KCR At Telangana Bhavan: కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ సమావేశం ప్రారంభం.. కాంగ్రెస్ పాలన, జలాల అంశంపై కీలకంగా చర్చ!

3 months ago 9
ARTICLE AD
<p>తెలంగాణ భవన్&zwnj;లో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగిన పార్టీ శాసనసభాపక్ష (BRSLP), రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. తెలంగాణ భవన్లో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి, అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళి అర్పించారు కేటీఆర్, హరీష్ రావు, పార్టీ నేతలు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్&zwnj;కు చేరుకున్నారు. కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ నేతల సమావేశం ప్రారంభమైంది. ప్రధానంగా రాష్ట్ర జలవనరుల రక్షణ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై ఈ సమావేశంలో కీలకంగా చర్చించనున్నారు.&nbsp;</p> <p><strong>తెలంగాణ భవన్&zwnj;లో కీలక భేటీ</strong><br />బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణను రూపొందించేందుకు కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ సంయుక్త సమావేశం నిర్వహించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, సీనియర్ నాయకులు అందరూ తెలంగాణ భవన్&zwnj;కు చేరుకోవడంతో అక్కడ సందడి నెలకొంది. ఎన్నికల తదనంతర పరిస్థితులు, ప్రజల పక్షాన పోరాడాల్సిన అంశాలపై ఈ భేటీలో బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="te">Live: తెలంగాణ భవన్&zwnj;కు చేరుకున్న <a title="బీఆర్ఎస్ పార్టీ" href="https://telugu.abplive.com/topic/BRS-Party" data-type="interlinkingkeywords">బీఆర్ఎస్ పార్టీ</a> అధినేత కేసీఆర్ <a href="https://t.co/gfxd69pBJQ">https://t.co/gfxd69pBJQ</a></p> &mdash; BRS Party (@BRSparty) <a href="https://twitter.com/BRSparty/status/2002665492780405009?ref_src=twsrc%5Etfw">December 21, 2025</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p><strong>జలకుట్రలపై కేసీఆర్ కదనభేరి</strong><br />తెలంగాణ నీటి వాటాలను దోచుకోవడానికి కుట్రలు జరుగుతున్నాయని కేసీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించనున్నారు. "బడేభాయ్ - చోటేభాయ్" (కేంద్రంలోని బీజేపీ - రాష్ట్రంలోని కాంగ్రెస్) రూపంలో తెలంగాణ జలాలను తరలించుకుపోయేందుకు దొంగలంతా ఒక్కటయ్యారని ఆయన విమర్శించారు. నాడు అరవై ఏళ్ల ఉమ్మడి పాలనలో తెలంగాణ రైతాంగం పడ్డ కష్టాలను గుర్తు చేస్తూ, ఇప్పుడు మళ్ళీ అటువంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు మరో జలపోరాటానికి సిద్ధం కావాలని బీఆర్ఎస్ ఎక్స్ ఖాతా ద్వారా పిలుపునిచ్చారు.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="te">బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి అధ్యక్షతన తెలంగాణ భవన్&zwnj;లో జరగనున్న బీఆర్ఎస్ ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం. <br /><br />ఈ సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ భవన్&zwnj;కు చేరుకున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ <a href="https://twitter.com/KTRBRS?ref_src=twsrc%5Etfw">@KTRBRS</a> మరియు పార్టీ నాయకులు. <a href="https://t.co/n2LKs3hf1G">pic.twitter.com/n2LKs3hf1G</a></p> &mdash; BRS Party (@BRSparty) <a href="https://twitter.com/BRSparty/status/2002655936268435511?ref_src=twsrc%5Etfw">December 21, 2025</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p><strong>రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై విమర్శలు</strong><br />కేంద్రంలోని <a title="బీజేపీ" href="https://telugu.abplive.com/topic/BJP" data-type="interlinkingkeywords">బీజేపీ</a> ప్రభుత్వం చేసే కనుసైగలకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తలొగ్గుతోందని బీఆర్ఎస్ ఆరోపించింది. రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి 'జీ హుజూర్' అంటూ కేంద్రం చెప్పినట్లు వినడం వల్ల తెలంగాణ రైతులకు తీరని అన్యాయం జరుగుతుందని <a title="కేసీఆర్" href="https://telugu.abplive.com/topic/kcr" data-type="interlinkingkeywords">కేసీఆర్</a> అభిప్రాయం. <a title="కాంగ్రెస్" href="https://telugu.abplive.com/topic/Congress" data-type="interlinkingkeywords">కాంగ్రెస్</a> నేతల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా, తెలంగాణ నీటి హక్కుల సాధన కోసం త్వరలోనే ఒక భారీ ఉద్యమాన్ని చేపడతామని పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు.</p>
Read Entire Article