konaseema News; ఎంపీడీవో కోసం ధర్నా చేస్తున్న ప్రజలు.. ఎందుకో తెలుసా?

10 months ago 8
ARTICLE AD
<p><strong>Konaseema News:</strong> అధికారులు అవినీతి చేస్తున్నారు వేధిస్తున్నారని సమస్యల పరిష్కారంలో ఇబ్బంది పెడుతున్నారని వారికి వ్యతిరేకంగా ధర్నాలు చేసే సీన్&zwnj;లు చూసే ఉంటాం. గ్రీవెన్స్&zwnj; సెల్&zwnj;లో వారిపై ఫిర్యాదులు చేయడం ఇప్పటి వరకు చూశాం. కానీ అంబేడ్కర్&zwnj; కోనసీమ జిల్లాలో పూర్తి భిన్నమైన కేసు ఒకటి వచ్చింది. కలెక్టరేట్&zwnj; వద్ద సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్&zwnj; కార్యక్రమానికి కలెక్టర్&zwnj;కు చిత్రమైన అభ్యర్థన వచ్చింది. తప్పిందిన ఓ అధికారిని తిరిగి నియమించాలని, అటువంటి అధికారి ఉంటే మండలంలో అన్నీ సక్రమంగా జరుగుతున్నాయని వినతి పత్రంలో ప్రజలు పేర్కొన్నారు. అక్కడితే ఆగిపోకుండా ఆ అధికారిని తక్షణం విధుల్లో నియమించాలంటూ నిరసన కూడా తెలిపారు.</p> <p>కృష్ణమోహన్&zwnj; అనే ఎంపీడీవో కోసం ప్రజలు ఆందోళనబాటపట్టారు. ఆయన ఉన్నంత కాలంలో మండలంలో చాలా పనులు సాఫీగా సాగాయని వివరించారు. ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లులో రాష్ట్రంలోనే మొదటి స్థానం.. పింఛన్లు పంపిణీలో జిల్లాలో అగ్రస్థానం. కుల గణనలో జిల్లాలో ప్రథమం.. రాష్ట్రంలో ద్వితీయం.. ఇలా అల్లవరం మండలంలో ఎంపీడీవోగా ఆయన వచ్చాక మారిన పరిస్థితి అంటూ కలెక్టర్&zwnj;కు లెక్కలతో వివరించారు.&nbsp;</p> <p>అలాంటి నికార్సైన అల్లవరం ఎంపీడీవో బి.కృష్ణమోహన్&zwnj;పై గత కొన్ని నెలలుగా ఉద్దేశ్యపూర్వకంగానే ఆరోపణలు చేస్తున్నారని ప్రజలు తెలిపారు. కొందరు కాంట్రాక్టర్లు, పంచాయతీ కార్యదర్శులు, కొందరు సచివాలయ ఉద్యోగులు, కొంతమంది వైసీపీ నాయకులతో కలిసి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేసి చివరకు సెలవుపై వెళ్లేలా చేశారని అల్లవరం మండలానికి చెందిన పలువురు కలెక్టర్&zwnj;కు వివరించారు.&nbsp;</p> <p><strong>పనితీరు విషయంలో కఠినంగా వ్యవహించినందుకేనా..</strong><br />వైసీపీ ప్రభుత్వంలో అల్లవరం ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన కృష్ణమోహన్&zwnj; కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంపించేస్తారని అంతా అనుకున్నారు. కానీ కూటమి నాయకులు కూడా ఈయనే ఉండాలని కోరుకున్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ చేయడమే కాక ప్రభుత్వ విధి విధానాలు, పథకాల అమలు విషయంలో గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు ఉరుకులు పరుగులు పెట్టించారు. ఇది కొందరికి మింగుడు పడని అంశగా మారిందని తెలుస్తోంది.&nbsp;</p> <p>కఠినంగా ఉంటున్న కృష్ణమోహన్&zwnj;పై గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు ఆరోపణలు చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి మండల స్థాయిలో ఉన్న కొందరు వైసీపీ ప్రజాప్రతినిధులు కూడా సహకరిస్తున్నారన్నది కొందరి కూటమి నేతల ఆరోపణ.&nbsp;</p> <p><strong>అడ్డగోలు బిల్లులకు అడ్డుకట్ట వేస్తున్నాకనేనా..</strong><br />అల్లవరం మండలంలో వైసీపీ పాలనలో అనేక అడ్డగోలు వర్కులు చేసిన కాంట్రాక్టర్లు అడ్డగోలు బిల్లులు సృష్టించి సొమ్ము చేసుకోవాలన్న ప్రయత్నాలకు ఈయన అడ్డుతగులుతున్నారు. అందుకే ఎంపీడీవో కృష్ణమోహన్&zwnj;ను ఏదోలా పంపించేయాలని కంకణం కట్టుకున్నట్లు ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. మండలంలో జరుగుతున్న పనుల విషయంలోనూ కఠినంగా వ్యవహరించడం, అడ్డగోలు బిల్లులకు మోకాలడ్డడంతో అసహనంగా ఉన్నవారు ఎంపీడీవోకు వ్యతిరేకంగా బదిలీకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది.&nbsp;మొత్తం మీద ఎంపీడీవో సెలవుపై వెళ్లడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మండలంలోని ప్రజలు, కూటమి నాయకులు సోమవారం జిల్లా కలెక్టరేట్&zwnj;కు పెద్ద సంఖ్యలో వెళ్లి నిరసన తెలిపారు. దీంతో ఇది స్థానికంగా హాట్&zwnj; టాపిక్&zwnj;గా మారింది.</p>
Read Entire Article