kalavari kodalu kanaka mahalakshmi serial today march 24th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ ప్రెగ్నెంట్ అని విహారి, యమునలకు తెలిసిపోయిందా! స్వామీజీ ఏం చెప్పారు?

3 weeks ago 4
ARTICLE AD
<p>kalavari kodalu kanaka mahalakshmi serial today episode విహారి లక్ష్మీతో భుజంగాన్ని వెతికి వాడిని చంపేస్తా అని అంటాడు. దానికి లక్ష్మీ ఇప్పుడేం వద్దు యమునమ్మ కంగారు పడతారు వెళ్దాం పదండి అని అంటుంది. ఇద్దరూ యమునని తీసుకొని ఇంటికి వస్తారు. హాల్&zwnj;లో ఉన్న పద్మాక్షి, సహస్రలు యమునని చూసి ఏమైంది ఎందుకు అలా ఉన్నారని అడుగుతారు. అత్తయ్యా నీరసంగా ఎందుకు ఉన్నారు అని సహస్ర అడిగితే యమునమ్మకి మళ్లీ ఫిట్స్ వచ్చిందని లక్ష్మీ చెప్తుంది.</p> <p>పద్మాక్షి యమునతో ఈ మధ్య ఆ ఫిట్స్ తరచుగా ఎందుకు వస్తుంది. మంచి స్పెషలిస్ట్&zwnj;కి చూపించావా విహారి అంటుంది. ముందులు వేస్తున్నావా అని పద్మాక్షి అడిగితే క్రమం తప్పకుండా వేస్తున్నా అని యమున అంటుంది. విహారితో మీ అమ్మ కృష్ణ రామ అనుకుంటే ఏ ప్రాబ్లమ్ రాదు.. అన్నీంట్లో నేనే ఉంటాను అన్నీ నాకే తెలియాలి అనుకుంటే తనకి వచ్చిన రోగంతో మనం ఇబ్బంది పడాల్సి వస్తుందని పద్మాక్షి అంటుంది. అంబిక జరిగింది అంతా తలచుకొని కోపంతో ఊగిపోతూ ఉంటుంది. నేను వేసే ప్రతీ ప్లాన్&zwnj;ని ఈ లక్ష్మీ అడ్డుకుంటుంది. ఈ లక్ష్మీ అడ్డు ఎన్ని సార్లు తొలగించుకోవాలని చూసినా ఇలాగే అడ్డు వస్తుంది. అదే ఉంటే ఇక ఎప్పటికీ నా ఆస్తులు దక్కించుకోవాలి.. దాన్ని దెబ్బ కొట్టాలి.. విహారికి దానికి మధ్య ఏదో రహస్యం ఉంది.. అది తెలుసుకున్న తర్వాత ఇద్దరి సంగతి చెప్తా అనుకుంటుంది. ఇంతలో అక్కడున్న ఫైల్స్&zwnj;లో భుజంగం పంపిన కవర్ కూడా ఉంటుంది. అంబిక అది చూసి ఎక్కడ చూసిన లక్ష్మీనే అని చిరాకు పడుతుంది.</p> <p>లక్ష్మీ బయట నుంచి వస్తే పండు చూసి కూరగాయలు తీసుకురాలేదా అంటే నాకు టైం లేదు నువ్వే తెచ్చుకో అని అంటుంది. మందులు, ఫైల్స్ తీసుకొచ్చి కబోర్డ్&zwnj;లో దాస్తుంది. మందులు క్రమం తప్పకుండా వేసుకోవాలని అనుకుంటుంది. ఇంతలో విహారి వచ్చి అక్కడే నిల్చొంచాడు. లక్ష్మీ చాలా కంగారు పడుతుంది. లక్ష్మీ నువ్వు నాకు చెప్పకుండా ఏమైనా దాస్తున్నావా అని విహారి అడుగుతాడు. లేదు అని లక్ష్మీ అంటే నీ ఆరోగ్య విషయం దాస్తున్నావని అంటాడు. ఏం దాయడం లేదు కాస్త ఇబ్బందిగా ఉంది అంతే అని అంటుంది. ఇక పండు దూరం నుంచి చూసి లక్ష్మీ పేరు మీద వచ్చిన పోస్ట్ కవర్ గుర్తు చేసుకొని దాన్ని తీసుకురావడానికి వెళ్తాడు. పండు వెళ్లగానే సహస్ర అక్కడికి వస్తుంది. లక్ష్మీ చేయి పట్టుకొని విహారి మాట్లాడటం చూసి ఛీ కొట్టి వెళ్లిపోతుంది.</p> <p>సహస్ర గదిలోకి వెళ్లి చిరాకు పడుతుంటే పద్మాక్షి సహస్రని తీసుకొని బయటకు వచ్చి నీతో పని అందని అంటుంది. ఇక లక్ష్మీ కూడా బయట తులసి కోటకి పూజ చేస్తుంది. ఇంతలో అక్కడికి స్వామీజీ వస్తారు. స్వామీజీని చూసి యమున భిక్ష పెడుతుంది. లక్ష్మీ కూడా భిక్ష తీసుకొని వస్తుంది. లక్ష్మీని చూసిన స్వామీజీ యమునతో తల్లీ నీకు వారసుడు రాబోతున్నాడు. వాడి ఆఘమనం మీ తలరాతల్నే మార్చేస్తాడు. ఆ వారసుడు ఈ ప్రపంచాన్ని చూడటానికి చాలా ఆటంకాలు ఎదుర్కొంటాడు. చాలా &nbsp;అవరోధాలు చూడబోతున్నాడు.. జాగ్రత్త తల్లీ అని చెప్తారు. లక్ష్మీ చాలా కంగారు పడుతుంది. యమున, పద్మాక్షి, సహస్ర కూడా చాలా కంగారు పడతారు. వంశ వారసుడిని మోయటమే కాదు ఆ బిడ్డని కాపాడుకోవాలని అంటారు. సహస్ర, లక్ష్మీ ఇద్దరూ ఎమోషనల్ అయిపోతారు. పద్మాక్షి సహస్రతో ఆశీర్వాదం తీసుకోమని అంటుంది. సహస్రని ధీర్ఘాయుష్మాన్&zwnj; భవ అని దీవించిన స్వామీజీ సహస్ర వాళ్లు వెళ్లిపోయిన తర్వాత లక్ష్మీని సుపుత్రా ప్రాప్తిరస్తు అని దీవిస్తారు. యమున షాక్ అయిపోతుంది.</p> <p>సహస్ర తల్లితో స్వామీజీ వారసుడు రాబోతున్నాడు.. అటంకాలు ఉన్నాయి అని ఎలా చెప్తాడు అని అంటుంది. వాళ్లు అలాగే చెప్తారు అవి పట్టించుకోకు అని పద్మాక్షి అనేస్తుంది. సహస్ర మాత్రం స్వామీజీ మాటలు ఆలోచిస్తూనే ఉంటుంది. కొంపతీసి స్వామీజీ చెప్పింది లక్ష్మీ, బావకి వారసులు పుడతారు అనా అని అనుకుంటుంది. లక్ష్మీని &nbsp;బావకి దూరంగా ఉంచాలని అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.</p> <p>&nbsp;</p>
Read Entire Article