Jubilee Hills byelection: అక్టోబర్ 4 లేదా 5న జూబ్లిహిల్స్ ఉపఎన్నిక షెడ్యూల్ - తుది ఓటర్ల జాబితా విడుదల

2 months ago 3
ARTICLE AD
<p><strong>Jubilee Hills byelection schedule on October 4th or 5th: &nbsp;</strong> జూబ్లిహిల్స్ అసెంబ్లీ &nbsp;ఉపఎన్నికకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాను మంగళవారం ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ జా బితాలో 3,98,982 మంది ఓటర్లు ఉన్నారు, ఇందులో 2,07,367 మంది పురుషులు, 1,91,590 మంది మహిళలు , 25 ట్రాన్స్&zwnj;జెండర్లు ఉన్నారు.&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;&nbsp;</p> <p>ఎన్నికల కమిషన్ ప్రకారం, &nbsp;తుది ఓటర్ల జాబితాలో గత ఎన్నికల కన్నా 1.61 శాతం ఎక్కువ మంది ఓటర్లు నమోదయ్యాయి. &nbsp; ఈ జాబితాలో ఉన్న 3,98,982 ఓటర్లు &nbsp;మొత్తం 407 పోలింగ్ స్టేషన్లలో ఓటు హక్కు వినియోగిచుకుంటారు. &nbsp;ప్రతి పోలింగ్ స్టేషన్&zwnj;లో సగటుగా 980 ఓటర్లు ఉన్నారు. ఓటర్లు తమ పేర్లు తుది ఓటర్ల జాబితాలో ఉన్నాయో లేదో సరిచూసుకోవడానికి ఎన్నికల కమిషన్ వెబ్&zwnj;సైట్ లేదా వోటర్ హెల్&zwnj;ప్&zwnj;లైన్ యాప్&zwnj;లో డౌన్&zwnj;లోడ్ చేసుకోవచ్చు. జాబితాలో పేర్లను చేర్చడానికి లేదా తీసివేయడానికి ఫిర్యాదులు దాఖలు చేయడానికి, ఫారం-6 (పేరు చేర్చడానికి), &nbsp;ఫారం-8 (పేరు, చిరునామా మొదలైనవి సరిచేయడానికి) ఉపయోగించవచ్చని ఈసీ తెలిపింది.&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;&nbsp;</p> <p>కేంద్ర ఎన్నికల సంఘం&nbsp; అక్టోబర్ నాలుగు, ఐదు తేదీల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయనుంది. బీహార్ కు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నారు. అదే సమయంలో జూబ్లిహిల్స్ ఉపఎన్నిక షెడ్యూల్ కూడా విడుదల చేస్తారు. బీహార్ లోనూ&nbsp; మంగళవారమే పూర్తి స్థాయి ఓటర్ల జాబితాను విడుదల చేశారు.&nbsp; స్పెషల్&nbsp; ఇంటెన్సివ్ రివిజన్ చేసి ఓటర్ల జాబితాను పూర్తిగా సంస్కరించారు. దాదాపుగా అరవై లక్షలకుపైగా ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. మరణించిన వారు, శాశ్వతంగా వలసపోయిన వారు&nbsp; అలాగే.. రెండు ఓట్లు ఉన్న వారు ఇలా అందర్నీ తొలగించారు&nbsp; ఈ&nbsp; ప్రయత్నంపై వివాదం ఏర్పడినప్పటికీ అంతా పారదర్శకంగా చేస్తున్నామని ఈసీ ప్రకటించింది. అందుకే బీహార్ ఓటర్ల జాబితాపై ఏమైనా అభ్యంతరాలు వస్తాయేమోనని ఈసీ నాలుగు రోజుల సమయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.&nbsp;</p> <p>జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.&nbsp; భారత రాష్ట్ర సమితి సిట్టింగ్ సీటు కావడంతో ఎలాగైనా సీటును నెలబెట్టుకోవాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్&nbsp; సతీమణి సునీతపేరును ఖరారు చేశారు.&nbsp; <a title="బీఆర్ఎస్ పార్టీ" href="https://telugu.abplive.com/topic/BRS-Party" data-type="interlinkingkeywords">బీఆర్ఎస్ పార్టీ</a> నేతలంతా విజయం కకోసం రంగంలోకి దిగారు. ఇక <a title="కాంగ్రెస్" href="https://telugu.abplive.com/topic/Congress" data-type="interlinkingkeywords">కాంగ్రెస్</a> పార్టీ అధికారంలో ఉన్నందున తమ పాలనపై వ్యతిరేకత రాలేదని నిరూపించుకునేందుకు గెలిచి తీరాల్సిన పరిస్థితిలో పడింది. ఇప్పటికే కంటోన్మెంట్ ఉపఎన్నికల్లో గెలిచారు. అందుకే జూబ్లిహిల్స్ లోనూ సానుభూతి పని చేయదని.. తమ పార్టీ పాలనను మెచ్చి తమకే ఓట్లు వేస్తారని అనుకుంటున్నారు.&nbsp;</p> <p>ఈ నియోజకవర్గంలో మజ్లిస్ కు మంచి బలం ఉంది. ఆ పార్టీ పోటీ చేస్తే ఓ రకంగా పోరు ఉటుంది. పోటీ చేయకపోతే..&nbsp; ఎవరికి మద్దతు ఇస్తుందన్నదానిపై ఫలితం ఆధారపడి ఉంటుందని అంచనా వేస్తున్నారు.&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p> <p><iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://telugu.abplive.com/web-stories/visakhapatnam/international-brand-araku-coffee-outlets-abroad-too-221978" width="631" height="381" scrolling="no"></iframe></p>
Read Entire Article