<p><strong>Jagadhatri Serial Today Episode </strong>కౌషికి బాబుని శ్రీవల్లి కాపాడుతుంది. కానీ శ్రీవల్లి కిడ్నాప్ చేసిందని అందరూ అనుమానిస్తారు. కౌషికి కూడా శ్రీవల్లిని కొట్టి తన బాబుని కిడ్నాప్ చేస్తావా అని తిడుతుంది. ఇంతలో జగద్ధాత్రి, కేథార్‌లు శ్రీవల్లి ఏం తప్పు చేయలేదని కౌషికికి చెప్తారు. ఎస్‌ఐ దగ్గరకు వెళ్లి వీడియో చూపించి శ్రీవల్లి ఏ తప్పు చేయలేదని నిరూపిస్తారు.</p>
<p>కౌషికి శ్రీవల్లికి సారీ చెప్తుంది. జగద్ధాత్రి కూడా సారి చెప్తుంది. శ్రీవల్లి కోపంగా మీరు ఎందుకు అండీ సారీ చెప్తారు. అడగని సాయానికి వచ్చే విలువ ఏంటో నాకు బాగా తెలిసోచ్చేలా చేశారు. ఎదుటి మనిషికి సాయం చేసే పరిస్థితిలో నేను లేను అని గుర్తు చేసినందుకు థ్యాంక్స్ అంటుంది. మీరు చేసిన సాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను అని శ్రీవల్లి చాలా హర్ట్ అయి వెళ్లిపోతుంది. అందరూ వెళ్లిపోయిన తర్వాత జగద్ధాత్రి, కేథార్లు మొత్తం ఆదిలక్ష్మీ పిన్ని చేశారని అంటారు. కౌషికి షాక్ అయిపోతుంది. ఏం చేస్తే తన అనుమానం తగ్గించుకుంటారో అర్థం కావడం లేదు అని అనుకుంటుంది.</p>
<p>శ్రీవల్లి తాను ఉండే అనాథాశ్రమానికి వెళ్తే ఆశ్రమం వార్డెన్ శ్రీవల్లి బట్టలు బయటకు విసిరేసి నీలాంటి క్రిమినల్ ఇక్కడ ఉండకూడదు పూజకి వెళ్తాను అని చెప్పి పిల్లాడిని కిడ్నాప్ చేస్తావా అని శ్రీవల్లిని గెంటేస్తారు. శ్రీవల్లి ఏడుస్తూ చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నారు కదా.. నేను ఎలాంటి దాన్నోమీకు తెలీదా బాబాయ్ ఇలా నన్ను గెంటేస్తే మళ్లీ అనాథని అయిపోతా అని ఏడుస్తుంది. దాంతో ఆయన నువ్వు పుట్టుకతో అనాథవే మెడ పట్టుకొని బయటకు గెంటేసే పరిస్థితి తెచ్చుకోకు అని గెంటేస్తారు. ఆశ్రమంలోని పిల్లలు బతిమాలుతారు. శ్రీవల్లి అందరికీ చెప్పి ఏడుస్తూ వెళ్లిపోవడానికి రెడీ అయి బట్టల సంచి పట్టుకుంటుది. ఇక వార్డెన్ శ్రీవల్లితో ఇదిగో మీ అమ్మ ఫొటో అని విసిరేస్తుంది. </p>
<p>శ్రీవల్లి తల్లి కూడా సుధాకర్ మొదటి భార్య సుహాసినినే. అంటే శ్రీవల్లి కేథార్ సొంత చెల్లి.. శ్రీవల్లి తల్లి ఫొటో పట్టుకొని బతుకునిచ్చి చంపేశావ్ కదమ్మా అమ్మా.. నాన్న ఎవరో తెలీదు.. ఇక్కడ నేను అనాథగా బతకాల్సి వచ్చింది. ఇప్పుడు ఎలా బతకాలో తెలీదు. నీ ప్రేమ అండగా ఉంటుంది అనే నమ్మకంతో వెళ్తున్నా అని బయటకు వెళ్లిపోతుంది. </p>
<p>సుధాకర్ చిన్ననాటి ఫ్రెండ్ సుందరం అతని భార్య ఇంటికి వస్తాడు. సుధాకర్ ఇంట్లో అందరినీ వాళ్లకి పరిచయం చేస్తారు. సుందరం కేథార్‌ని చూపించి వీళ్లు ఎవర్నా అని అడిగితే సుధాకర్ ఫ్లోలో వాడు కేథార్ నాపెద్ద కొడుకు అని చెప్తాడు. తర్వాత తేరుకొని నా పెద్ద కొడుకు లాంటివాడు అని చెప్తాడు. ఇక సైంటిస్ట్ సుందరం నీటితో నడిచే వాహనం తాయారు చేశారని ప్రాజెక్ట్ డేటా అంతా సబ్మిట్ చేస్తున్నాం అని అందరికీ రమ్మని చెప్తారు. మీడియా కవరేజ్‌కి కౌషికి పర్మిషన్ అడుగుతుంది. ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకున్న మీనన్ యువరాజ్‌కి కాల్ చేసి ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించిన డేటా కొట్టేస్తే మిలియనీర్స్ అవుతామని అనుకుంటారు. యువరాజ్ సరే అంటాడు. యువరాజ్ మాట్లాడతుంటే నిషిక వచ్చి ఎవరితో మాట్లాడుతున్నావ్ అని అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. <br /> </p>