Kamareddy crime News: కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే

1 month ago 5
ARTICLE AD
<p data-path-to-node="0">కామారెడ్డి జిల్లా కేంద్రంలో ముగ్గురు చిన్నారుల అదృశ్యం కేసు విషాదకరంగా ముగిసింది. శనివారం ఉదయం నుండి కనిపించకుండా పోయిన ముగ్గురు చిన్నారులు, రాత్రి 9 గంటల సమయంలో కామారెడ్డి పెద్దచెరువులో మృతదేహాలుగా లభ్యం కావడంతో స్థానికంగా విషాదం నెలకొంది. మృతి చెందిన చిన్నారులను కామారెడ్డి పట్టణంలోని ఆర్బీనగర్ కాలనీకి చెందిన షీపత్ (8), ఆయత్ (7), మరియం (5)గా గుర్తించారు. చిన్నారులు కనిపించడం లేదని పట్టణ పోలీస్ స్టేషన్&zwnj;లో కేసు నమోదైన కొద్ది గంటల్లోనే, ఇద్దరి మృతదేహాలు చెరువులో బయటపడటం విషాదాన్ని నింపింది.</p> <p data-path-to-node="1">ఈ ఘటనపై విచారణ చేపట్టిన కామారెడ్డి పోలీసులు కన్న తండ్రే ఆ ముగ్గురు చిన్నారులను చంపాడని గుర్తించారు. పిల్లలు ఎప్పటి నుంచి కనిపించడం లేదని, ఏం జరిగిందని పోలీసులు ప్రశ్నించగా.. ఇస్మాయిల్ పొంతన లేదని సమాధానాలు చెప్పాడు. దాంతో అతడే చిన్నారులను చంపి ఉంటాడని ప్రాథమికంగా భావించారు. ఈ మేరకు అనుమానితుడైన తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నిజాన్ని ఒప్పుకున్నాడు. తానే పిల్లలను చెరువులోకి ఒక్కొక్కరిగా తోసేసి హత్య చేశానని పోలీసుల విచారణలో ఇస్మాయిల్ అంగీకరించాడు.</p> <p data-path-to-node="1"><br /><img src="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/03/08/fd6fc24f63f6790b2034980f8c9f6a401772952998870233_original.jpg" /></p> <p data-path-to-node="1">ఆ పిల్లల తల్లి షబీనా స్థానికుల ఇళ్లల్లో పనులు చేస్తుండగా, తండ్రి ఇస్మాయిల్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, తన భర్తకు అప్పుడప్పుడు మతిమరుపు ఉంటుందని పిల్లల తల్లి పోలీసులకు తెలిపింది. అయితే శనివారం మధ్యాహ్నం పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన షబానాకు పిల్లలు కనిపించకపోవడంతో భర్తను అడిగింది. సరైన సమాధానం రాకపోవడంతో కామారెడ్డి పోలీస్ స్టేషన్లో తల్లి ఫిర్యాదు చేసింది.&nbsp;</p> <p data-path-to-node="1">పోలీసులు 3 టీంలుగా విడిపోయి విచారణ చేపట్టారు. పిల్లల తండ్రి ఇస్మాయిల్&zwnj;ను పలుమార్లు ప్రశ్నించగా పొంతలేని సమాధానాలు చెప్పాడు. ఐస్ క్రీమ్ కొనిచ్చేందుకు బయటకు తీసుకెళ్లానని.. తరువాత తనకు పని ఉందని, పిల్లల్ని ఇంటికి పంపించానని చెప్పాడు. సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించిన పోలీసులు, ఇస్మాయిల్ చెప్పిన మాటలకు, జరిగినదానికి పొంతలన లేకపోవడంతో అదుపులోకి తీసుకుని మళ్లీ ప్రశ్నించారు. తానే పిల్లలను చెరువులోకి తోసేసి హత్య చేశానని.. వారు చనిపోయారా లేదా అని నిర్ధారించుకోవడానికి అరగంటపాటు అక్కడే ఉన్నానని చెప్పడంతో పోలీసులు షాకయ్యారు. మొదట రెండో కుమార్తెను, తరువాత చిన్న కూతుర్ని, చివరగా పెద్ద కూతుర్ని చెరువులోకి తోసేసి హత్య చేసినట్లు తండ్రి ఇస్మాయిల్ అంగీకరించాడు.&nbsp;</p> <p data-path-to-node="2"><strong>హత్యలకు గల కారణం ఏంటీ.. ?</strong></p> <p data-path-to-node="2">ఇది ప్లాన్ ప్రకారం చేసిన హత్యలేనని కామారెడ్డి పోలీసులు గుర్తించారు. తనకు రూ.5 లక్షలకు పైగా అప్పులు ఉన్నాయని, వాటిని తిరిగి చెల్లించడం కుదరదని, పిల్లల్ని సైతం పోషించలేదని వారిని హత్య చేసినట్లు నిందితుడు ఇస్మాయిల్ తెలిపాడు. తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు విచారణలో తెలిపాడు. శనివారం రాత్రి రెండో కూతురు, మూడో కూతురు మృతదేహాలను చెరువులో నుంచి వెలికితీశారు. పెద్ద కూతురు మృతదేహం కోసం గాలిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు ఒకేసారి ప్రాణాలు కోల్పోవడంతో ఆర్బీనగర్ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.</p>
Read Entire Article