Indian Railways: రైళ్లలో మద్యం తీసుకెళ్లవచ్చా ? - ఈ డౌట్ ఉంటే ఇది మీ కోసమే

4 weeks ago 2
ARTICLE AD
<p>Indian Railways liquor carrying rules: ట్రైన్ ప్రయాణికుల మధ్య తరచుగా వినిపించే ప్రశ్న &ndash; "ట్రైన్&zwnj;లో మద్యం బాటిల్స్ తీసుకెళ్లవచ్చా? అనే. &nbsp;ఈ సందేహానికి స్పష్టమైన సమాధానం భారతీయ రైల్వేస్ ఇచ్చింది. &nbsp;మద్యం తీసుకెళ్లడం , తాగడం రెండూ కఠినంగా నిషేధించినట్లుగా రైల్వేశాఖ ప్రకటించింది. &nbsp;ఇటీవలి అధికారిక ప్రకటనల ప్రకారం, మద్యం తీసుకెళ్లడం ప్రయాణికుల భద్రతకు ముప్పు కలిగిస్తుందని, ఇది ఇతరులకు అసౌకర్యాన్ని కలిగిస్తుందని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ఈ నియమాలు రైల్వే చట్టం 1989, రాష్ట్ర ఎక్సైజ్ చట్టాలు , &nbsp;పబ్లిక్ న్యూసెన్స్ చట్టాలపై ఆధారపడి ఉన్నాయి.&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;</p> <p><strong>లిక్కర్ బాటిళ్ల రవాణా పూర్తి నిషేధం</strong><br />&nbsp;<br />భారతీయ రైల్వేస్ ప్రకారం, ప్యాసింజర్ ట్రైన్&zwnj;లలో మద్యం, &nbsp;లిక్వర్ బాటిల్స్ తీసుకెళ్లడం పూర్తిగా నిషేధించారు. &nbsp;రైన్&zwnj;లు పబ్లిక్ స్పేస్&zwnj;లు కావడంతో, మద్యం తీసుకెళ్లడం లేదా తాగడం భద్రతా సమస్యలు, అనవసర గొడవలకు దారితీస్తుంది. &nbsp;సీల్డ్ బాటిల్స్ కూడా అనుమతించరు. గతంలో &nbsp;1-2 లీటర్ల వరకు అనుమతి ఉందని &nbsp;ప్రచారం ఉన్నప్పటికీ &nbsp;2025లో అధికారికంగా పూర్తి నిషేధం. రాష్ట్రాల మధ్య ప్రయాణాల్లో డ్రై స్టేట్స్ &nbsp;గుజరాత్, బిహార్, నాగాలాండ్ వంటి చోట్ల మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటారు. &nbsp;ట్రైన్&zwnj;లో, ప్లాట్&zwnj;ఫామ్&zwnj;లలో లేదా స్టేషన్లలో మద్యం తాగడం చట్టవిరుద్ధం. రన్నింగ్ స్టాఫ్ &nbsp;డ్రైవర్లు, గార్డులు &nbsp;మద్యం తాగకూడదు. &nbsp;సీల్డ్ బాటిల్స్ కూడా అనుమతి లేదు. పాత నియమాల్లో 750 మి.లీ. నుంచి 2 లీటర్ల వరకు పరిమితి ఉండేది.. కానీ ఇప్పుడు అనుమతించడం లేదు.&nbsp; &nbsp; &nbsp; &nbsp;</p> <p><strong>గతంలో సీల్డ్ బాటిళ్లకు అనుమతి - ఇప్పుడు నిషేధం&nbsp;</strong></p> <p>మద్యం తీసుకెళ్లడం రాష్ట్ర ఎక్సైజ్ చట్టాలపై ఆధారపడి ఉంటుంది. &nbsp;గుజరాత్, బిహార్, మిజోరామ్, నాగాలాండ్, లక్షద్వీప్ లలో మద్య నిషేధం ఉంది. ఆయా రాష్ట్రాల మీదుగా మద్యం తీసుకెళ్లడం చట్టవిరుద్ధం. ఇక్కడి రైల్వే స్టేషన్లలో రాష్ట్ర ఎక్సైజ్ అధికారులు చెకింగ్ చేస్తారు. &nbsp;ఉదాహరణకు, గుజరాత్ దాటి ముంబైకి వెళ్తున్న ట్రైన్&zwnj;లో మద్యం ఉంటే, ఆ స్టేట్&zwnj;లోనే పట్టుబడితే కేసు పెడతారు.&nbsp;</p> <p>మద్యం తీసుకెళ్లడం లేదా తాగడం పట్టుబడితే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) జరిమానా విధిస్తుంది. ధారణంగా ₹500 నుంచి ₹5,000 వరకు, కానీ డ్రై స్టేట్స్&zwnj;లో ₹10,000 వరకు లేదా జైలు శిక్ష కూడా ఉంటుంది. &nbsp;ట్రైన్ నుంచి దింగేయటం, మద్యం జప్తు, లీగల్ యాక్షన్ వంటివి తీసుకుంటారు. &nbsp;రైల్వే సిబ్బంది మద్యం తాగితే సస్పెన్షన్ లేదా &nbsp;ఉద్ోయగం నుంచి తొలగిస్తారు.&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;&nbsp;</p> <p>గతంలో కొన్ని రాష్ట్రాల్లో సీల్డ్ బాటిల్స్ అనుమతించేవి, కానీ భద్రతా సమస్యలు పెరగడంతో 2025లో పూర్తి నిషేధం విధించారు. ఫ్లైట్స్&zwnj;లో చెక్డ్ బ్యాగేజ్&zwnj;లో 5 లీటర్ల వరకు అనుమతి ఉన్నప్పటికీ, ట్రైన్&zwnj;లలో ఇది అనుమతించడం లేదు.&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;&nbsp;</p> <p><iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://telugu.abplive.com/web-stories/india/bihar-is-a-great-place-what-if-you-knew-about-these-226182" width="631" height="381" scrolling="no"></iframe></p> <p>&nbsp;</p>
Read Entire Article