Kavitha Party Telangana Praja Jagruti: తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో కవిత కొత్త పార్టీ! నమోదు ప్రక్రియలో కీలక అడుగు!

3 weeks ago 2
ARTICLE AD
<p><strong>Kavitha Party Telangana Praja Jagruti:&nbsp;</strong>తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మరో మలుపు తిరుగుతోంది. మాజీ ఎమ్మెల్సీ, <a title="కేసీఆర్" href="https://telugu.abplive.com/topic/kcr" data-type="interlinkingkeywords">కేసీఆర్</a> కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణ ప్రజా జాగృతి(TPJ) పేరుతో కొత్త పార్టీ పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పార్టీ రిజిస్ట్రషన్&zwnj;కు సంబంధించిన కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పెండింగ్&zwnj;లో ఉన్న దరఖాస్తుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతూ దిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని విచారించిన కోర్టు ఈసీకి కీలక సూచనలు చేసింది. త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.&nbsp;</p> <p>కల్వకుంట్ల కవిత తన నూతన పార్టీ తెలంగాణ ప్రజా జాగృతి నమోదు కోసం ఈ జనవరి 23న కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 29ఏ ప్రకారం ఈ దరఖాస్తు సమర్పించారు. అయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియలో జాప్యం జరగుతోందని భావించిన ఆమె ధిల్లీ కోర్టును ఆశ్రయించారు.&nbsp;</p> <p>ఫిబ్రవరి 27న జరిగిన విచారణలో ఎన్నికల సంఘం తరఫున న్యాయవాది కోర్టుకు కీలక సమాచారం అందించారు. కవిత సమర్పించిన దరఖాస్తులో పలు సాంకేతిక లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దాలని కోరుతూ ఫిబ్రవరి 23నే ఆమెకు సమాచారం పంపాని ఈసీఐ వెల్లడించింది. దీనిపై నేడు విచారణ జరిగింది. దీంతో తుది తీర్పు వెల్లడించిన న్యాయమూర్తి కవిత పిటిషన్&zwnj;పై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు.&nbsp;</p> <h3>బీఆర్&zwnj;ఎస్&zwnj;తో తెగదెంపులు- కవిత భావోద్వేగ ప్రయాణం&nbsp;</h3> <p>దశాబ్ద కాలం పాటు భారత్&zwnj; రాష్ట్ర సమితిలో కీలక నేతగా ఉన్న కవిత 2025 సెప్టెంబర్&zwnj;లో ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇది తెలంగాణ రాజకీయ వర్గాల్లో విస్మయానికి గురి చేసింది. రాజీనామా అనంతరం నాలుగు నెలల మౌనాన్ని వీడి, జనవరి 5న తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. తెలంగాణ జాగ్ృిని రాజకీయ పార్టీగా మారుస్తున్నట్టు వెల్లడిస్తూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమని ప్రకటించారు. &nbsp;</p> <p>బీఆర్&zwnj;ఎస్&zwnj;ను వీడటానికి గల కారణాలను కవిత అత్యంత భావోద్వేగంతో వివరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అహర్నిశలు శ్రమించినా, రాష్ట్ర వచ్చిన తర్వాత పార్టీలో తనకు సరైన గుర్తింపు లభించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ముఖ్యంగా బతుకమ్మ పండగను విశ్వవ్యాప్తం చేసి, పార్టీ బలోపేతానికి కృషి చేసిన తనై కొన్ని నియంత్రణలు విధించారని పేర్కొన్నారు.&nbsp;</p> <p>కొత్త పార్టీ ప్రకటనకు ముందే కవిత క్షేత్రస్థాయిలో పోరాటాలను ప్రారంభించారు. తెలంగాణ హక్కుల పరిరక్షణే లక్ష్యంగా ఆమె అడుగులు వేశారు. ఇటీవల ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామంలో జరిగిన ఇళ్ల కూల్చివేతలపై ఆమె ప్రభుత్వంపై నేరుగా పోరాటం చేశారు. బాధితులకు అండగా నిలబడి దీక్షలు చేశారు.&nbsp;</p> <p>ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో తనపై వచ్చిన ఆరోపణలన్నీ రాజకీయ ప్రేరితమైనవని, కవిత మొదటి నుంచి వాదిస్తూ వచ్చారు. ఈ కేసులో కోర్టు నుంచి క్లీన్ చిట్ లభించిన తర్వాత మరింత రెట్టింపు ఉత్సాహంతో ప్రజల్లో తిరగడం ప్రారంభించారు. ఇప్పుడు సొంత పార్టీ రిజిస్ట్రేషన్ పూర్తి అయితే కీలక నేతలంతా తన వెంట తిరుగుతారని ఆమె చెబుతున్నారు.&nbsp;</p>
Read Entire Article