Kanakamedala Ravindra Kumar: అదనపు సొలిసిటర్ జనరల్‌గా కనకమేడల రవీంద్రకుమార్ - ఏపీకి దక్కిన కీలక పదవి

3 months ago 7
ARTICLE AD
<p>Kanakamedala Ravindra Kumar: &nbsp; దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి మరోసారి వెలిగింది. సుప్రీంకోర్టులో భారత ప్రభుత్వం తరపున వాదనలు వినిపించే అదనపు సొలిసిటర్ జనరల్ (ASG) వంటి ప్రతిష్టాత్మక పదవికి ఆంధ్రప్రదేశ్ మాజీ ఎంపీ, సీనియర్ న్యాయవాది &nbsp;కనకమేడల రవీంద్ర కుమార్ ఎంపికయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.<br />&nbsp;&nbsp;<br />కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ (DoPT) విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ప్రధాని నేతృత్వంలోని క్యాబినెట్ నియామకాల కమిటీ ఇద్దరు సీనియర్ న్యాయవాదులను ASG హోదాలో నియమించింది. కనకమేడల రవీంద్ర కుమార్, దవీందర్ పాల్ సింగ్&zwnj;లను ఈ పదవిలో నియమించారు. వీరు బాధ్యతలు చేపట్టిన నాటి నుండి &nbsp;మూడేళ్ల పాటు &nbsp;లేదా తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈ పదవిలో కొనసాగుతారు. దీనికి సంబంధించి అండర్ సెక్రటరీ కుందన్ నాథ్ సంతకంతో కూడిన అధికారిక పత్రాలు ఇప్పటికే జారీ అయ్యాయి.<br />&nbsp;&nbsp;<br />అదనపు సొలిసిటర్ జనరల్ హోదాలో కనకమేడల రవీంద్ర కుమార్ &nbsp;సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరపున కీలక కేసులను వాదించనున్నారు. రాజ్యాంగపరమైన అంశాలు, అంతరాష్ట్ర వివాదాలు , &nbsp;ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలకు న్యాయపరమైన రక్షణ కల్పించడంలో వీరు కీలక పాత్ర పోషిస్తారు. కనకమేడల రవీంద్ర కుమార్ &nbsp;గత నాలుగు దశాబ్దాలుగా న్యాయవాద వృత్తిలో రాణిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సీనియర్ అడ్వకేట్&zwnj;గా ఆయనకు మంచి పేరుంది.</p> <p>2018-2024 మధ్య కాలంలో ఎంపీగా పార్లమెంటులో అనేక ప్రజా సమస్యలపై, చట్టపరమైన అంశాలపై గళం వినిపించారు. &nbsp;క్లిష్టమైన కేసులను డీల్ చేయడంలో ఆయనకు ఉన్న నేర్పును గుర్తించే కేంద్రం ఈ కీలక బాధ్యతను అప్పగించింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన, అందునా ఆంధ్రప్రదేశ్&zwnj;కు చెందిన ఒక సీనియర్ న్యాయవాదికి దేశ రాజధానిలో ఇంతటి ప్రాధాన్యత కలిగిన పదవి దక్కడం పట్ల న్యాయ వర్గాలు, రాజకీయ నాయకులు , అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది వ్యక్తిగతంగా ఆయనకు దక్కిన గౌరవమే కాకుండా, రాష్ట్రానికి కూడా గర్వకారణమని ప్రశంసిస్తున్నారు.<br />&nbsp;&nbsp;</p>
Read Entire Article