India China Relations: అమెరికాతో విభేదాల మధ్య భారత్ కీలక నిర్ణయం.. చైనా ఫుల్ హ్యాపీ, ఎవరికి ప్రయోజనం!

2 weeks ago 2
ARTICLE AD
<p style="text-align: justify;" data-start="99" data-end="528"><strong>India Resumes Tourist Visa For Chinese Citizens::</strong> అమెరికా నుంచి ట్రేడ్ డీల్ కు అంగీకారం కుదిరినట్లు ప్రచారం జరుగుతోంది. కానీ ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. దీనివల్ల సుంకాల రేట్లు తగ్గుతాయని భావిస్తున్నారు. ఇది భారతీయ ఎగుమతిదారులకు గొప్ప ఉపశమనం కలిగిస్తుంది. వారు అమెరికా మార్కెట్లో పోటీని కొనసాగించగలుగుతారు. అదే సమయంలో అమెరికాకు ప్రత్యామ్నాయంగా ఇతర దేశాలతో సంబంధాలను బలోపేతం చేయడంపై భారత్ దృష్టి సారించింది. ముఖ్యంగా డోక్లాం వివాదం తర్వాత చైనాతో సంబంధాలు చెడిపోయాయి. పరిస్థితులను మార్చి, చైనాతో సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావడానికి దాదాపు ఐదేళ్ల తరువాత నేతలు, అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.</p> <p><strong>చైనా కోసం పర్యాటక ద్వారాలు తెరుచుకున్నాయి</strong></p> <p style="text-align: justify;" data-start="530" data-end="930">భారత్ ఇటీవల చైనా పర్యాటకులకు తన పర్యాటక కేంద్రాలకు డోర్లు తెరిచింది. ఇప్పుడు చైనా పౌరులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత మిషన్లు, కాన్సులేట్ల ద్వారా భారతదేశ పర్యాటక వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సంవత్సరం జూలైలో భారత్ చైనా పౌరులకు పర్యాటక వీసాలను మళ్లీ జారీ చస్తున్నట్లు ప్రకటించింది. దాంతో చైనీయులకు టూరిస్ట్ వీసాలు ప్రారంభించారు. మే 2020లో తూర్పు లద్దాఖ్&zwnj;లో ఎల్&zwnj;ఏసీ వద్ద సైనిక చర్య ప్రారంభమైన తర్వాత ఆ దేశ పౌరులకు టూరిస్ట్ వీసా సౌకర్యాన్ని నిలిపివేశారు.</p> <p style="text-align: justify;" data-start="932" data-end="1257">వార్తా సంస్థ పిటిఐ వర్గాల ప్రకారం, ఈ వారం ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత ఎంబసీలు, కాన్సులేట్లలో చైనా పౌరులకు పర్యాటక వీసాలను జారీ చేసే ప్రక్రియను తిరిగి ప్రారంభించారు. దీని తరువాత బీజింగ్&zwnj;లోని భారత రాయబార కార్యాలయం, షాంఘై, గ్వాంగ్&zwnj;జౌ, హాంకాంగ్&zwnj;లోని కాన్సులేట్&zwnj;లలో దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభించారు.</p> <p><strong>ఇరు దేశాల సంబంధాలపై ప్రభావం ఏమిటి?</strong></p> <p style="text-align: justify;" data-start="1259" data-end="1617">గత కొన్ని నెలల్లో భారత్, చైనా సంబంధాలను స్థిరపరచడానికి ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. అమెరికాతో గిల్లిగజ్జాల కారణంగా చైనా సైతం భారత్ వైపు చూస్తోంది. అమెరికా విధించిన సుంకాలు దెబ్బకు పలు దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. పలు దేశాల్లో మార్కెట్లపై ట్రంప్ నిర్ణయాలు ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలో భారత్, చైనాలు తమ మధ్య సంబంధాలను తిరిగి ట్రాక్&zwnj;లోకి తీసుకురావడానికి అనేక ప్రజా కేంద్రీకృత చర్యలు చేపట్టాయి. వీటిలో భాగంగా కైలాస మానస సరోవర్ యాత్రను ప్రారంభించడం, భారత్ నుంచి చైనాకు నేరుగా విమానాలను తిరిగి ప్రారంభించడం, దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం తెలిసిందే. చైనా పౌరులకు వీసా సౌకర్యాలను సులభతరం చేయడం వంటివి ఉన్నాయి. అక్టోబర్&zwnj;లో ఇరు దేశాల మధ్య నేరుగా విమానాలు కూడా తిరిగి ప్రారంభమయ్యాయి.</p>
Read Entire Article