Israel-Iran War: ఒకే దాడిలో 48 మంది ఇరాన్ నేతలు మృతి, కొత్త నాయకత్వంతో చర్చలకు రెడీ: డొనాల్డ్ ట్రంప్

1 month ago 5
ARTICLE AD
<p data-path-to-node="1">వాషింగ్టన్: ఇరాన్&zwnj;కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్-అమెరికా జరిపిన దాడుల్లో 48 మంది నాయకులు హతమయ్యారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ఆపరేషన్ విజయవంతమైందని, తాము ఊహించిన దానికంటే వేగంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఇదే సమయంలో ఇరాన్ కొత్త నాయకులు అమెరికాతో చర్చలకు సిద్ధంగా ఉన్నారని కూడా ట్రంప్ తెలిపారు.</p> <p data-path-to-node="2"><strong data-path-to-node="2" data-index-in-node="0">ఫాక్స్ న్యూస్&zwnj;తో ట్రంప్ ఏమన్నారు.. </strong></p> <p data-path-to-node="2">&lsquo;మాకు లభిస్తున్న విజయాన్ని ఎవరూ నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే ఇరాన్&zwnj;పై చేపట్టిన ఆపరేషన్&zwnj;లో ఒక్క దెబ్బతో 48 మంది నాయకులు హతమయ్యారు. ఇరాన్&zwnj;లో ఈ ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతోంది. సాధ్యమైనంత త్వరగా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామని&rsquo; ట్రంప్ అన్నారు.</p> <p data-path-to-node="3"><strong data-path-to-node="3" data-index-in-node="0">ఇరాన్&zwnj;లో అమెరికా నిరంతర దాడులు&nbsp;</strong></p> <p data-path-to-node="3">CNBCతో జరిపిన సంభాషణలో ట్రంప్ మాట్లాడుతూ &lsquo;ఇరాన్&zwnj;లో అమెరికా సైనిక చర్య అనుకున్న దాని కంటే వేగంగా ముందుకు సాగుతోంది. ఇంత త్వరగా పని జరుగుతుందని మేం ఊహిచలేదు అన్నారు.&nbsp;</p> <p data-path-to-node="4"><strong data-path-to-node="4" data-index-in-node="0">చర్చలకు సిద్ధమన్న కొత్త నాయకత్వం: డొనాల్డ్ ట్రంప్</strong></p> <p data-path-to-node="4">అయతుల్లా అలీ ఖమేనీ మృతితో ఏర్పాటైన ఇరాన్ కొత్త నాయకత్వం వాషింగ్టన్&zwnj;తో చర్చలు జరపాలని కోరుకుందని, తాను చర్చలకు అంగీకరించానని అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. వార్తా సంస్థ రాయిటర్స్ ప్రకారం, 'ది అట్లాంటిక్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ &lsquo;ఇరాన్ కొత్త లీడర్ షిప్ మాతో చర్చలు జరపాలని కోరుకుంటోంది. కనుక నేను వారితో చర్చలకు అంగీకరించాను. వారు (ఇరాన్ పాలకులు) దీనిని ముందే చేసి ఉండాల్సింది. వారు మాతో ఒప్పందం చేసుకోవచ్చు, కానీ వారు తెలివితేటలు ప్రదర్శించి అందుకు భారీ మూల్యం చెల్లించుకున్నారు. ఇప్పుడు అక్కడ ప్రజలు వీధుల్లో సంతోషంతో గంతులు వేస్తున్నారు. కానీ అదే సమయంలో చాలా బాంబులు కూడా పేలుతున్ాయి" అని అన్నారు.</p> <p data-path-to-node="6"><strong data-path-to-node="6" data-index-in-node="0">చరిత్రలోనే అత్యంత హింసాత్మక పాలకుడిగా ఖమేనీని అభివర్ణించిన ట్రంప్</strong></p> <p data-path-to-node="6">అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హత్య తర్వాత పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. 1979 విప్లవం తర్వాత ఇరాన్&zwnj;కు ఇది అత్యంత కీలకమైన పరిణామం. అప్పటి నుండి అమెరికా సైన్యం, స్థావరాలు ఉన్న మిడిల్ ఈస్ట్ దేశాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేస్తోంది. అంతకుముందు ట్రంప్ మాట్లాడుతూ, ఇరాన్&zwnj;పై దాడి ఉద్దేశ్యం 'చరిత్రలోనే అత్యంత హింసాత్మక పాలకులపై దాడి'గా పేర్కొన్నారు. అమెరికా 'కేవలం తన కోసమే కాకుండా ప్రపంచం కోసం' చర్యలు తీసుకుంటోందని ఆయన అన్నారు. ఫ్లోరిడాలోని పామ్ బీచ్&zwnj;లో ఉన్న తన మార్-ఎ-లాగో నివాసం నుండి ట్రంప్ ఈ దాడులను పర్యవేక్షిస్తున్నారు.</p>
Read Entire Article