JP Nadda in visakhapatnam: అభివృద్ధికి చిరునామాగా ఏపీ- సెమీకండక్టర్స్ ప్రాజెక్టు, 15 పోర్టులు నిర్మాణం: జేపీ నడ్డా

2 months ago 3
ARTICLE AD
<p>విశాఖపట్నం: అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ చిరునామాగా మారిందని, సాగరమాల కింద 15 పోర్టులు నిర్మిస్తున్నామని కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. విశాఖపట్నం తూర్పు తీరానికి తలమానికం వంటి ఆభరణం అన్నారు. రైల్వే న్యూ కాలనీలో జరిగిన సారథ్యం భారీ బహిరంగ సభలో <a title="బీజేపీ" href="https://telugu.abplive.com/topic/BJP" data-type="interlinkingkeywords">బీజేపీ</a> జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొని ప్రసంగించారు.&zwnj; గత ఎన్నికలకు ముందు తిరుపతి పర్యటనకు వచ్చినపుడు చెప్పాను. వైసీపీ సర్కార్ నిష్క్రియా పర్వానికి పేరుపొందింది. దాన్ని ఓడించి మా కూటమిని అధికారానికి తెచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కృతజ్ఞతలు. ఏపీని మళ్లీ అభివృద్ధి పట్టాలు ఎక్కించాం&rsquo; అన్నారు.</p> <p><strong>ఎన్డీయే పాలనలో సాధించిన ఘనతలివే</strong></p> <p>కనకమహాలక్ష్మి అమ్మవారికి, వరాహ నరసింహ స్వామి వారికి నమస్కరించి జేపీ నడ్డా ఉపన్యాసం మొదలు పెట్టారు. &lsquo;2014లో <a title="నరేంద్ర మోదీ" href="https://telugu.abplive.com/topic/narendra-modi" data-type="interlinkingkeywords">నరేంద్ర మోదీ</a> భారత ప్రధాని అయినపుడు దేశ ఆర్ధిక వ్యవస్థ అస్థవ్యస్తంగా ఉంది. మనదేశ ఆర్ధిక వ్యవస్థ ప్రపంచంలొ 11వ స్థానంలో ఉండేది. ఇపుడు నాల్గో స్థానానికి చేరింది. కొన్నేళ్లలో మూడో స్థానానికి చేరుతున్నాము. ప్రస్తుతం అన్ని రంగాల్లో దూసుకుపోతున్నాం. రక్షణ రంగ ఎగుమతుల్లో సైతం ఏడు రెట్ల ప్రగతికి చేరాం. సెల్ ఫోన్ల తయారీలో 92 లక్షలు సంఖ్య దాటాం. అమృత్ వంటి పథకాలతో లక్షల వ్యయంతో సమగ్రాభివృద్ధి జరుగుతోంది. కాకినాడ విశాఖ ఫిషింగ్ హార్బర్ల పునర్నిర్మాణం జరుగుతోంది. విద్యారంగంలో ఎన్నో సంస్థలు ఏపీకి వచ్చాయి. తొమ్మిది వేల&zwnj; కిలోమీటర్ల జాతీయ రహదార్ల నిర్మాణం సాగుతోందని&rsquo; నడ్డా పేర్కొన్నారు.</p> <p><br />రైల్వేల్లో అమృత్ భారత్ స్టేషన్లు, పట్టాలమీద వందే భారత్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఆయుష్మాన్ భారత్, స్పెషాలిటీ ఆస్లత్రులు, కొత్తగా 17 వైద్య కళాశాలలు వచ్చాయి. దేశంలో విమానాశ్రయాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. భోగాపురం విమానాశ్రయం 625 కోట్ల రూపాయలతో నిర్మాణం అవుతోంది. విశాఖ రైల్వే జోన్ సిద్ధమైంది. పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు వస్తోంది. కోటీ ఇరవైలక్షల కోట్ల పెట్టుబడితో సెమీకండక్టర్స్ ప్రాజెక్టు వచ్చిందన్నారు.&nbsp;</p> <p>కార్యకర్తలు గ్రామగ్రామానికీ వెళ్లి వైసీపీ చీకటి పాలనను, ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వ అభివృద్ధి వెలుగులనూ వివరించాలని పిలుపునిచ్చారు. మనం దేశ ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని.. ఆంధ్రప్రజల హృదయాల్లో స్థానం సంపాదించాలన్నారు. ఆంధ్రప్రజల మనసులొ ప్రధాని మోదీ ఉన్నారు, మోదీ మదిలో ఆంధ్ర ప్రజలున్నారు. మన రాజకీయం అభ్యుదయం కోసం మాత్రమే. కోట్లాది కార్యకర్తల కృషి వల్లనే దేశాన్ని బిజెపి అభివృద్ధి చేయగలుగుతోందని జేపీ నడ్డా పేర్కొన్నారు.</p>
Read Entire Article