Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక.. తుది తీర్పు వాయిదా వేసిన హైకోర్టు

1 week ago 2
ARTICLE AD
<p>హైదరాబాద్: తెలంగాణలో అత్యంత కీలకమైన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో చోటుచేసుకున్న అవకతవకలపై విచారణకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు తీర్పు వాయిదా తీసింది. జస్టిస్ పి.సి.ఘోష్ కమిషన్ నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తీర్పును ఏప్రిల్ 22వ తేదీకి వాయిదా వేసింది. వాస్తవానికి ఈ పిటిషన్లపై ఇప్పటికే సుదీర్ఘంగా వాదనలు విన్న ధర్మాసనం, బుధవారం (ఏప్రిల్ 8) నాడే తుది తీర్పు వెలువరించాల్సి ఉంది. అనివార్య కారణాలతో తీర్పు వెల్లడిని తెలంగాణ హైకోర్టు మరికొన్ని రోజులు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.</p> <p><strong>కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక</strong></p> <p>కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంతో పాటు వాటి నిర్వహణలో జరిగిన లోపాలు, అవకతవకలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2024 మార్చి 14న జీవో నంబర్ 6ను జారీ చేసింది. ఈ జీవో ద్వారా జస్టిస్ పి.సి.ఘోష్ అధ్యక్షతన బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు, జరిగిన అవకతవకలపై విచారణ కమిషన్ ఏర్పాటైంది. కమిషన్ సైతం విచారణ చేపట్టి నివేదిక రూపొందించింది. ఈ రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. అయితే, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి <a title="కేసీఆర్" href="https://telugu.abplive.com/topic/kcr" data-type="interlinkingkeywords">కేసీఆర్</a>, మాజీ మంత్రి టి. హరీశ్&zwnj;రావు, ఐఏఎస్ స్మితా సభర్వాల్, మాజీ ఐఏఎస్ ఎస్.కె.జోషిలు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.</p> <p>ఈ కీలక అంశంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్&zwnj;కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్&zwnj;లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం గతంలోనే సుదీర్ఘ విచారణ జరిపింది. పిటిషనర్ల తరపున వాదనలు, ప్రభుత్వ తరపున వాదనలు పూర్తికావడంతో తుది తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది. ఈ తీర్పు ఈ నెల 22కు వాయిదా పడటంతో, కాళేశ్వరం విచారణ కమిషన్ భవితవ్యంపై ఉత్కంఠ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయంగానూ, సాంకేతికంగానూ ప్రాధాన్యత కలిగిన ఈ వ్యవహారంలో హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందనేది అటు బీఆర్ఎస్&zwnj;తో పాటు ఇటు <a title="కాంగ్రెస్" href="https://telugu.abplive.com/topic/Congress" data-type="interlinkingkeywords">కాంగ్రెస్</a> పార్టీలోనూ ఉత్కంఠ నెలకొంది.&nbsp;</p>
Read Entire Article