Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today February 3rd: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: లక్ష్మీ జీవితం కొత్తగా ప్రారంభమవుతుందా! విహారికి ప్రేమ చెప్పేసిందా!

2 months ago 7
ARTICLE AD
<p><strong>Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode&nbsp;</strong>ఆదికేశవులు లక్ష్మీకు సారె పెట్టి పద్ధతిగా మీ ఇంటి కోడలిగా పంపిస్తాను అని యమునతో చెప్తారు. లక్ష్మీని సంతోషంగా చూసుకుంటామని యమున అంటుంది. ఇక యమున ముందు తాను విమానంలో వెళ్లిపోతా అని తర్వాత విహారి, లక్ష్మీలను కారులో వెళ్లమని అంటుంది. ఇక యమున లక్ష్మీని పక్కకి తీసుకెళ్లి ఇంతతో నీ గతం ముగిసిపోయింది అనుకో.. ఈరోజు నుంచి నీ కొత్త జీవితం అని ప్రారంభించు.. విహారి మీద నీ ప్రేమని దాచేసి వాడికి చెప్పలేదు అని నాకు తెలుసు.. ఇప్పుడు వాడిని నువ్వు నీ మనసులో మాట చెప్పమ్మా.. వాడిలో ఎప్పుడూ చూడని సంతోషాన్ని నేను చూస్తాను అని అంటుంది.&nbsp;</p> <p>యమున లక్ష్మీ, విహారిలకు చెప్పి బయల్దేరుతుంది. మనసులో మీరు వచ్చేసరికి మీకు ఆహ్వానం రెడీ చేస్తా అనుకుంటుంది. ఇక అంబిక, సుభాష్&zwnj;లు విహారి, లక్ష్మీలు సరుకు నాశనం చేయకుండా అడ్డుకున్నారని.. లక్ష్మీ వల్లే అంతా జరుగుతుందని లక్ష్మీ, విహారిని వదలకూడదు.. ఇద్దరినీ కలిపి చంపేయాలి అని అనుకుంటారు. ఇద్దరూ ఆదికేశవులు ఇంటి నుంచి మా ఇంటికి చేరేలోపు వాళ్ల అంతు చూడాలని అంబిక సుభాష్తో చెప్పి రౌడీలను ఏర్పాటు చేయమని &nbsp;చెప్తుంది. సుభాష్&zwnj; వెంటనే తన మనుషులకు కాల్ చేసి విషయం చెప్తాడు.&nbsp;</p> <p>ఆదికేశవులు లక్ష్మీ, విహారిలను డ్రాప్ చేయడానికి కారు వరకు వస్తారు. ఇంతలో ఊరి మనుషులు వచ్చి ఏంటి అల్లుడుగారు అప్పుడే వెళ్లిపోతున్నారు.. పండగప్పుడు వచ్చారు.. మేం మా కోపాన్ని చూపించాం.. ఇప్పుడు మా ప్రేమని చూపించాలి అనుకుంటున్నాం.. ఉండమని అడుగుతారు. ఆదికేశవులు, గౌరీలు కూడా అడగటంతో విహారి సరే ఉంటాను అని అంటాడు. ఊరిలో ఒక్కోక్కరు ఒక్కో వంటలు చేస్తామని బయల్దేరుతారు. మా ఊరి వాళ్ల కోపం తుఫానులా ఉంటుంది విహారి గారు ప్రేమ ప్రళయంలా ఉంటుందని లక్ష్మీ అంటుంది. అందరూ నవ్వుకుంటారు. ఇక ఆదికేశవులు అల్లుడుగారితో మీ స్నానానికి ఏర్పాట్లు చేస్తాను అంటాడు. ఇక లక్ష్మీతో భర్తని నలుగురిలో పెట్టి చాలా అవమానించాను క్షమించు అమ్మా అంటే విహారి &nbsp;జరిగింది జరిగిపోయింది..ఇక నుంచి అందరం సంతోషంగా ఉందాం అని అంటాడు.&nbsp;</p> <p>పద్మాక్షి, సహస్ర యమున లక్ష్మీని కోడలిగా ఒప్పుకోవడం గురించి ఆలోచిస్తూ కోపంగా ఉంటారు. ఈ ఇంటికి కోడలు ఆ లక్ష్మీ అయితే ఇక నేను ఏంటి అని సహస్ర అంటుంది. ఇంతలో యమున వస్తుంది. మనకి నిజం తెలుసు అని కూడా బయట పడకూడదు.. ఉద్దేశం మాత్రం బయట పడేలా చెప్పాలి అంటుంది. యమున రాగానే పద్మాక్షి కోపంగా యమునని లాగిపెట్టి కొడుతుంది. యమున షాక్ అయిపోతుంది. ఏమనుకుంటున్నారు మీరంతా.. ఏం చేస్తున్నారు.. అని అడుగుతుంది. ఏమైంది వదినా అని యమున అడుగుతుంది. ఏంటి ఏమయ్యేది.. నా కూతురు ఏ పరిస్థితిలో ఉంది తెలుసు కదా మరి మీరు ఎవరికి వారు తనని వదిలేసి వెళ్లిపోయారు.. ఎక్కడికి వెళ్లారు.. దీని కడుపులో ఉన్నది ఎవరో తెలుసా ఈ వంశానికి వారసుడు.. ఈ వంశానికి మాత్రమే వారసుడు కాదు.. మా అన్నయ్య దాని కడుపులో ఉన్నాడు.. దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని లేదా.. నీకు నీ కొడుకుకి ఈ మధ్య ఎక్కువైంది.. తల్లీ కొడుకులు వచ్చి నా కాలు మీద పడి బతిమాలితే దానికి విహారికి ఇచ్చి పెళ్లి చేశా.. ఈ ఇంటికి కోడలు నా కూతురు.. వారసుడిని ఇచ్చేది అదే.. ఇంకోసారి దాన్ని నిర్లక్ష్యం చేసినా దాన్ని వదిలేసి వెళ్లినా ఊరుకునేది లేదు. నీ కొడుకుకి కూడా చెప్పు &nbsp;అని పద్మాక్షి ఇన్&zwnj;డైరెక్ట్&zwnj;గా వార్నింగ్ ఇస్తుంది.&nbsp;</p> <p>యమున ఏడుస్తూ భర్త ఫొటో దగ్గరకు వెళ్లి ఏది ఏమైనా సరే లక్ష్మీనే ఈ ఇంటి కోడలు అని చెప్పేస్తా లక్ష్మీనే ఇంటి కోడలిగా ఆహ్వానిస్తా అని అనుకుంటుంది. మరోవైపు ఆదికేశవులు అల్లుడి తల మర్దన చేసి నలుగు రాస్తాడు. లక్ష్మీ విహారిని ఏవండి అని పిలుస్తుంది. విహారి బిత్తరపోతాడు. కనకం నువ్వేనా ఇలా పిలిచింది అని అడుగుతాడు. భార్య భర్తని అలాగే కదా పిలుస్తుంది అని అంటుంది. విహారికి దగ్గరుండి తల స్నానం చేయిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.&nbsp;</p>
Read Entire Article