India US Trade Deal : భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై పియూష్ గోయల్ కీలక ప్రకటన; సంతకం చేసే టైం వెల్లడి! 

2 months ago 6
ARTICLE AD
<p><strong>India US Trade Deal :</strong> భారత్, అమెరికా మధ్య ఒక ప్రధాన వాణిజ్య ఒప్పందం ప్రకటించిన తర్వాత, రెండు దేశాలు ఇప్పుడు ఒప్పందం పూర్తి వివరాలు వెల్లడికి సిద్ధమవుతున్నాయి. దీనిపై ఒక ఉమ్మడి ప్రకటన రెడీ చేస్తున్నాయి. ఈ ఉమ్మడి ప్రకటన రాబోయే నాలుగు నుంచి ఐదు రోజుల్లో లేదా అంతకంటే ముందుగానే వస్తుంది. రెండు రోజుల తరువాత, అమెరికా ఒక కార్యనిర్వాహక ఉత్తర్వు జారీ చేస్తుందని భావిస్తున్నారు, ఇది భారతీయ వస్తువులపై సుంకాలను 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తుంది.</p> <p>ఈ సమాచారాన్ని కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్, వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ అందించారు. ఈ వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన అదే హై-ప్రొఫైల్ వాణిజ్య ఒప్పందం ఇదేనని వివరించారు. ఈ ఒప్పందంపై దాదాపు ఒక సంవత్సరం నుంచి చర్చలు కొనసాగుతున్నాయి. మార్చి మధ్య నాటికి ఈ ఒప్పందం అధికారికంగా సంతకాలు జరగొచ్చని పియూష్ గోయల్ కూడా పేర్కొన్నారు.</p> <h3>నాలుగు నుంచి ఐదు రోజుల్లో ఉమ్మడి ప్రకటన&nbsp;</h3> <p>న్యూఢిల్లీలో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) అధికారులతో సంయుక్త విలేకరుల సమావేశం తర్వాత విలేకరులతో మాట్లాడుతూ పియూష్ గోయల్ మాట్లాడుతూ, "ఇద్దరు నాయకులు అంగీకరించినట్లుగా భారత్&zwnj;, యునైటెడ్ స్టేట్స్ మధ్య మంచి చర్చలు జరుగుతున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బిటిఎ) మొదటి దశ దాదాపు సిద్ధంగా ఉంది. రాబోయే నాలుగు నుంచి ఐదు రోజుల్లో లేదా ముందుగానే, భారత్&zwnj;, యునైటెడ్ స్టేట్స్ మధ్య ఉమ్మడి ప్రకటన జారీ అవుతుందని, దాని ఆధారంగా, ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆశిస్తున్నాము."</p> <p>ఈ ఉమ్మడి ప్రకటన తర్వాత, భారత్&zwnj;పై విధించిన 25 శాతం సుంకం, 25 శాతం జరిమానా సుంకాన్ని అమెరికా మొత్తం 50 శాతంగా 18 శాతానికి తగ్గించవచ్చని పియూష్&zwnj; వివరించారు. ఇది తరువాత అధికారిక ముసాయిదా ఒప్పందానికి దారి తీస్తుంది, దీనిపై మార్చి మధ్యలో న్యూఢిల్లీ, వాషింగ్టన్ మధ్య సంతకం చేస్తారని భావిస్తున్నారు.</p> <h3>కొత్త టారిఫ్ ఒక కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా అమలు&nbsp;</h3> <p>అమెరికా కార్యనిర్వాహక ఉత్తర్వు తర్వాత కొత్త 18 శాతం సుంకం అమల్లోకి వస్తుందని పియూష్ గోయల్ అన్నారు. ఉమ్మడి ప్రకటన జారీ అయిన రెండు రోజుల తర్వాత ఈ కార్యనిర్వాహక ఉత్తర్వు రావచ్చని ఆయన అన్నారు. "ఉమ్మడి ప్రకటన నాలుగు నుంచి ఐదు రోజుల్లో లేదా అంతకంటే ముందే రావచ్చు. మేము ఈ మొత్తం ప్రక్రియను చాలా వేగంగా పూర్తి చేయాలని చూస్తున్నాం" అని మంత్రి అన్నారు.</p> <h3>ఈ రంగాలకు ప్రత్యక్ష ప్రయోజనం&nbsp;</h3> <p>ఈ నిర్ణయం భారత్&zwnj; ఎగుమతులకు తక్షణ ప్రయోజనం చేకూరుస్తుంది, దీని విలువ $30 బిలియన్లకు పైగా ఉంటుందని అంచనా. వీటిలో వస్త్రాలు, రెడీమేడ్ దుస్తులు, తోలు ఉత్పత్తులు, పాదరక్షలు, సముద్ర ఉత్పత్తులు, &nbsp;సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (MSMEలు) ఉన్నాయి. ఈ విషయం తెలిసిన వ్యక్తులు సుంకం తగ్గింపు ఈ రంగాల్లో అమెరికాకు అమ్మకాలను పెంచుతుందని చెప్పారు.</p> <h3>రాజేష్ అగర్వాల్ తదుపరి ప్రక్రియను వివరించారు.</h3> <p>వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ కూడా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఉమ్మడి ప్రకటన అనేది ఒక సాధారణ ప్రక్రియ అని అన్నారు. "నాయకత్వ స్థాయిలో ఒప్పందం ఖరారైన తర్వాత, ఉమ్మడి ప్రకటన జారీ అవుతుంది. మంత్రి పియూష్ గోయల్ చెప్పినట్లుగా, అది రాబోయే నాలుగు నుంచి ఐదు రోజుల్లో లేదా అంతకంటే ముందుగానే రావచ్చు" అని ఆయన అన్నారు.</p> <p>ఉమ్మడి ప్రకటన తర్వాత, దీనిని చట్టపరమైన ఒప్పందంగా మారుస్తామని, ఆ ఒప్పందం అమల్లోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. దీనికి మార్చి మధ్యకాలం గడువు అని అగర్వాల్ పేర్కొన్నారు. భారత్&zwnj;లో సుంకాలు MFN వ్యవస్థ కింద నియంత్రిస్తున్నందున, చట్టపరమైన ఒప్పందంపై సంతకం చేసిన తర్వాతే భారత్&zwnj; సుంకాల తగ్గింపు జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. యునైటెడ్ స్టేట్స్&zwnj;లో, కార్యనిర్వాహక ఆదేశాల ద్వారా సుంకాలు విదిస్తున్నారు, కాబట్టి అక్కడ సుంకాలను తగ్గించే నిర్ణయం ముందుగానే ఉండవచ్చు.</p>
Read Entire Article