India Lockdown: భారత్‌లో లాక్‌డౌన్ విధింపుపై కేంద్ర మంత్రి హర్దీప్ పూరి కీలక వ్యాఖ్యలు

2 weeks ago 3
ARTICLE AD
<p style="text-align: justify;">న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు, ఎల్పీజీపై ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో దేశంలో మరోసారి లాక్&zwnj;డౌన్ దిశగా అడుగులు పడుతున్నాయని, ఆంక్షలు విధిస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ పూరి.. భారత్&zwnj;లో చమురు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రస్తుతానికి లాక్&zwnj;డౌన్ అంశం పరిశీలనలో కూడా లేదని స్పష్టం చేశారు. భారత్ అన్ని రకాలుగా చర్యలు తీసుకుని, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తుందన్నారు. నేడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వర్చువల్&zwnj;గా సమావేశం కానున్నారు.</p> <p style="text-align: justify;">చమురు ధరల పెరుగుదలపై ఎక్స్ లో పోస్ట్ చేసి సమాచారం అందించారు. గత నెల రోజులుగా అంతర్జాతీయ ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని, దాదాపు 70 డాలర్ల నుండి బ్యారెల్ దాదాపు 122 డాలర్లకు పెరిగాయని ఆయన తెలిపారు. దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఆగ్నేయాసియా దేశాల్లో దాదాపు 30 నుంచి 50% పెరిగింది. ఉత్తర అమెరికా దేశాల్లో 30 శాతం, యూరప్&zwnj;లో 20%,&nbsp; ఆఫ్రికా దేశాల్లో 50 శాతం పెరిగింది.</p> <p style="text-align: justify;">కేంద్ర ప్రభుత్వం వద్ద రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఇతర దేశాల మాదిరిగానే ఇంధన ధరలను భారీగా పెంచాలా లేదా పౌరులను అంతర్జాతీయ అస్థిరత నుండి రక్షించడానికి తమ ఆర్థిక వ్యవస్థపై భారం మోయాలా అని అన్నారు. ప్రధానమంత్రి మోదీ రష్యా- ఉక్రెయిన్ సంఘర్షణ ప్రారంభమైనప్పటి నుండి గత 4 సంవత్సరాలుగా తన ప్రభుత్వం చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ, భారత పౌరుల భద్రత కోసం మరోసారి ఆర్థిక పరిస్థితిపై భారం మోయాలని నిర్ణయించుకున్నారని తెలిపారు.</p> <blockquote class="twitter-tweet" data-media-max-width="560"> <p dir="ltr" lang="en">The global situation remains in flux, and we are closely monitoring developments across energy, supply chains, and essential commodities on a real-time basis.<br /><br />Under the leadership of Hon&rsquo;ble PM <a href="https://twitter.com/narendramodi?ref_src=twsrc%5Etfw">@narendramodi</a> Ji, all necessary steps are being taken to ensure uninterrupted&hellip;</p> &mdash; Hardeep Singh Puri (@HardeepSPuri) <a href="https://twitter.com/HardeepSPuri/status/2037383992174104773?ref_src=twsrc%5Etfw">March 27, 2026</a></blockquote> <p style="text-align: justify;"> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p style="text-align: justify;"><strong>ప్రభుత్వం ఆదాయంలో భారీ కోత&nbsp;</strong><br />అంతర్జాతీయ స్థాయిలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ సమయంలో చమురు కంపెనీలకు భారీ నష్టం వాటిల్లుతుంది. దాంతో లీటరుకు రూ. 24, డీజిల్పై లీటరుకు రూ. 30 వరకు లోటు ఉంది. దీన్ని తగ్గించడానికి ప్రభుత్వం తన ఆదాయంలో భారీ కోత విధించిందని కేంద్ర మంత్రి హర్దీప్ పూరి తెలిపారు. పెట్రోల్, డీజిల్ అంతర్జాతీయ ధరలు భారీగా పెరగడం వల్ల ఎగుమతి పన్ను కూడా విధిస్తారు. విదేశాలకు ఎగుమతి చేసే ఏదైనా రిఫైనరీ ఎగుమతి పన్ను చెల్లించవలసి ఉంటుంది.</p> <p style="text-align: justify;"><strong>లాక్డౌన్ గురించి ఏమన్నారు</strong><br />ప్రపంచ పరిస్థితి ఇంకా అనిశ్చితంగానే ఉందని, ఇంధనం, అవసరమైన వస్తువులకు సంబంధించిన పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తున్నామని హర్దీప్ పూరి అన్నారు. ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో దేశంలో ఇంధనం, ఎనర్జీతో పాటు ఇతర అవసరమైన వస్తువుల సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రభుత్వం చూసుకుంటోంది. అన్ని సవాళ్లను ఎదుర్కోవడానికి మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని తెలిపారు..</p> <p style="text-align: justify;">&nbsp;గతంలో కూడా ప్రపంచ అనిశ్చితి మధ్య భారత్ తన బలాన్ని చాటుకుందని, భవిష్యత్తులోనూ సమయానికి అనుగుణంగా, సమన్వయంతో చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి మర్దీప్ పూరి అన్నారు. లాక్డౌన్ గురించి వస్తున్న పుకార్లు పూర్తిగా అవాస్తవం అన్నారు. ప్రభుత్వం స్థాయిలో అలాంటి ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని క్లారిటీ ఇచ్చారు. ఎవరూ వదంతులను వ్యాప్తి చేయవద్దని, బాధ్యతాయుతంగా నడుచుకోవాలని పౌరులకు సూచించారు.</p>
Read Entire Article