India-China Direct Flights: 5 ఏళ్ల తరువాత భారత్ నుంచి చైనాకు డైరెక్ట్ ఫ్లైట్.. ఇరు దేశాలకు ముఖ్యమైన రోజు

1 month ago 2
ARTICLE AD
<p style="text-align: justify;">Flights Between India and China | న్యూఢిల్లీ: భారత్, చైనా మధ్య విమాన సర్వీసులు ఈ రోజు నుండి తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఆదివారం (అక్టోబర్ 26) రాత్రి 10 గంటలకు కోల్&zwnj;కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇండిగో విమానం 6E1703 చైనాలోని గ్వాంగ్&zwnj;జౌకు బయలుదేరుతుంది. నవంబర్ 9 నుండి ఢిల్లీ- గ్వాంగ్&zwnj;జౌ మార్గంలోనూ డైరెక్ట్ ఫ్టైట్ సర్వీసులు ప్రారంభించనున్నారు. 5 సంవత్సరాల తర్వాత రెండు దేశాల మధ్య ఎయిర్ కనెక్టివిటీ అధికారికంగా తిరిగి ప్రారంభించిస్తున్నారు.</p> <p style="text-align: justify;">ఈ రోజు రాత్రి కోల్&zwnj;కతా ఎయిర్&zwnj;పోర్ట్ నుంచి బయలుదేరనున్న ఇండిగో విమానం కేవలం ఆకాశంలో చేసే ప్రయాణం మాత్రమే కాదు, గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ తర్వాత తెగిపోయిన సంబంధాలు పునరుద్ధరిస్తున్నారు. అమెరికా టారిఫ్ వార్ మధ్య భారత్, చైనాలు కొత్త దౌత్యపరమైన ప్రారంభానికి ఇది సంకేతం.</p> <p style="text-align: justify;"><strong>టియాంజిన్&zwnj;లో జిన్ పింగ్, మోదీ కీలక సమావేశం..</strong></p> <p style="text-align: justify;">ఆగస్టు 31న టియాంజిన్&zwnj;లో చైనా అధ్యక్షుడు షీ జిన్&zwnj;పింగ్&zwnj;తో సమావేశమైన సందర్భంగా భారత ప్రధానమంత్రి <a title="నరేంద్ర మోదీ" href="https://www.abplive.com/topic/narendra-modi" data-type="interlinkingkeywords">నరేంద్ర మోదీ</a> డైరెక్ట్ విమాన సర్వీసులు పునరుద్ధరించడంపై పరిశీలిస్తున్నామని చెప్పారు. దీని తరువాత భారత్ దౌత్యపరమైన చర్యలు తీసుకుంది, ఇప్పుడు కోల్&zwnj;కతా నుంచి చైనాలోని గ్వాంగ్&zwnj;జౌకు 5 ఏళ్ల తరువాత తొలి విమానం వెళ్తోంది. జూన్ 2020లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల తరువాత, రెండు దేశాల సంబంధాలు 1962 యుద్ధం తరువాత మరోసారి క్షీణించాయి. పలు సైనిక, దౌత్యపరమైన చర్చల తరువాత, రెండు పక్షాలు LACలోని అనేక వివాదాస్పద ప్రాంతాల నుండి తమ సైన్యాన్ని దశలవారీగా ఉపసంహరించుకున్నాయి.</p> <p style="text-align: justify;">గల్వాన్ లోయలో భారత సైన్యంపై దాడి తరువాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తత చాలా పెరిగింది. అక్టోబర్ 2023లో డెప్సాంగ్, డెమ్&zwnj;చోక్ వంటి చివరి వివాదాస్పద అంశాలపై ఒక ఒప్పందం కుదిరింది. తరువాత కజాన్&zwnj;లో మోదీ, జిన్ పింగ్ చర్చలలో సంబంధాలను మెరుగుపరచడానికి అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా త్వరలోనే కైలాస మానస సరోవర్ యాత్రను పునరుద్ధరించడం వంటి చర్యలు ఉన్నాయి. ఇప్పుడు నేరుగా విమానాలను పునరుద్ధరించడం ఈ ప్రక్రియలో ఒక ముఖ్యమైన భాగంగా పరిగణించవచ్చు.</p> <p style="text-align: justify;"><strong>నేరుగా విమాన సర్వీసుల వల్ల ఎవరికి ప్రయోజనం?</strong></p> <p style="text-align: justify;">భారత్- చైనా మధ్య విమాన సర్వీసులు ప్రారంభం కావడం ప్రయాణికులు, వ్యాపారులు, విద్యార్థులకు ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపార ప్రతినిధులకు నేరుగా జర్నీ చేసే వీలుంటుంది. చైనా వెళ్లే భారతీయ విద్యార్థులకు సమయంతో పాటు డబ్బు రెండూ ఆదా అవుతాయి. దీనితో పాటు వైద్య, మతపరమైన యాత్రలలో (కైలాస మానస సరోవర్) సౌలభ్యానికి ఇబ్బంది ఉండదు. దీని కారణంగా ఇరు దేశాల మధ్య దిగుమతి-ఎగుమతిలో వేగం పెరుగుతుందని ఆర్థిక నిపుణులు, ఇరు దేశాల ఉన్నత స్థాయి అధికారులు భావిస్తున్నారు. సానుకూల స్పందన వస్తే, రాబోయే నెలల్లో ముంబై, బెంగళూరు, చెన్నై నరగాల నుండి కూడా చైనాలోని వివిధ నగరాలకు విమాన సర్వీసులు ప్రారంభించవచ్చని విమానయాన రంగం అంచనా వేసింది.</p> <p style="text-align: justify;">&nbsp;</p>
Read Entire Article