Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today September 24th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: అమ్మవారి విగ్రహం దొంగతనం చేసిన వీర్రాజు! లక్ష్మీతో సహస్ర గొడవ!

2 months ago 3
ARTICLE AD
<p><strong>Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode&nbsp;</strong>లక్ష్మీ విహారికి కుంకుమ పెడుతుంది. సహస్ర, పద్మాక్షి అక్కడికి వచ్చి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు. మీరు పడిపోయారు అని కుంకుమ తీసుకొచ్చా అని చెప్తుంది. నువ్వు నాకు బొట్టు పెట్టేది ఏంటే అని లక్ష్మీని సహస్ర తోసేస్తుంది. ఇంతలో నర్స్&zwnj; లక్ష్మీని చూసి ఆ గాయాలు ఏంటి అని అడుగుతుంది. ఫస్ట్&zwnj; ఎయిడ్ చేస్తా అంటే లక్ష్మీ వద్దని అంటుంది. పద్మాక్షి కోపమై వెళ్లి ట్రీట్మెంట్ చేసుకోమని లక్ష్మీని తిడుతుంది.&nbsp;</p> <p>విహారి దగ్గరకు ఫ్యామిలీ అంతా రావడంతో అంతా మిరాకిల్ అమ్మవారి దయ అని డాక్టర్ చెప్తారు. మరోవైపు పద్మాక్షికి తన మనిషి కాల్ చేసి ప్రకాశ్ ఇచ్చిన మ్యారేజ్ సర్టిఫికేట్ గురించి పరిశీలించానని అది ఫేక్ అని తెలిసిందని చెప్తాడు. మరి ఈ ప్రకాశ్ లక్ష్మీ భర్త కాకపోతే లక్ష్మీ భర్త ఎవరు అంతా తెలుసుకుంటానని అనుకుంటుంది. ప్రకాశ్, వీర్రాజుతో కలిసి మందు తాగుతాడు. అంతా నీవల్లే బ్రదరూ నువ్వు ఎక్కడికీ వెళ్లకుండా నాతో ఉండిపో అని అంటాడు వీర్రాజు. ప్రకాశ్ మనసులో నీతో ఉంటే నాకు ఏంటి వస్తుందిరా ఆ లక్ష్మీతో ఉంటే పది కోట్లు వస్తుందని అనుకుంటాడు. ఇంతలో పానకాలు వచ్చి విహారి బతికేశాడని చెప్తాడు.</p> <p>వీర్రాజు, ప్రకాశ్&zwnj;లకు తాగిందంటా దిగిపోతుంది. ఏం చేయాలా అని వీర్రాజు అనుకుంటే ఇక్కడ దసరా పూజ జరగకూడదు అని అందుకు గుడిలో అమ్మవారి విగ్రహం ఉండకూడదు అని ప్రకాశ్ అంటాడు. అమ్మవారి విగ్రహం లేకపోతే చచ్చినా ఇటు ఎవరూ రారు వాళ్లని అవమానించి పంపేస్తా అని వీర్రాజు అనుకుంటాడు. అందరూ హాస్పిటల్&zwnj; ముందే పడిగాపులు కాస్తూ కునుకుపాట్లు పడుతుంటారు. ఇంతలో విహారి నీరు కోసం లేవడానికి ప్రయత్నించి సెలైన్ బాటిల్ తోసేయడంతో లక్ష్మీ సౌండ్ విని వెళ్లి నీరు తాగిస్తుంది.&nbsp;</p> <p>నర్సు వచ్చి చేతికి బ్లడ్ రావడం చూసి ట్రీట్మెంట్ ఇస్తుంది. విహారి బాధతో లక్ష్మీ చేయి పట్టుకుంటాడు. లక్ష్మీ చేయి విడిపించుకొని పక్కన పెడుతుంది. లక్ష్మీ చేయి మళ్లీ విహారి పట్టుకుంటే వదలండి విహారి గారు ఎవరైనా చూస్తే బాగోదు అని లక్ష్మీ అంటుంది. పర్లేదు నేను నా భార్య చేయి పట్టుకున్నా అని విహారి అంటాడు. నెల రోజులు నా గురించి ఏం చేయొద్దని చెప్పాను కదా ఎందుకు ఈ దీక్ష, ఇవన్నీ చేస్తున్నావ్ నా మీద ప్రేమని నువ్వు గుర్తించడం లేదు నువ్వు నాకు సమాధానం చెప్పకపోయినా పర్లేదు.. కనీసం నీ అంతరాత్మకి అయినా సమాధానం చెప్పుకో అని అంటాడు. మీకు ఏమైనా కావాలి అంటే పిలవండి అని లక్ష్మీ అంటే నువ్వు కావాలి అని విహారి అంటాడు.</p> <p>విహారిని ఉదయం ఇంటికి తీసుకొస్తారు. దిష్టి తీసి లోపలికి తీసుకొస్తారు. ఇక లక్ష్మీ అమ్మవారి విగ్రహానికి బొట్టు పెడుతుంటే పద్మాక్షి ఆపి లక్ష్మీని బయటకు తీసుకొచ్చి కొడుతుంది. &nbsp;అసలు నువ్వేవరే విగ్రహం పట్టుకున్నావ్.. విగ్రహం పూజ చేయాల్సింది సహస్ర ఇది ఎందుకు చేస్తుంది అని అంటుంది. నేను కేవలం బొట్టు పెట్టాలని తీశానని అంటుంది లక్ష్మీ. అది అయినా సరే నా కూతురు చేస్తుంది నువ్వు ఎవరే చేయడానికి అని పద్మాక్షి అంటుంది. చారుకేశవ లక్ష్మీతో నువ్వు వెళ్లి విడిగా పూజ చేసుకోమ్మా అని అంటాడు.&nbsp;</p> <p>లక్ష్మీ బాధ పడుతుంటే చారుకేశవ, వసుధ వెళ్తారు. వసుధ లక్ష్మీతో మట్టితో అమ్మవారి విగ్రహం చేసుకొని పూజ చేయు అని అంటుంది. లక్ష్మీ సరే అని అంటుంది. మట్టితో విగ్రహం చేయడం ప్రారంభిస్తుంది. మరోవైపు పంతులు గుడికి తాళం వేసి వెళ్తారు. తర్వాత వీర్రాజు వెళ్లి అమ్మవారి విగ్రహం దొంగతనం చేసేస్తాడు. లక్ష్మీ విగ్రహం తయారు చేసేస్తుంది. అది చూసి చారుకేశవ, వసుధ, పెద్దాయన చాలా బాగుందని మెచ్చుకుంటారు. సహస్ర చాటుగా విని కోపంతో రగిలిపోతుంది. ముగ్గురు వెళ్లిన తర్వాత సహస్ర లక్ష్మీ దగ్గరకు వచ్చి కోపంగా లక్ష్మీ చేయి మెలపెట్టేస్తుంది. ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చావ్ ఆ విగ్రహం పెట్టి పూజ చేయడం ఏంటి... నువ్వు నాకు పోటీగా రావాలి అనే కదా ఇలా పూజ చేస్తున్నావ్ అని రక్తం వచ్చేలా లక్ష్మీ చేయి మెల పెట్టేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. &nbsp;</p>
Read Entire Article