Kashmir Earthquake: భారత్, పాక్ సరిహద్దు ప్రాంతాన్ని వణికించిన భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.6

2 months ago 8
ARTICLE AD
<p style="text-align: justify;">కశ్మీర్&zwnj;లో భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున, ఫిబ్రవరి 2 ఉదయం 5.35 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.6 తీవ్రత నమోదైందనట్లు వాతావరణశాఖ పేర్కొంది. ఉత్తర కశ్మీర్&zwnj;లోని బారాముల్లాలో భూకంప కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల లోతులో గుర్తించారు.&nbsp; ఈ భూకంపం భారతదేశంతో పాటు పాకిస్తాన్ లోని కొన్ని ప్రాంతాలను ప్రభావితం చేసింది.&nbsp;</p> <p style="text-align: justify;">కశ్మీర్ లోయలో వచ్చిన ఈ భూకంపం మోస్తరు ప్రభావం చూపే ప్రకంపలు. భారత్, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్&zwnj;పై 4.6గా నమోదైంది. ఉదయం చలిలో నిద్రలో ఉండగానే, భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనతో ఒక్కసారిగా&nbsp; ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.&nbsp;</p> <p style="text-align: justify;"><strong>ఎటువంటి నష్టం జరగలేదు</strong></p> <p style="text-align: justify;">ప్రస్తుతానికి, భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని సమాచారం. <a title="భూకంపం" href="https://www.abplive.com/topic/earthquake" data-type="interlinkingkeywords">భూకంపం</a> లోయ ప్రాంతంలో సంభవించింది. కనుక నష్టం జరగలేదు. అయితే, ప్రజలు తెల్లవారుజామున ఏం జరుగుతుందో అర్థంకాక కాసేపు భయాందోళనకు గురయ్యారు.&nbsp;</p> <p>సమాచారం ప్రకారం, రిక్టర్ స్కేల్&zwnj;పై 4 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రత కలిగిన ప్రకంపనలు తీవ్రమైనవిగా పరిగణిస్తారు. ఈ భూకంపం శ్రీనగర్, పుల్వామా, షోపియాన్, చరాచ్-ఎ-షరీఫ్ పరిసర ప్రాంతాల ప్రజలను ప్రభావితం చేసింది.&nbsp;</p> <p><strong>కశ్మీర్ అధికారులు అప్రమత్తం</strong></p> <p>భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని SDMA సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అధికారులు పరిస్థితిని పరిశీలిస్తున్ారు. భూకంపం నుండి విడుదలైన శక్తి దాదాపు 239 టన్నుల TNT పేలుడుకు సమానంగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే, దీని ప్రభావం పరిమిత ప్రాంతానికి మాత్రమే ఉంది.&nbsp;</p> <p style="text-align: justify;">కొన్ని సెకన్ల పాటు భూకంపం వచ్చింది, కానీ తరువాత అంతా సాధారణ స్థితికి వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, ఎలాంటి పుకార్లను నమ్మవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. పుకార్లు వ్యాప్తి చేసేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే ప్రజలను ముందుగానే తామే అప్రమత్తం చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు సూచించారు.</p>
Read Entire Article