Infosys Campus: విశాఖలో ఇన్ఫోసిస్‌ క్యాంపస్.. 20 ఎకరాలు భూమి కేటాయింపు.. రూ.750 కోట్ల ప్రాజెక్టుతో 7 వేల జాబ్స్

1 month ago 5
ARTICLE AD
<p>విశాఖపట్నం: ప్రముఖ అంతర్జాతీయ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ లిమిటెడ్ (Infosys) ఆంధ్రప్రదేశ్&zwnj;లోని విశాఖపట్నంలో తన శాశ్వత క్యాంపస్&zwnj;ను ఏర్పాటు చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖను గ్లోబల్ ఐటీ హబ్&zwnj;గా మార్చేందుకు వేస్తున్న ఈ అడుగులో భాగంగా సుమారు రూ.750 కోట్ల భారీ పెట్టుబడిని ఇన్ఫోసిస్ ప్రకటించింది. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 7,000 మంది నిపుణులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మరికొంతమందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.&nbsp;</p> <p><strong>ఇన్ఫోసిస్ సంస్థకు భూమి కేటాయింపు</strong><br />విశాఖపట్నం రూరల్ మండలం ఎండాడ గ్రామంలోని 20 ఎకరాల భూమిని ఈ క్యాంపస్ కోసం కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్ (లిఫ్ట్) పాలసీ 4.0 క్రింద అత్యంత రాయితీతో, అంటే కేవలం 99 పైసలకే ఈ భూములను కేటాయించడం విశేషం. దీనితో పాటు ఏపీ ఐటీ, జీసీసీ పాలసీల ప్రకారం వివిధ ప్రోత్సాహకాలను పొందేందుకు ప్రభుత్వం అనుమతించింది.</p> <p>ప్రస్తుతం విశాఖలో అద్దె భవనం నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ఇన్ఫోసిస్ సంస్థ ఈ శాశ్వత ప్రాజెక్టును ఆరేళ్ల కాలపరిమితిలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా మొదటి దశ నిర్మాణ పనులను 2029 జనవరి నాటికి పూర్తి చేయాలని భావిస్తోంది. సాధారణంగా లిఫ్ట్ పాలసీ నిబంధనల ప్రకారం ఎకరాకు 500 ఉద్యోగాలు కల్పించాల్సి ఉండగా, ఇన్ఫోసిస్ అంతకు మించి 20 ఎకరాలకు గాను 7,000 మందికి ఉపాధి కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. విశాఖలో టైర్-1 కంపెనీల ప్రాధాన్యతను గుర్తించిన ప్రభుత్వం, ఈ క్యాంపస్&zwnj;ను సుమారు 10 వేల సీటింగ్ సామర్థ్యంతో నిర్మించాలని ఇన్ఫోసిస్&zwnj;ను కోరింది.</p> <p>ఈ భారీ ప్రాజెక్టుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో ఏపీ ప్రభుత్వం ఇన్ఫోసిస్&zwnj;కు పూర్తి సహకారాన్ని అందిస్తోంది. రోడ్లు, విద్యుత్, నీటి వసతుల అభివృద్ధి కోసం ఐటీ శాఖకు ప్రభుత్వం ఇప్పటికే రూ.79 కోట్లు మంజూరు చేసింది. క్యాంపస్&zwnj;కు నిరంతరం పర్యావరణ హితమైన Green Energy విద్యుత్తును అందించే బాధ్యతను ఇంధన శాఖకు అప్పగించింది. భవిష్యత్తులో ఉద్యోగుల ప్రయాణ సౌలభ్యం కోసం సమీప మెట్రో స్టేషన్ నుండి నేరుగా క్యాంపస్&zwnj;కు కనెక్టివిటీ కల్పించే ప్రతిపాదనలు కూడా పరిశీలనలో ఉన్నాయి. ఈ కేటాయించిన భూమిలో ఉన్న కొండ రాళ్లను తొలగించి నిర్మాణానికి అనువుగా మార్చడానికి అవసరమైన అనుమతుల ప్రక్రియను ప్రభుత్వం తేలిక చేసింది. ఈ నిర్ణయం విశాఖ ఐటీ రంగానికి మరింత బూస్టింగ్ ఇవ్వనుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.</p> <p><br /><br /></p>
Read Entire Article