Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం ఊతం.. తెలంగాణలో 4.13 లక్షల ఇళ్లకు నిధులు కేటాయింపు

2 months ago 7
ARTICLE AD
<p>హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అర్హులైన నిరుపేదల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి శుభవార్త వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభత్వానికి ఆర్థిక తోడ్పాటు లభించనుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) కింద తెలంగాణలోని సుమారు 4.13 లక్షల ఇళ్లకు కేంద్రం తన వాటాను అందించనుంది. ఈ నిధుల ద్వారా పట్టణ ప్రాంతాల్లో నిర్మించే ఒక్కో ఇంటికి 1.50 లక్షల రూపాయలు, గ్రామీణ ప్రాంతాల్లోని ఇంటికి 72 వేల రూపాయల చొప్పున కేంద్రం తమ వాటా అందజేయనుంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 13 లక్షల ఇళ్లకు నిధులు కావాలని రాష్ట్రం కోరింది. అందులో ప్రస్తుతానికి 4.13 లక్షల ఇళ్లకు కేంద్రం వాటా చెల్లింపులకు లైన్ క్లియర్ అయ్యింది.</p> <p><strong>పట్టణ ప్రాంతాల్లో ఇండ్లకు నిధులు..&nbsp;</strong><br />కేంద్రం, రాష్ట్రాలు పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నాయి. పీఎంఏవై అర్బన్ 2.0 పథకం కింద 2026-27 సంవత్సరానికి గాను తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం 1.13 లక్షల ఇళ్లను కేటాయించనుంది. ఇదివరకే 10 వేల ఇళ్లు మంజూరు కాగా, మిగిలిన 1.03 లక్షల ఇళ్లకు 1,690 కోట్లు కేంద్రం త్వరలో విడుదల చేయనుంది. దీంతోపాటు గతంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో పెండింగ్&zwnj;లో ఉన్న 33 వేల ఇళ్లకు మరో రూ.500 కోట్ల బకాయిలను కూడా కేంద్రం కేటాయించనుంది. దాంతో పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణ పనులు వేగవంతమై వారి సొంతింటి కల సాకారం అవుతుందని ఆశలు పెట్టుకున్నారు.&nbsp;</p> <p><strong>గ్రామాలకు పీఎంఏవై నిధులు..</strong><br />గ్రామీణ ప్రాంతాల విషయానికి వస్తే, సుమారు 25 లక్షల ఇళ్లకు నిధులను తెలంగాణ ప్రభుత్వం కోరింది. కానీ ప్రస్తుత కేటాయింపుల ప్రకారం 3 లక్షల ఇళ్లకు నిధులు రానున్నానని గృహ నిర్మాణ శాఖ భావిస్తోంది. ఈ ఇండ్లకు గానూ తెలంగాణకు రూ.2,160 కోట్లు రానున్నాయి. ఆదివాసీల సంక్షేమం కోసం కేంద్రం ఇప్పటికే 10 వేల ఇళ్లను మంజూరు చేసింది. వీటిలో ఒక్కో ఇంటికి రూ.1.20 లక్షల చొప్పున కేంద్రం నిధులు ఇవ్వనుంది. ఈ నిధుల కనుక రాష్ట్రానికి వస్తే, వాటికి రాష్ట్రం నిధులు జత చేస్తే గ్రామీణ పేదలకు సొంత ఇంటి కల నెరవేరనుంది.</p>
Read Entire Article