలో పూల దండ వేసేందుకు గ&zwnj;త కొంత కాలంగా &nbsp;వేలంపాట నిర్వ&zwnj;హిస్తున్నారు కమిటీ సభ్యులు. ఈ ఏడాది కూడా న&zwnj;వ&zwnj;రాత్రి ఉత్స&zwnj;వాల&zwnj;ను పుర&zwnj;స్క&zwnj;రించుకుని అమలాపురం రవణం వీది లో ఉన్న &nbsp;శ్రీ మహిషాసుర మర్దిని అమ్మవారికి మెడలో పూల దండ వేసేందుకు వేలం పాట నిర్వ&zwnj;హించారు. అమ్మవారి మెడలో వేసే మొదటి పూలదండ వేసేందుకు వేలంపాటలో రూ. లక్ష ఐదు వేలు అత్యధికంగా పాడి పూల దండ ను దక్కించుకున్నారు హైదారాబాద్ కు చెందిన ఆకుల లక్ష్మణరావు అనే భక్తుడు. ఈయ&zwnj;నది స్వ&zwnj;స్థ&zwnj;లం అమ&zwnj;లాపురం కాగా &nbsp;హైదారాబాద్ లో స్థిర&zwnj;ప&zwnj;డ్డారు. వేలం పాట గురించి త&zwnj;మ బంధువులు ద్వారా తెలుసుకున్న భక్తుడు ఆకుల లక్ష్మణరావు ఫోన్ లో &nbsp;వీడియో కాల్ ద్వారా వేలంపాటలో పాల్గొని అమ్మవారి మెడలో పూల దండ &nbsp;దక్కించుకున్నారు.</p> <p><strong>దండ&zwnj;ను ద&zwnj;క్కించుకునేందుకు పోటీ ప&zwnj;డ్డ భ&zwnj;క్తులు..</strong></p> <p>ఈసారి అమ్మవారి మెడలో పూలదండ వేసేందుకు అధిక సంఖ్యలో భక్తులు పోటీపడ్డారు. గత కొన్ని సవత్సరాలుగా శ్రీ మహిషాసుర మర్దిని అమ్మవారి మెడలో పూలదండకు వేలంపాట నిర్వహిస్తున్నరు కమిటీ సభ్యులు. 12 సంవత్సరాల క్రితం రూ. 4 వేలు పలికిన పూలదండ ప్రతి ఏటా వేరుగుతూ ఈసారి లక్ష ఐదు వేల రూపాయలకు చేరింది. అమ్మవారి మెడలో పూల దండ వేస్తే కోరిన కోర్కెలు తీరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. దసరా రోజు అమ్మవారి ఊరేగింపు రోజున అమ్మవారి మెడలో మొదటి పూలదండ వేయనున్నారు భక్తుడు లక్ష్మణరావు.<br />సాధారణంగా వినాయక చవితి లో స్వామీ వారి లడ్డూ కు లేదా అమ్మవారి వచ్చిన చీరలకు వేలం పాట పెట్టీ అమ్ముతారు కానీ ఇక్కడ మెడలో పూలదండ వేసేందుకు వేలంపాట పెట్టడం విశేషం.</p> <p><strong>రూ. 4. 44 కోట్ల&zwnj; నూతన కరెన్సీతో &nbsp;అమ్మ&zwnj;వారికి అలంక&zwnj;ర&zwnj;ణ&zwnj;..</strong></p> <p>అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు భక్తులకు శ్రీ మహాలక్ష్మీ దేవిగా ద&zwnj;ర్శ&zwnj;నం ఇచ్చిన నేప&zwnj;థ్యంలో ఆలయ ప్రాంగణాన్ని నూతన కరెన్సీ నోట్లతో అలంక&zwnj;రించారు. రూ. 4కోట్ల 41లక్షల 99 వేల 9 వందల 99 రూపాయల నూతన కరెన్సీ తో అమ్మ&zwnj;వారిని, ఆలయం ముఖ మండపం, అంతరాలయం, ఘర్భాలయం నందు ప్రత్యేక అలంకారం చేశారు. ప్రత్యేక అలంకరణతో కొలువుదీరిన అమ్మ వారిని తండోపతండాలుగా వ&zwnj;చ్చి ద&zwnj;ర్శించుకున్నారు. &nbsp;</p>
Read Entire Article