Kho-Kho World Cup: అమ్మాయిలు అదరగొట్టారు - ఖోఖో విశ్వవిజేతగా భారత్, ఫైనల్‌లో నేపాల్ చిత్తు

10 months ago 8
ARTICLE AD
<p><strong>Team India World Champions:</strong> ఖోఖోలో భారత్&zwnj;కు తిరుగులేదని మరోసారి నిరూపితమైంది. సొంతగడ్డపై జరిగిన ఇనాగ్యురల్ ప్రపంచ కప్&zwnj;లో అపజయం లేకుండా టైటిల్ సాధించింది. ఆదివారం ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో భారత్ 78-40 తో నేపాల్&zwnj;పై ఘనవిజయం సాధించింది. ఆట ఆరంభం నుంచి వరుసగా పాయింట్లు సాధించిన టీమిండియా... ప్రత్యర్థికి ఏ దశలోనూ కోలుకునే అవకాశమివ్వలేదు. ముఖ్యంగా కెప్టెన్ ప్రియాంక ఇంగ్లే అత్యుత్తమ ఆటతీరు కనబర్చింది. సారథిగా జట్టును ముందుండి నడిపింది. వైష్ణవీ పవార్, సంజన బి, ప్రియాంక , చైత్ర.. భారత్ తరపున పాయింట్లు సాధించి టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించారు.&nbsp;</p> <p>ఫైనల్ పోరు టర్న్&zwnj; 1లో భారత్&zwnj; దూకుడు ప్రదర్శనను కనబరిచింది. దీంతో 34-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత రెండో టర్న్&zwnj;లో నేపాల్&zwnj; పుంజుకోవడం వల్ల 35-24తో ముగిసింది. ఇక మూడో టర్న్&zwnj;లో భారత్ మళ్లీ దూకుడు ప్రదర్శించడం వల్ల, వరుసగా పాయింట్లు సాధించి ఆధిక్యంలోకి (49) దూసుకెళ్లింది. చివరి టర్న్&zwnj;లో నేపాల్ 16 పాయింట్లు సాధించడం వల్ల, భారత్ 38 పాయింట్లతో అద్భుత విజయాన్ని అందుకుని ఛాంపియన్&zwnj;గా అవతరించింది. 23 దేశాలు పాల్గొన్న ఈ మెగా టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత జట్టు అజేయంగా టోర్నీని ముగించింది.</p> <p>ఖోఖో ప్రపంచకప్&zwnj; టోర్నీకి తొలిసారి భారతదేశం ఆతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 13వ తేదీ నుంచి ప్రారంభమైన టోర్నీలో భారత మహిళలు ఆది నుంచి వరుస విజయాలతో ఫైనల్&zwnj;కు దూసుకొచ్చారు. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్&zwnj; పోరులో నేపాల్&zwnj;తో భారత ఖోఖో క్రీడాకారులు తలపడ్డారు. 78-40 స్కోర్&zwnj;తో నేపాల్&zwnj; మహిళలను భారత నారీమణులు చిత్తుగా ఓడించారు. 38 పాయింట్ల భారీ తేడాతో విజయం సాధించి తొలి ప్రపంచకప్&zwnj;ను భారత ఖోఖో మహిళలు కైవసం చేసుకున్నారు.</p> <p><strong>ఎదురే లేదు..</strong><br />టర్న్&zwnj;-1లో భారత జట్టు అత్యద్భుతంగా ఆడి డిఫెన్స్&zwnj;లో నేపాల్&zwnj; అమ్మాయిల తప్పిదాలను విజయానికి మలుపులుగా భారత మహిళలు చేసుకున్నారు. కాగా ఈ టోర్నీలో భారత ఖోఖో క్రీడాకారులు అత్యుద్భుతంగా ఆడుతూ వచ్చారు. తొలిసారి ఆతిథ్యం ఇస్తున్న భారతదేశం ట్రోఫీని గెలుపొందడం విశేషం. ఆతిథ్యం ఇస్తూనే ప్రత్యర్థులను చిత్తుగా ఓడించి వారిని తిరుగుముఖం పట్టించారు. ఈ టోర్నీ మొదటి మ్యాచ్&zwnj;లో దక్షిణాఫ్రికాతో తలపడిన భారత్&zwnj; భారీ విజయాన్ని నమోదు చేసింది. 176 పాయింట్లు సాధించి అఖండ విజయాన్ని భారత మహిళలు పొందారు.</p> <p><strong>అన్షు కుమారికి అవార్డు..</strong><br />ఈ టోర్నీలో అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్న భారత్&zwnj;కు చెందిన అన్షుకుమారికి బెస్ట్ అటాకర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. నేపాల్&zwnj;కు చెందిన మన్మతి ధానికి బెస్ట్ డిఫెండర్ అవార్డు లభించింది. ఇక మ్యాచ్&zwnj;లో ఉత్తమ ఆటతీరు కనబర్చిన ఇండియాకు చెందిన బి.చైత్రకు బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.&nbsp;</p> <p><strong>Also Read:</strong> <a title="Siraj Vs Harshit: హర్షిత్ కోసం సిరాజ్&zwnj;ను పక్కన పెట్టారు - బోర్డు రాజకీయాలపై సోషల్ మీడియాలో ఫైర్" href="https://telugu.abplive.com/sports/cricket/md-siraj-out-of-favoured-in-icc-champions-trophy-by-team-india-management-194692" target="_blank" rel="noopener">Siraj Vs Harshit: హర్షిత్ కోసం సిరాజ్&zwnj;ను పక్కన పెట్టారు - బోర్డు రాజకీయాలపై సోషల్ మీడియాలో ఫైర్</a></p>
Read Entire Article