Kanpur News: ఆరేళ్ల చిన్నారిపై 13, 8 ఏళ్ల మైనర్ల గ్యాంగ్‌ రేప్‌- చాక్లెట్ ఆశ చూపి దుశ్చర్య   

2 months ago 3
ARTICLE AD
<p><strong>Kanpur Crime News:</strong> ఉత్తరప్రదేశ్&zwnj;లోని కాన్పూర్&zwnj;లో దారుణమైన ఘటన జరిగింది. ఇందులో బాధితులు, నిందితులు కూడా మైనర్లే కావడం సంచలనంగా మారింది. 13 ఏళ్ల అబ్బాయి మరో 8 ఏళ్ల బాలుడితో కలిసి ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టారు. &nbsp; జాజ్&zwnj;మౌ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘోరమైన ఘటనపై కేసు నమోదు అయ్యింది.&nbsp;</p> <p>పక్క పక్కనే ఉన్న చిన్నారులు ఈ దారుణానికి పాల్పడ్డారు. 13 ఏళ్లు, 8 సంవత్సరాల వయస్సు గల పిల్లలు ఉద్దేపూర్వకంగానే చిన్నారిని తమ ఇంటికి పిలిచారు. ఐదు రూపాయలు ఇస్తాం చాక్లెట్ కొనుక్కోవచ్చని చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లారు. ఇంట్లోకి వెళ్లిన తర్వాత ఆ ఇద్దరు అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె ప్రతిఘటించింది. అయినా సరే బాలిక కాళ్లు చేతులు పట్టేసి బలత్కారం చేశారు. బాధ ఎక్కువ కావడంతో ఏదోలా వారి నుంచి అతి కష్టమ్మీద విడిపించుకొని బయటపడింది.&nbsp;</p> <p>ఏడుస్తూ ఇంటికి వచ్చిన బాలిక జరిగిన &nbsp;విషయాన్ని తల్లితో చెప్పింది. విషయం తెలుసుకున్న తల్లి షాక్ అయ్యింది. ఇంటి పక్కనే ఉంటున్న పిల్లలు ఇలాంటి పని చేస్తారని అనుకోని ఆ తల్లి నిర్ఘాంతపోయింది. విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇది సింపుల్&zwnj;గా తీసుకునే విషయం కాదని పోలీసు స్టేషన్&zwnj;కు వెళ్లారు.</p> <p>అత్యాచారం గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పాట్&zwnj;కు వచ్చారు. కేసు నమోదు చేసుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి బాలికను వైద్య పరీక్షలకు ఆసుపత్రికి తరలించారు. బాలికను పరీక్షించిన వైద్యులు అత్యాచారం జరిగినట్టు నిర్దారించారు. వైద్య పరీక్షల రిపోర్ట్&zwnj; ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు మైనర్ నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. &nbsp;</p>
Read Entire Article