konaseema Crime news: కోన‌సీమలో దారుణం.. మడికిలో ఇద్దరు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య

1 month ago 2
ARTICLE AD
<p>Konaseema News | అభం శుభం తెలియ&zwnj;న ఇద్ద&zwnj;రు చిన్నారుల&zwnj;ను చంపి తాను ఆత్మ&zwnj;హ&zwnj;త్య&zwnj;కు పాల్ప&zwnj;డ్డాడో తండ్రి.. అంబేడ్క&zwnj;ర్ కోన&zwnj;సీమ జిల్లాలోన&zwnj;ని ఆల&zwnj;మూరు మండ&zwnj;లం మ&zwnj;డికి చిల&zwnj;క&zwnj;ల&zwnj;పాడులో చోటుచేసుకున్న ఈ సంఘ&zwnj;ట&zwnj;న తీవ్ర విషాదాన్ని నింపింది.</p> <p><strong>పేగు బంధాన్ని చంపేస్తున్నారు..</strong></p> <p>ఇటీవ&zwnj;ల కాలంలో త&zwnj;ల్లితండ్రుల మాన&zwnj;సిక స్థితిని చూస్తుంటే చాలా ఆందోళ&zwnj;న కరంగా మారినప&zwnj;రిస్థితి క&zwnj;నిపిస్తోంది.. కుటుంబ క&zwnj;ల&zwnj;హాలున్నా,, ఆర్దీక స&zwnj;మస్య&zwnj;లున్నా.. మ&zwnj;రే ఇత&zwnj;ర కార&zwnj;ణాలేవైనా ప&zwnj;సిప్రాయంపై క&zwnj;న్న&zwnj;వారు అమానుష దుర్చ&zwnj;ర్య&zwnj;ల&zwnj;ను చూస్తుంటే స&zwnj;మాజం ఎటుపోతుందా.. అన్న సందేహాలు క&zwnj;నిపిస్తున్నాయి... భార్య మాట విన&zwnj;డం లేద&zwnj;ని ఓ భ&zwnj;ర్త క&zwnj;న్న పేగుల&zwnj;ను తుంచేస్తున్నాడు.. భ&zwnj;ర్త&zwnj;తో స&zwnj;రిప&zwnj;డ&zwnj;క న&zwnj;వ&zwnj;మాసాలు మోసి క&zwnj;న్న బిడ్డ&zwnj;ల&zwnj;ను కసాయిగా మారి క&zwnj;డ&zwnj;తేరుస్తోందో త&zwnj;ల్లి... తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి సంఘ&zwnj;ట&zwnj;న&zwnj;లు స&zwnj;మాజంపై దారుణ&zwnj;మైన ప్ర&zwnj;భావాన్ని చూపిస్తున్నాయ&zwnj;డంలో ఎటువంటి సందేహం క&zwnj;నిపించ&zwnj;డంలేదు.. హైద&zwnj;రాబాద్ బాలాన&zwnj;గ&zwnj;ర్&zwnj;లో ఓ త&zwnj;ల్లి చేసిన దుర్మార్గ&zwnj;పు చ&zwnj;ర్య&zwnj;ను మ&zwnj;రువ&zwnj;క ముందే అంబేడ్క&zwnj;ర్ కోన&zwnj;సీమ జిల్లాలో ఓ తండ్రి త&zwnj;న ర&zwnj;క్తం పంచుకు పుట్టిన క&zwnj;న్న&zwnj;బిడ్డ&zwnj;లు ఇద్ద&zwnj;రిని చంపి ఆపై తాను ఆత్మ&zwnj;హ&zwnj;త్య&zwnj;కు పాల్ప&zwnj;డిన సంఘ&zwnj;ట&zwnj;న సంచ&zwnj;ల&zwnj;నం రేపింది.</p> <p><strong>ఇద్ద&zwnj;రు చిన్నారుల&zwnj;ను చంపిన తండ్రి.. ఆపై తాను...</strong></p> <p>అంబేడ్క&zwnj;ర్ కోన&zwnj;సీమ జిల్లా ఆల&zwnj;మూరు మండ&zwnj;లం మ&zwnj;డికి మడికి(చిలకలపాడు)కు చెందిన పావులూరి కామ&zwnj;రాజు అలియాస్ చంటి (36) స్థానికంగా సెలూన్ షాపు నిర్వ&zwnj;హిస్తున్నాడు. అయిదేళ్ల క్రింతం ఇత&zwnj;ని భార్య నాగ&zwnj;దేవి ఆత్మ&zwnj;హ&zwnj;త్య చేసుకుంది. ఈక్ర&zwnj;మంలోనే అప్ప&zwnj;ట్లో న&zwnj;మోదైన కేసు సంబందించి ఇంకా కోర్టులో న&zwnj;డుస్తోంది.. అయితే త&zwnj;మ కుమార్తె ఆత్మ&zwnj;హ&zwnj;త్య చేసుకోవ&zwnj;డానికి భ&zwnj;ర్త కామ&zwnj;రాజే కార&zwnj;ణ&zwnj;మంటూ ఆమె కుటుంబికులు పోలీసు కేసు పెట్ట&zwnj;డంతో అప్ప&zwnj;ట్లో ఇత&zwnj;నిపై కేసు న&zwnj;మోద&zwnj;య్యింది.. ఆ కేసు ప్ర&zwnj;స్తుతం కోర్టులో ఉండ&zwnj;గా ఇటీవ&zwnj;లే భార్య కుటుంబికుల&zwnj;తో రాజీ కూడా చేసుకున్న&zwnj;ట్లు తెలుస్తోంది.. &nbsp;భార్య మ&zwnj;ర&zwnj;ణాంతరం త&zwnj;ల్లి లేని ఇద్ద&zwnj;రు కుమారుల&zwnj;తో కామ&zwnj;రాజు గ్రామంలోనే ఉంటున్నాడు. ఏమ&zwnj;య్యిందో ఏంటో తెలియ&zwnj;దు కానీ ఉద&zwnj;యం అయినా బ&zwnj;య&zwnj;ట&zwnj;కు రాక&zwnj;పోవ&zwnj;డంతో త&zwnj;లుపు తీసి చూసిన కామ&zwnj;రాజు కుటుంబికులు షాక్ అయ్యే సీన్ క&zwnj;నిపించింది.. ఇంట్లో మంచంపై ఇద్ద&zwnj;రు కుమారులు మృతిచెంది క&zwnj;నిపించ&zwnj;గా కామ&zwnj;రాజు ఫ్యాన్&zwnj;కు ఉరివేసుకుని వేళాడుతూ విగ&zwnj;త జీవిగా క&zwnj;నిపించాడు..</p> <p><strong>పిల్లలకు పురుగుల మందు ప&zwnj;ట్టించి చంపిన తండ్రి..</strong></p> <p>ఓ వైపు కోర్టులో కేసు న&zwnj;డుస్తోండ&zwnj;గా రాజీ చేసుకున్న&zwnj;ప్ప&zwnj;టికీ ఆర్దీకంగా భార్య కుటుంబికుల&zwnj;కు ముట్టచెప్పాల&zwnj;ని పెద్ద&zwnj;లు సూచించ&zwnj;డం ఓ వైపు, ఒంట&zwnj;రిగా జీవిస్తున్న కామ&zwnj;రాజు మాన&zwnj;సికంగా కూడా కొన్ని రోజులుగా ముభావంగా క&zwnj;నిపిస్తున్నాడ&zwnj;ని స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉండ&zwnj;గా మంగ&zwnj;ళ&zwnj;వారం రాత్రి &nbsp;పెద్ద&zwnj;కుమారుడు అభిరామ్(11) చిన్న&zwnj;కుమారుడు &nbsp;త్రినాథ్ గౌతమ్( 8 )లకు పురుగులు మందు పట్టించి అనంతరం ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరివేసుకుని చంటి ఆత్మ చేసుకున్నాడు. అయితే ఆత్మహత్య కారణాలు కూడా వీడియో చేసినట్లు తెలుస్తుంది. దీనిపై రావులపాలెం రూరల్ సిఏ సిహెచ్ విద్యాసాగర్, ఆలమూరు ఎస్సై జి నరేష్ లు విచారణ చేయి పెడుతున్నారు.</p>
Read Entire Article