Kakinada Fireworks Explosion: వేట్లపాలెం ఘటనలో నలుగురు అధికారులపై వేటు! మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు, పక్కా ఇళ్లు హామీ

1 month ago 6
ARTICLE AD
<p>సామర్లకోట: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన బాణసంచా ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో బాధితులకు ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. అదే సమయంలో ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు చేపట్టారు. ఈ మేరకు నలుగురు అధికారులు ఆర్డీఓ, డీఎస్పీ, డిస్టిక్ లేబర్ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్ ను సస్పెండ్ తక్షణమే సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా కఠినమైన నిబంధనలు అమలు చేయాలని యంత్రాంగాన్ని హెచ్చరించారు.</p> <p><strong>మృతుల కుటుంబాలకు 20 లక్షల పరిహారం</strong><br />బాధిత కుటుంబాలను ఆదుకునే విషయంలో కూటమి ప్రభుత్వం మానవతా దృక్పథాన్ని చాటుకుంది. బాణసంచా పేలుడు ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి రూ. 20 లక్షల భారీ ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఇది కేంద్ర ప్రభుత్వం అందించే రూ. 2 లక్షల ఎక్స్&zwnj;గ్రేషియాకు అదనమని ఆయన స్పష్టం చేశారు. అంటే బాధితులకు మొత్తం రూ. 22 లక్షల ఆర్థిక సాయం అందనుంది. కేవలం నగదు సాయమే కాకుండా, ఈ ప్రమాదంలో సర్వం కోల్పోయిన వారికి, ఇళ్లు లేని పేద కుటుంబాలకు ప్రభుత్వం తరపున పక్కా గృహాలను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.</p> <p><br /><img src="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/02/28/cb8cc3475b516b8490c1094b878dedd01772294674533233_original.jpg" /></p> <p>గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సదుపాయాలు అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. బాధితులు కోలుకునే వరకు ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని, అవసరమైతే మెరుగైన చికిత్స కోసం ఇతర ప్రాంతాలకు తరలించాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా బాణసంచా తయారీ కేంద్రాలు నడిపేవారిపై ఉక్కుపాదం మోపాలని, ఇకపై రాష్ట్రంలో ఎక్కడా అనుమతులు లేని పేలుడు పదార్థాల తయారీ కేంద్రాలు ఉండకూడదని ఆయన స్పష్టమైన సంకేతాలు పంపారు.</p> <p><br /><img src="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/02/28/a6f92ebecddf60432cb81d354decb77b1772294700388233_original.jpg" /></p> <p>&nbsp;</p>
Read Entire Article