Karisma Kapoor: 30వేల కోట్ల ఆస్తుల వివాదం - కరిష్మాకపూర్ పిల్లలకు కోర్టు గుడ్ న్యూస్ - ఈ వారసత్వ వార్‌లో ఎన్నో ట్విస్టులు

1 month ago 5
ARTICLE AD
<p><strong>Karisma Kapoor &nbsp;ex-husbands property dispute:</strong> కరిష్మా కపూర్ మాజీ భర్త బిజినెస్ టైకూన్ సంజయ్ కపూర్ మరణం తర్వాత ఆయన వేల కోట్ల ఆస్తి చుట్టూ మొదలైన వారసత్వ యుద్ధం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. సంజయ్ కపూర్ , &nbsp;నటి కరిష్మా కపూర్ల పిల్లలైన సమైరా, కియాన్ కపూర్&zwnj;లకు ఢిల్లీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. సుమారు రూ. 30,000 కోట్ల విలువైన ఆస్తులను కాపాడాలని, వాటిని ఇతరులకు బదిలీ చేయకుండా నిలువరించాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.&nbsp;</p> <p><strong>ఫోర్జరీ వీలునామా.. అసలు వివాదం ఇదే!&nbsp;</strong></p> <p>సంజయ్ కపూర్ మూడవ భార్య ప్రియా సచ్&zwnj;దేవ్ కపూర్ సమర్పించిన వీలునామా నకిలీదని, ఆమె దానిని ఫోర్జరీ చేసిందని కరిష్మా కపూర్ పిల్లలు కోర్టును ఆశ్రయించారు. ప్రియా కపూర్ కావాలనే సంజయ్ కపూర్&zwnj;కు చెందిన విలువైన ఆస్తులను వెల్లడించలేదని వారు ఆరోపిస్తున్నారు. కోర్టుకు సమర్పించిన జాబితాలో కోట్లాది రూపాయల విలువైన రోలెక్స్ వాచీలు, పోలో గుర్రాలు, అత్యంత ఖరీదైన కళాఖండాలు, స్థిరాస్తుల వివరాలను ఆమె దాచిపెట్టారని పిల్లల తరపు న్యాయవాదులు వాదించారు.</p> <p><strong>&nbsp;కోర్టు కీలక ఆదేశాలు - ఆస్తుల ఫ్రీజ్&nbsp;</strong></p> <p>ఈ వాదనలను విన్న ఢిల్లీ హైకోర్టు, పిల్లల వైపు ప్రాథమిక వాస్తవం &nbsp;ఉందని గుర్తించింది. వీలునామా ప్రామాణికతపై అనుమానాలు ఉన్నందున, ఆస్తులు వేరొకరి పరం కాకుండా చూడాలని ఆదేశించింది. సంజయ్ కపూర్ బ్యాంక్ ఖాతాలను నిలిపివేయడంతో పాటు, ప్రియా కపూర్ ఆ ఆస్తులను అమ్మకుండా లేదా బదిలీ చేయకుండా మధ్యంతర స్టే విధించింది. ఈ వీలునామా నిజమైనదేనని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రియా కపూర్&zwnj;పైనే ఉందని కోర్టు స్పష్టం చేసింది.</p> <p><strong>&nbsp;కుటుంబ సభ్యుల మధ్య పెరిగిన ఉద్రిక్తతలు&nbsp;</strong></p> <p>కేవలం పిల్లలే కాకుండా, సంజయ్ కపూర్ తల్లి రాణి కపూర్, సోదరి మందిరా కపూర్ కూడా ఈ వివాదంలో తలదూర్చారు. రాణి కపూర్ ఏకంగా సుప్రీంకోర్టు వరకు వెళ్లడంతో, ఈ వ్యవహారం ముదిరి పాకాన పడింది. గత విచారణలో పిల్లలను &nbsp;సంపన్న ఆలివర్ ట్విస్ట్ &nbsp;అని అభివర్ణించడం ఈ వివాదం ఎంతటి తీవ్రస్థాయికి చేరిందో నిదర్శనంగా మారింది. &nbsp;ఆస్తుల పంపకాల విషయంలో కుటుంబ సభ్యుల మధ్య తీవ్రమైన వాగ్వాదాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.&nbsp;</p> <p><strong>కరీనా కపూర్ స్పందన - న్యాయం గెలుస్తుంది!&nbsp;</strong></p> <p>కోర్టు తీర్పు వెలువడిన వెంటనే నటి కరీనా కపూర్ ఖాన్ సోషల్ మీడియాలో స్పందిస్తూ ఒక ఆసక్తికర పోస్ట్ చేశారు. &nbsp;అక్కడ వెలుగు ఉంది.. న్యాయం, నిజం ఎప్పుడూ గెలుస్తాయి.. &nbsp;అంటూ ఆమె పేర్కొన్నారు. తన సోదరి కరిష్మా పిల్లలకు అనుకూలంగా తీర్పు రావడంతో కరీనా ఇలా పరోక్షంగా సంతోషం వ్యక్తం చేశారు. గత ఏడాది లండన్&zwnj;లో పోలో ఆడుతూ సంజయ్ కపూర్ ఆకస్మికంగా మరణించిన తర్వాత ప్రారంభమైన ఈ &nbsp;వారసత్వ పోరు ఇప్పుడు కోర్టు గదుల్లో కీలక దశకు చేరుకుంది. సంపన్న కుటుంబాల్లో ఆస్తుల కోసం జరిగే పోరాటాలు ఎంత దారుణంగా ఉంటాయో ఈ కేసు మరోసారి నిరూపించింది. కరిష్మా కపూర్ పిల్లల భవిష్యత్తు కోసం కోర్టు తీసుకున్న ఈ నిర్ణయం వారి హక్కులను కాపాడటంలో కీలకమైనదిగా భావించవచ్చు. రానున్న రోజుల్లో వీలునామా అసలైనదా కాదా అన్నది తేలాల్సి ఉంది.&nbsp;</p> <p><iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://telugu.abplive.com/web-stories/cinema/raashi-khanna-in-this-green-dress-you-can-t-look-away-246056" width="631" height="381" scrolling="no"></iframe></p>
Read Entire Article